సంక్షిప్త వార్తలు(5)
ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ఏసర్ గ్రూప్, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్ప్యూర్ బ్రాండ్ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది.
ఏసర్ గృహోపకరణాలు
బెంగళూరు: ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ఏసర్ గ్రూప్, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్ప్యూర్ బ్రాండ్ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది. గురువారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో 65 అంగుళాల టీవీతో పాటు ఎయిర్ సర్క్యూలేటర్ ఫ్యాన్లు, వాటర్ ప్యూరిఫయర్లు, వాక్యూమ్ క్లీనర్లు, హెయిర్ డ్రైయర్, స్టైలర్లను కంపెనీ విడుదల చేసింది. డిక్సన్ టెక్నాలజీస్ భాగస్వామ్యంలో ఈ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయనున్నట్లు ఏసర్ ఇండియా అధ్యక్షుడు, ఎండీ హరీశ్ కోహ్లి పేర్కొన్నారు. ఎయిర్ సర్క్యూలేటర్ ఫ్యాన్లు కృత్రిమమేధ (ఏఐ) సాంకేతికతతో పనిచేస్తాయని, ఉష్ణోగ్రతకు అనుగుణంగా వేగాన్ని నియంత్రించుకునే వీటి ధర రూ.7,490 నుంచి ప్రారంభమవుతున్నట్లు వెల్లడించారు.
దేశీయ చమురుపై తగ్గిన పన్ను
దిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై అదాటు లాభాల పన్ను (విండ్ఫాల్ టాక్స్)ను టన్నుకు రూ.8,400 నుంచి రూ.5,700కు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) రూపంలో ఈ పన్ను విధిస్తున్నారు. 2022 జులై 1న తొలిసారిగా ఈ పన్ను అమల్లోకి వచ్చింది.
ఇనెరా ప్రచారకర్తగా ధోని
ఈనాడు, హైదరాబాద్: జీవశాస్త్ర ఎరువులను అందించే బయోసైన్స్ సంస్థ ఇనెరా తన ప్రచారకర్తగా క్రికెటర్ ఎంఎస్ ధోనిని నియమించుకుంది. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవశాస్త్ర ఎరువులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోందని ధోని చెప్పారు.
జూన్ 11 కల్లా ఫలితాలు ప్రకటిస్తాం: బీసీజీ
హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సర 2, 3 త్రైమాసిక ఫలితాలను జూన్ 11 కల్లా ప్రకటించడం ద్వారా, తమ షేర్ల ట్రేడింగ్పై సస్పెన్షన్ అమలు కాకుండా చూస్తామని బ్రైట్కామ్ గ్రూప్ (బీసీజీ) ప్రకటించింది. ఫలితాలు ప్రకటించనందున జూన్ 14 నుంచి బీసీజీ షేర్ల ట్రేడింగ్పై 15 రోజుల సస్పెన్షన్ విధిస్తున్నట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ బుధవారం నిర్ణయించిన నేపథ్యంలో, కంపెనీ గురువారం ఈ వివరణ ఇచ్చింది.
విస్తరణ ప్రణాళికల్లో దీసావాలా రబ్బర్
ఈనాడు, హైదరాబాద్: నిర్మాణ, మౌలిక వసతుల సంస్థలకు అవసరమైన రబ్బరు ఉత్పత్తులను అందించే దీసావాలా రబ్బర్ ఇండస్ట్రీస్ విస్తరణ ప్రయత్నాలను చేస్తోంది. ఇప్పటికే ఉన్న 3 ప్లాంట్లకు తోడుగా మరో 2 కొత్త ప్లాంట్లు నెలకొల్పుతోంది. తమ నాలుగో ప్లాంటును రూ.40 కోట్లతో ప్రారంభించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ హునేద్ దీసావాలా గురువారం ఇక్కడ వెల్లడించారు.40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్లాంటుతో, ఉత్పత్తి సామర్థ్యం 7-8 టన్నుల నుంచి 25 టన్నులకు చేరుతుందన్నారు. మరో ప్లాంటును వచ్చే ఏడాది రూ.40 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం 200 మంది ఉద్యోగులున్నారని, కొత్తగా 100 మందిని తీసుకోబోతున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముర్తాజా దీసావాలా పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల టర్నోవర్ సాధించామని, రెండేళ్లలో ఇది రెట్టింపు అవుతుందన్నారు. బెంగళూరు, చెన్నై, పుణేలలోనూ వ్యాపారాన్ని విస్తరించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే వాహన రంగానికి అవసరమైన రబ్బరు ఉత్పత్తులను తయారు చేయబోతున్నట్లు తెలిపారు. ఫార్మా రంగంలోని పరిశ్రమలకూ సిలికాన్ ఉత్పత్తులను అందిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?