సంక్షిప్త వార్తలు(5)
ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ఏసర్ గ్రూప్, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్ప్యూర్ బ్రాండ్ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది.
ఏసర్ గృహోపకరణాలు
బెంగళూరు: ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ఏసర్ గ్రూప్, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్ప్యూర్ బ్రాండ్ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది. గురువారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో 65 అంగుళాల టీవీతో పాటు ఎయిర్ సర్క్యూలేటర్ ఫ్యాన్లు, వాటర్ ప్యూరిఫయర్లు, వాక్యూమ్ క్లీనర్లు, హెయిర్ డ్రైయర్, స్టైలర్లను కంపెనీ విడుదల చేసింది. డిక్సన్ టెక్నాలజీస్ భాగస్వామ్యంలో ఈ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయనున్నట్లు ఏసర్ ఇండియా అధ్యక్షుడు, ఎండీ హరీశ్ కోహ్లి పేర్కొన్నారు. ఎయిర్ సర్క్యూలేటర్ ఫ్యాన్లు కృత్రిమమేధ (ఏఐ) సాంకేతికతతో పనిచేస్తాయని, ఉష్ణోగ్రతకు అనుగుణంగా వేగాన్ని నియంత్రించుకునే వీటి ధర రూ.7,490 నుంచి ప్రారంభమవుతున్నట్లు వెల్లడించారు.
దేశీయ చమురుపై తగ్గిన పన్ను
దిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై అదాటు లాభాల పన్ను (విండ్ఫాల్ టాక్స్)ను టన్నుకు రూ.8,400 నుంచి రూ.5,700కు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) రూపంలో ఈ పన్ను విధిస్తున్నారు. 2022 జులై 1న తొలిసారిగా ఈ పన్ను అమల్లోకి వచ్చింది.
ఇనెరా ప్రచారకర్తగా ధోని
ఈనాడు, హైదరాబాద్: జీవశాస్త్ర ఎరువులను అందించే బయోసైన్స్ సంస్థ ఇనెరా తన ప్రచారకర్తగా క్రికెటర్ ఎంఎస్ ధోనిని నియమించుకుంది. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవశాస్త్ర ఎరువులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోందని ధోని చెప్పారు.
జూన్ 11 కల్లా ఫలితాలు ప్రకటిస్తాం: బీసీజీ
హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సర 2, 3 త్రైమాసిక ఫలితాలను జూన్ 11 కల్లా ప్రకటించడం ద్వారా, తమ షేర్ల ట్రేడింగ్పై సస్పెన్షన్ అమలు కాకుండా చూస్తామని బ్రైట్కామ్ గ్రూప్ (బీసీజీ) ప్రకటించింది. ఫలితాలు ప్రకటించనందున జూన్ 14 నుంచి బీసీజీ షేర్ల ట్రేడింగ్పై 15 రోజుల సస్పెన్షన్ విధిస్తున్నట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ బుధవారం నిర్ణయించిన నేపథ్యంలో, కంపెనీ గురువారం ఈ వివరణ ఇచ్చింది.
విస్తరణ ప్రణాళికల్లో దీసావాలా రబ్బర్
ఈనాడు, హైదరాబాద్: నిర్మాణ, మౌలిక వసతుల సంస్థలకు అవసరమైన రబ్బరు ఉత్పత్తులను అందించే దీసావాలా రబ్బర్ ఇండస్ట్రీస్ విస్తరణ ప్రయత్నాలను చేస్తోంది. ఇప్పటికే ఉన్న 3 ప్లాంట్లకు తోడుగా మరో 2 కొత్త ప్లాంట్లు నెలకొల్పుతోంది. తమ నాలుగో ప్లాంటును రూ.40 కోట్లతో ప్రారంభించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ హునేద్ దీసావాలా గురువారం ఇక్కడ వెల్లడించారు.40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్లాంటుతో, ఉత్పత్తి సామర్థ్యం 7-8 టన్నుల నుంచి 25 టన్నులకు చేరుతుందన్నారు. మరో ప్లాంటును వచ్చే ఏడాది రూ.40 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం 200 మంది ఉద్యోగులున్నారని, కొత్తగా 100 మందిని తీసుకోబోతున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముర్తాజా దీసావాలా పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల టర్నోవర్ సాధించామని, రెండేళ్లలో ఇది రెట్టింపు అవుతుందన్నారు. బెంగళూరు, చెన్నై, పుణేలలోనూ వ్యాపారాన్ని విస్తరించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే వాహన రంగానికి అవసరమైన రబ్బరు ఉత్పత్తులను తయారు చేయబోతున్నట్లు తెలిపారు. ఫార్మా రంగంలోని పరిశ్రమలకూ సిలికాన్ ఉత్పత్తులను అందిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్విక్ కామర్స్లోకి రిలయన్స్.. 30 నిమిషాల్లో డెలివరీ?
