ఓఎన్జీసీ లాభం రూ.9,869 కోట్లు
ప్రభుత్వరంగ ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్) జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.9,869 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక నికర లాభం రూ.528 కోట్లతో పోలిస్తే ఇది 19 రెట్లు అధికం.
దిల్లీ: ప్రభుత్వరంగ ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్) జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.9,869 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక నికర లాభం రూ.528 కోట్లతో పోలిస్తే ఇది 19 రెట్లు అధికం. ఏడాది క్రితం పన్ను వివాదాల కింద రూ.9,235 కోట్లు కేటాయించాల్సి రావడంతో, లాభం తక్కువగా నమోదైంది. ఆ కేటాయింపులను మినహాయిస్తే, సమీక్షా త్రైమాసికంలో లాభం స్వల్పంగానే పెరిగినట్లు భావించాలి. సమీక్షిస్తున్న త్రైమాసికంలో ముడి చమురు ఉత్పత్తి 4.3% పెరిగి 4.71 మిలియన్ టన్నులుగా నమోదైంది. ప్రతి బ్యారెల్ ముడి చమురుపై 80.81 డాలర్లను సంస్థ ఆర్జించింది. ఏడాది క్రితం ఈ మొత్తం 77.12 డాలర్లే. ఇదే సమయంలో గ్యాస్ ధర ఒక్కో బ్రిటీష్ థర్మల్ యూనిట్కు 8.57 డాలర్ల నుంచి 6.50 డాలర్లకు తగ్గింది. గ్యాస్ ఉత్పత్తి కూడా 2.4% తగ్గి 4.95 బిలియన్ క్యూబిక్ మీటర్లకు (బీసీఎం) పరిమితమైంది. కార్యకలాపాల ఆదాయం 4.6% తగ్గి రూ.34,637 కోట్లుగా నమోదైంది.
2023-24కు రికార్డు లాభం: పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఓఎన్జీసీ స్టాండలోన్ నికర లాభం రూ.40,526 కోట్లకు పెరిగింది. ఇది సంస్థ చరిత్రలోనే అత్యధికం. 2022-23లో ఇది రూ.40,097 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో ఆదాయం రూ.1.55 లక్షల కోట్ల నుంచి రూ.1.38 లక్షల కోట్లకు తగ్గింది. ఏకీకృత ప్రాతిపదికన ఓఎన్జీసీ నికర లాభం రూ.57,101 కోట్లుగా నమోదైంది. చమురు ఉత్పత్తి 0.7% తగ్గి 18.4 మిలియన్ టన్నులకు; గ్యాస్ ఉత్పత్తి 3.2 శాతం తగ్గి 19.97 బీసీఎంకు పరిమితమైంది.
- రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు 50% (2.50) తుది డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. ఇప్పటికే చెల్లించిన 195% మధ్యంతర డివిడెండుతో కలిపితే, గత ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా 245% (రూ.12.25) డివిడెండును ఓఎన్జీసీ ప్రకటించినట్లు అవుతుంది. ఇందుకోసం మొత్తంగా రూ.15,411 కోట్లు వెచ్చిస్తోంది.
- 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఓఎన్జీసీ రూ.37,000 కోట్ల మూలధన వ్యయాలు చేసింది. 2022-23లో ఇది రూ.30,208 కోట్లుగా ఉంది.
- విదేశీ అనుబంధ సంస్థ ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ (ఓవీఎల్) 203-24లో 7.178 మిలియన్ టన్నుల ముడి చమురును, 3.34 బీసీఎం గ్యాస్ను ఉత్పత్తి చేసింది. 2022-23లో ముడి చమురు ఉత్పత్తి 6.349 మిలియన్ టన్నులు కాగా.. గ్యాస్ ఉత్పత్తి 3.822 బీసీఎంగా నమోదైంది. 2023-24లో ఓవీఎల్ నికర లాభం రూ.639 కోట్లకు తగ్గింది. 2022-23లో ఇది రూ.1,660 కోట్లుగా ఉంది. టర్నోవరు 18.2% తగ్గి రూ.9,553 కోట్లకు పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత