కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది.
ఆన్లైన్లో కొత్త ఖాతాదార్లను జతచేసుకోవద్దు
క్రెడిట్ కార్డులు జారీ చేయొద్దు
‘ఐటీ రిస్క్ మేనేజ్మెంట్’లో లోటుపాట్లే కారణం
ముంబయి: ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త ఖాతాదార్లను జతచేసుకోవడంపై నిషేధం విధించింది. తాజాగా క్రెడిట్ కార్డులనూ జారీ చేయకూడదని ఆజ్ఞాపించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది.
రెండేళ్లు పరిశీలించాకే: 2022, 2023 సంవత్సరాల్లో కోటక్ బ్యాంక్ ఐటీ వ్యవస్థలను ఆర్బీఐ పరిశీలించింది. కొన్ని అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా అంశాలకు విస్తృత స్థాయిలో, సరైన సమయానికి పరిష్కారం చూపడంలో కోటక్ బ్యాంకు విఫలమైనందునే, కఠిన చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఆర్బీఐ వివరించింది.
లోటుపాట్లు ఇందులో: ఐటీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పాచ్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్, వెండార్ రిస్క్ మేనేజ్మెంట్, డేటా సెక్యూరిటీ-డేటా లీక్ ప్రివెన్షన్ స్ట్రాటజీ, బిజినెస్ కంటిన్యుటీ-డిజాస్టర్ రికవరీ రిగర్ అండ్ డ్రిల్ తదితర అంశాల్లో తీవ్ర లోటుపాట్లు, నిబంధనల ఉల్లంఘన కనిపించిందని ఆర్బీఐ తెలిపింది. వీటిపై బ్యాంకు సమర్పించిన వివరాలు సరైనవి లేకపోవడం / తప్పుగా ఉండడం / పరిగణించదగ్గవిగా ఉండకపోవడంతో తాము ఈ చర్యలకు ఉపక్రమించినట్లు ఆర్బీఐ వివరించింది.
గత రెండేళ్లలో పలు సార్లు కోటక్ బ్యాంక్ ఆన్లైన్/డిజిటల్ బ్యాంకింగ్ ఛానళ్లలో అవాంతరాలు ఏర్పడినట్లు ఆర్బీఐ గుర్తు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న ఆ సేవల్లో తీవ్ర అంతరాయం కలగడంతో, వినియోగదార్లు ఇబ్బందుల పాలయ్యారని తెలిపింది. ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల్లో లావాదేవీలు సహా డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతున్నందున, ఐటీ వ్యవస్థలపై మరింత భారం పడుతున్నట్లు ఆర్బీఐ వివరించింది.
ఈ సేవల కొనసాగింపు: ప్రస్తుత వినియోగదార్లకు/క్రెడిట్ కార్డు వినియోగదార్లకు కోటక్ మహీంద్రా బ్యాంక్ సేవలు యథాతథంగా కొనసాగుతాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సర, మార్చి త్రైమాసిక ఫలితాలను మే 4న ప్రకటించాల్సిన తరుణంలో తాజా పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
కోటక్ ఏమందంటే: కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడం ద్వారా ఐటీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కోటక్ మహీంద్రా బ్యాంక్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐతో పనిచేయడం కొనసాగిస్తామని.. సాధ్యమైనంత త్వరగా మిగిలిన సమస్యలనూ పరిష్కరించుకుంటామని వెల్లడించింది. ప్రస్తుత వినియోగదార్లకు క్రెడిట్ కార్డు, మొబైల్, నెట్ బ్యాంకింగ్ సహా అన్ని సేవలను అవాంతరాల్లేకుండా అందిస్తామని స్పష్టం చేసింది. కొత్త వినియోగదార్లను తీసుకోవడాన్ని మా శాఖలు కొనసాగిస్తాయని, అన్ని సేవలనూ (కొత్త క్రెడిట్ కార్డుల జారీ మినహా) అందిస్తాయని తెలిపింది.
గతంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్పైనా: 2020 డిసెంబరులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్పైనా ఇదే తరహా చర్యలు ఆర్బీఐ తీసుకుంది. సాంకేతిక అవాంతరాలు తరచూ వస్తుండడంతో.. కొత్త కార్డుల జారీ, కొత్త డిజిటల్ సేవల ప్రారంభంపై నిషేధం విధించింది. తగిన మార్పులు చేపట్టాక, 2022 మార్చిలో ఆంక్షలను ఎత్తివేసింది.
భాజపాకు కోటక్ ప్రమోటరు రూ.60 కోట్ల విరాళం
దిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రమోటర్ గ్రూప్ ఇన్ఫినా ఫైనాన్స్ రూ.60 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను భారతీయ జనతా పార్టీ (భాజపా)కి విరాళంగా ఇచ్చింది. కోటక్ కుటుంబం ఆధీనంలో ఇన్ఫినా ఉంది. అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఇన్ఫినా ఫైనాన్స్కు షేర్లు లేవు. ప్రస్తుతం కోటక్ బ్యాంక్ ఆర్బీఐ చర్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బీఎస్ఈ సమాచారం ప్రకారం.. 2024 మార్చికి ప్రమోటరు, ప్రమోటరు గ్రూప్ సంస్థలకు బ్యాంక్లో 25.89% వాటా ఉంది. ఉదయ్ కోటక్కు అత్యధికంగా 25.71% వాటా ఉంది. మిగతా 0.18% వాటా ప్రమోటరు గ్రూప్ సంస్థలకు ఉంది. ఎన్నికల సంఘానికి ఎస్బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2019, 2020, 2021లలో రూ.కోటి డినామినేషన్ గల రూ.60 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసి.. భాజపాకు విరాళమిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?