JioMart: జియోమార్ట్ పేరిట రిలయన్స్ ఇప్పటికే నిత్యావసర సరకులను అందిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లోనే క్విక్ కామర్స్ విభాగాన్ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. -
స్ల్పెండర్కు 30 ఏళ్లు.. అధునాతన ఫీచర్లతో కొత్త వెర్షన్ విడుదల
Splendor Plus Xtec: స్ల్పెండర్ మార్కెట్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హీరో కొత్త వెర్షన్ను విడుదల చేసింది. -
భారీ లాభాల్లో మార్కెట్లు.. 22,600 పైన నిఫ్టీ.. 500 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 525 పాయింట్ల లాభంతో 74,410 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 22,619 దగ్గర కొనసాగుతోంది. -
2030కి రూ.10.80 లక్షల కోట్లకు
కొవిడ్ పరిణామాలతో దేశ ఔషధ పరిశ్రమ రంగంలో గణనీయ మార్పులు వచ్చాయని ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాగ్జిల్) డైరెక్టర్ జనరల్ ఉదయ్భాస్కర్ పేర్కొన్నారు. -
ఆర్బీఐ బ్యాలన్స్షీట్ రూ.70.48 లక్షల కోట్లు
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధిని నమోదు చేయగలదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా వేస్తోంది. -
22,500 దిగువకు నిఫ్టీ
లోహ, మన్నికైన వినిమయ వస్తువులు, ఐటీ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ నష్టపోయాయి. -
విపణిలోకి గోద్రెజ్ మై ఫార్మ్ పాలు
తాజా పాలను నేరుగా వ్యవసాయ క్షేత్రం నుంచి ఇంటికి అందించేలా గోద్రెజ్ మై ఫార్మ్ పాలను గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ క్రీమ్లైన్ డైరీ ప్రొడక్ట్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. -
‘జియో ఫైనాన్స్’ యాప్
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా ‘జియో ఫైనాన్స్’ బీటా/ పైలట్ వెర్షన్ యాప్ను విడుదల చేసినట్లు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురువారం వెల్లడించింది. -
76% పెరిగిన అపోలో హాస్పిటల్స్ లాభం
అపోలో హాస్పిటల్స్ ఏకీకృత ఖాతాల ప్రకారం మార్చి త్రైమాసికానికి రూ.4,944 కోట్ల ఆదాయంపై రూ.254 కోట్ల నికర లాభం నమోదైంది. -
కొహాన్స్ లైఫ్ సైన్సెస్తో సువెన్ ఫార్మా విలీనం
కొహాన్స్ లైఫ్ సైన్సెస్తో సువెన్ ఫార్మాస్యూటికల్స్ విలీనానికి ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు అనుమతి ఇచ్చినట్లు సువెన్ ఫార్మా గురువారం వెల్లడించింది. -
ఫోన్పే నుంచి 6 రుణ పథకాలు
ఫోన్పే తన ప్లాట్ఫామ్ మీద 6 విభాగాల్లో సెక్యూర్డ్ రుణ పథకాలను అందుబాటులోకి తెచ్చింది. -
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గాయ్
గత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) 3.49% తగ్గి 44.42 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
క్లెయిమ్ చేయని డిపాజిట్లు బ్యాంకుల్లో రూ.78,213 కోట్లు
బ్యాంకుల వద్ద 2024 మార్చి చివరకు క్లెయిమ్ చేయని (అన్క్లెయిమ్డ్) డిపాజిట్లు 26% పెరిగి రూ.78,213 కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం వార్షిక నివేదికలో తెలిపింది. -
అత్యంత ప్రభావశీల కంపెనీల్లో రిలయన్స్, టాటా గ్రూప్
ప్రపంచంలో అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితాను టైమ్స్ సంస్థ విడుదల చేసింది. ఇందులో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ ఉన్నాయి. -
సంక్షిప్తవార్తలు (4)
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) ఓయో సుమారు రూ.100 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ వెల్లడించారు. -
చిన్నారుల కలలు నిజం అయ్యేలా..
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. పిల్లలకు బడిలో చేరింది మొదలు.. ఉన్నత విద్య వరకూ అంతా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఆర్థికంగా ఇదొక సవాలు లాంటిదే. చిన్నారులు వృద్ధిలోకి రావడానికి తల్లిదండ్రులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. -
క్రెడిట్ కార్డు..ఈ రుసుములు చూశారా?
అత్యవసరాల్లో కొనుగోళ్లు చేసేందుకు క్రెడిట్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రయోజనాలు అధికమే. -
మ్యూచువల్ ఫండ్లు మదుపు మార్గంలో వైవిధ్యంగా
కష్టపడి సంపాదించిన సొమ్మును స్టాక్ మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్నారా? నేరుగా షేర్లు కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. -
రుణ అర్హత పెంచుకుందాం
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రుణాలు చాలా సులభంగా లభిస్తున్నాయనే చెప్పొచ్చు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) పూర్తిగా డిజిటల్ రూపంలోనే క్షణాల్లో అప్పులు ఇచ్చేందుకు సిద్ధం అంటున్నాయి. -
స్థిరమైన రాబడి కోసం..
జెరోధా మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ పథకాలను ఆవిష్కరించింది. ఇందులో ఒకటి జెరోధా నిఫ్టీ 100 ఈటీఎఫ్, మరోటి జెరోధా నిఫ్టీ మిడ్క్యాప్ 150 ఈటీఎఫ్. -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
క్విక్ కామర్స్లోకి రిలయన్స్.. 30 నిమిషాల్లో డెలివరీ?
-
బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి: ఏబీవీ
-
మలద్వారంలో కేజీ బంగారం దాచి.. ఎయిర్హోస్టెస్ స్మగ్లింగ్
-
నోట్ల కట్టలు.. ట్విస్టులు: క్రైం థ్రిల్లర్ మరిపించేలా పుణె లగ్జరీ కారు ప్రమాదం కేసు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అందరితో చర్చించే సీఎం రేవంత్ నిర్ణయాలు: ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్