యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
ముంబయి: ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాలంలో రూ.5,728.42 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. సిటీబ్యాంక్ వ్యాపారాన్ని కొనుగోలు చేసిన ఫలితంగా, 2022-23 మార్చి త్రైమాసికంతో పాటు ఆ ఆర్థిక సంవత్సర గణాంకాల పైనా ప్రభావం పడిందని యాక్సిస్ బ్యాంక్ వివరించింది. 2023-24 మార్చి త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.35,990 కోట్లకు పెరిగింది. 2022-23 ఇదే కాల ఆదాయం రూ.28,758 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 11% పెరిగి రూ.13,089 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం 41% పెరిగి రూ.6,766 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 0.05% పెరిగి 4.06 శాతానికి చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్పీఏ) 2.02% నుంచి 1.43 శాతానికి తగ్గాయి.
- 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ నికర లాభం 160% వృద్ధితో రూ.24,861.43 కోట్లకు చేరింది. మొత్తం వ్యాపారం 12% పెరిగి 2024 మార్చి 31కి రూ.14,77,209 కోట్లకు చేరింది.
- సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ 12.4 లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేసింది. గత 9 త్రైమాసికాల్లో దేశంలో అత్యధిక క్రెడిట్ కార్డ్లు జారీ చేసింది తమ బ్యాంకేనని ఎక్స్ఛేంజీలకు యాక్సిస్ బ్యాంక్ సమాచారమిచ్చింది.
- సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ కొత్తగా 125 శాఖలను, పూర్తి ఆర్థిక సంవత్సరంలో 475 శాఖలను ప్రారంభించింది. దీంతో దేశీయంగా మొత్తం శాఖల సంఖ్య 5,377కు చేరింది.
- సిటీ బ్యాంక్ వ్యాపార కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఉందని, వచ్చే 6 నెలల్లో ఆ బ్యాంక్ అనుసంధానం పూర్తవుతుందని యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ అమితాబ్ చౌధ్రీ వెల్లడించారు. గత ఏడాది సిటీ బ్యాంక్కు చెందిన భారత కన్జూమర్ వ్యాపారాన్ని సిటీ బ్యాంక్ ఎన్.ఎ. నుంచి, ఎన్బీఎఫ్సీ కన్జూమర్ వ్యాపారాన్ని సిటీకార్ప్ ఫైనాన్స్ (ఇండియా) లిమిటెడ్ నుంచి యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసింది.
- రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.1 చొప్పున (50%) డివిడెండ్ను బ్యాంక్ బోర్డు ప్రతిపాదించింది. బీఎస్ఈలో బుధవారం యాక్సిస్ బ్యాంక్ షేరు 0.69% పెరిగి రూ.1,063.70 వద్ద ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..