మారన్‌ నుంచి రూ.450 కోట్లు కోరతాం

తమ మాజీ ప్రమోటరు కళానిధి మారన్, ఆయన సంస్థ కేఏఎల్‌ ఎయిర్‌వేస్‌కు చెల్లించిన మొత్తం రూ.730 కోట్ల నుంచి రూ.450 కోట్ల రిఫండ్‌ కోరనున్నట్లు స్పైస్‌జెట్‌ తెలిపింది.

Published : 23 May 2024 01:43 IST

కోర్టు తీర్పు నేపథ్యంలో స్పైస్‌జెట్‌ వెల్లడి

దిల్లీ: తమ మాజీ ప్రమోటరు కళానిధి మారన్, ఆయన సంస్థ కేఏఎల్‌ ఎయిర్‌వేస్‌కు చెల్లించిన మొత్తం రూ.730 కోట్ల నుంచి రూ.450 కోట్ల రిఫండ్‌ కోరనున్నట్లు స్పైస్‌జెట్‌ తెలిపింది. మారన్‌కు రూ.579 కోట్లను వడ్డీతో పాటు చెల్లించాలని స్పైస్‌జెట్, ప్రస్తుత ప్రమోటరు అజయ్‌ సింగ్‌కు గతంలో జారీ చేసిన మధ్యవర్తిత్వ ఆదేశాలను సమర్థించిన ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈ నెల 17న పక్కన పెట్టడం ఇందుకు నేపథ్యం. 2023 జులై 31న జారీ అయిన ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలను సవాలు చేస్తూ సింగ్, స్పైస్‌జెట్‌ దాఖలు చేసిన అప్పీళ్లను డివిజన్‌ బెంచ్‌ అనుమతించడంతో పాటు, మధ్యవర్తిత్వ తీర్పును సవాలు చేసిన పిటిషన్లను తాజాగా పరిశీలించడానికీ అంగీకరించింది. ‘అంతక్రితం ఉత్తర్వుల నేపథ్యంలో మారన్, కేఏఎల్‌ ఓయిర్‌వేస్‌కు రూ.730 కోట్లు(రూ.580 కోట్లు అసలు, రూ.150 కోట్ల వడ్డీ) స్పైస్‌జెట్‌ చెల్లించింది. తాజాగా ఆ ఉత్తర్వులను బెంచ్‌ పక్కనపెట్టడంతో రూ.450 కోట్ల రిఫండ్‌ను స్పైస్‌జెట్‌ పొందగలుగుతుంద’ని కంపెనీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని