రికార్డు గరిష్ఠాలకు వెండి

బంగారం, వెండి ధరలు గత రెండు రోజుల్లో బాగా పెరిగాయి. వెండి అయితే కిలో ధర తొలిసారిగా రూ.88,000ను మించింది. గత రెండు రోజుల్లోనే కిలోకు రూ.1500కు పైగా పెరిగింది.

Published : 17 May 2024 02:48 IST

ఈనాడు వాణిజ్య విభాగం: బంగారం, వెండి ధరలు గత రెండు రోజుల్లో బాగా పెరిగాయి. వెండి అయితే కిలో ధర తొలిసారిగా రూ.88,000ను మించింది. గత రెండు రోజుల్లోనే కిలోకు రూ.1500కు పైగా పెరిగింది. గురువారం రాత్రి 11 గంటల సమయానికి హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో కిలో వెండి ధర రూ.88,700గా ఉంది. మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర కూడా రెండు రోజుల్లో 10 గ్రాములకు రూ.1000 పెరిగి రూ.75,600కి చేరింది. ఇప్పటివరకు మేలిమి బంగారం 10 గ్రాముల గరిష్ఠ ధర రూ.76,800గా ఉంది. అంతర్జాతీయంగా డాలర్‌కు గిరాకీ పరిమితమైన నేపథ్యంలో, ఈ లోహాలపైకి పెట్టుబడులు మళ్లడమే ధరల పెరుగుదలకు కారణమని బులియన్‌ వర్గాలు చెబుతున్నాయి. పారిశ్రామికంగా వెండి వినియోగం అధికమవుతున్న తరుణంలో, ఈ లోహ ధరలు పెరగనున్నాయని ఇటీవల విశ్లేషణలు వస్తున్న సంగతి విదితమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని