సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇథనాల్ తయారీకి 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్
ప్రభుత్వ అనుమతి
దిల్లీ: ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చక్కెర ఉత్పత్తి సమయంలో విడుదలయ్యే బి-హెవీ మొలాసిస్ అదనపు నిల్వలు ప్రస్తుతం మిల్లుల వద్ద ఉన్నాయి. ఇథనాల్ ఉత్పత్తికి దీనిని వినియోగించొద్దని గతేడాది డిసెంబరు 7న ప్రభుత్వం నిషేధం విధించినా, వారం తర్వాత ఆ ఉత్తుర్వులను వెనక్కి తీసుకుంది. అయితే 2023-24 సరఫరా ఏడాది (నవంబరు-డిసెంబరు)లో ఇథనాల్ ఉత్పత్తి కోసం 17 లక్షల టన్నుల చక్కెరను వినియోగించేందుకే అనుమతించింది. తాజాగా ఇథనాల్ ఉత్పత్తికి బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చామని, పెట్రోలియం శాఖకు ఈ విషయాన్ని చేరవేశామని ఆహార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 17 లక్షల టన్నుల చక్కెర పరిమితికి ఇది అదనమని అన్నారు.
ఆ ప్రకటనలు నమ్మొద్దు: ఎల్ఐసీ
ఈనాడు, హైదరాబాద్: పలు సామాజిక మాధ్యమాల్లో తమ పేరుతో వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రజలకు సూచించింది. కొందరు వ్యక్తులు, సంస్థలు ఎల్ఐసీ పేరుతో వివిధ సామాజిక మాధ్యమాల్లో మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. సంస్థకు చెందిన ఉన్నతాధికారులు, మాజీ ఉద్యోగుల చిత్రాలతో పాటు, సంస్థ పేరు, లోగో వినియోగించి, ఆయా ప్రకటనలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ తరహా ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, పాలసీదారులకు ఎల్ఐసీ సూచించింది. ఇలాంటి వాటిని గుర్తించిన వెంటనే ఎల్ఐసీ అధికారిక సామాజిక వేదికలపై ఫిర్యాదు చేయాలని తెలిపింది. మోసపూరితంగా ప్రవర్తించిన వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలు, పాలసీదారులు అధీకృత సమాచారం కోసం ఎల్ఐసీ వెబ్సైట్, సేవా కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపింది.
ఉద్యోగులందరికీ వాటాలు: క్రిటికల్రివర్
హైదరాబాద్ (బేగంపేట), న్యూస్టుడే: సాంకేతిక సేవల సంస్థ క్రిటికల్రివర్ తన ఉద్యోగులందరికీ సంస్థలో వాటాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులందరికీ సంస్థలో యాజమాన్యం ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అంజి మారం, సీఎఫ్ఓ చంద్ర చంద్రగిరి బుధవారం ఇక్కడ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తమ 9 కేంద్రాల్లో 1,000 మందికి పైగా ఉద్యోగులున్నారని, వీరందరికీ ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీ) ద్వారా షేర్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగి పనిచేసిన కాలానికి ఏడాదికి 100 షేర్ల చొప్పున, పనితీరు ఆధారంగా మరికొన్ని షేర్లూ ఇస్తామని పేర్కొన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే సంస్తృతిని పెంపొందించడం, ఉద్యోగులకు సాధికారత, సంస్థ విజయాల్లో వారిని భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థ ఆదాయం రూ.500 కోట్ల మేరకు ఉందని, 2030 నాటికి రూ.4వేల కోట్ల స్థాయికి చేర్చాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్లు వివరించారు. ఆ తర్వాత ఐపీఓకి వస్తామని అంజి మారం తెలిపారు.
లీ కూపర్ నుంచి పర్యావరణహిత జీన్స్
హైదరాబాద్: ప్రముఖ డెనిమ్ బ్రాండ్ లీ కూపర్ పర్యావరణహిత జీన్స్ కలెక్షన్ను తీసుకొచ్చింది. రీసైకిల్ చేసిన సిగరెట్ పీకల్లోని పదార్థంతో ఈ జీన్స్ను తయారు చేశామని, ప్రపంచంలో ఇది తొలిసారని కంపెనీ తెలిపింది. ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్సి పురస్కరించుకుని కంపెనీ ఈ కలెక్షన్ విడుదల చేసింది. భారత్లో కంటెంట్ సృష్టికర్తలకు ఈ కలెక్షన్ను లీ కూపర్ అంకితమిచ్చింది. కంటెంట్ సృష్టికర్తలు కేవలం ఇన్ఫ్లూయెన్సర్లు కాదని, ఎకోఇన్ఫ్లూయెన్సర్లని అభివర్ణించింది. ధానేలోని లీ కూపర్ ప్రత్యేక స్టోర్లో డిజైనర్ కరణ్ కుంద్రా ఈ కలెక్షన్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో 60కు పైగా కంటెంట్ సృష్టికర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
ఉద్యోగం కోసం అభ్యర్థులు భిన్న మార్గాలను ఎంచుకుంటుంటారు. రిక్రూటర్ మెప్పు పొందేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఎత్తివేసింది. మహారాష్ట్రలో ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు