పోకర్ణ లాభం రూ.15.51 కోట్లు

పోకర్ణ లిమిటెడ్‌ మార్చి త్రైమాసికానికి రూ.164.38 కోట్ల ఆదాయాన్ని, రూ.15.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

Published : 17 May 2024 02:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: పోకర్ణ లిమిటెడ్‌ మార్చి త్రైమాసికానికి రూ.164.38 కోట్ల ఆదాయాన్ని, రూ.15.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.5.30 గా నమోదైంది. 2022-23 ఇదేకాలంలో రూ.164.76 కోట్ల ఆదాయంపై రూ.10.68 కోట్ల నికరలాభం ఉంది. దీంతో పోల్చితే ఈసారి లాభం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి పోకర్ణ రూ.699.13 కోట్ల ఆదాయాన్ని, రూ.87.36 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. వార్షిక ఈపీఎస్‌ రూ.28.18గా ఉంది. 2022-23లో ఆదాయం రూ.736.48 కోట్లు, నికరలాభం రూ.65.81 కోట్లు ఉన్నాయి. వాటాదార్లకు 30% (రూ.2 ముఖ విలువ కల ఒక్కో షేరుకు 60 పైసల చొప్పున) డివిడెండ్‌ చెల్లించాలని సంస్థ యాజమాన్యం ప్రతిపాదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని