గ్రాసిమ్ ఇండస్ట్రీస్ డివిడెండు 500%
ఆదిత్య బిర్లా గ్రూపులో ముఖ్య సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.2,721.81 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది.
దిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూపులో ముఖ్య సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.2,721.81 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.2,355.67 కోట్లతో పోలిస్తే ఇది 15.54% అధికం. సిమెంట్, ఆర్థిక సేవల వ్యాపారాలు రాణించడం ఇందుకు దోహదం చేసిందని కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.33,462.14 కోట్ల నుంచి 12.74% పెరిగి రూ.37,727.13 కోట్లకు చేరింది. ఇప్పటివరకు కంపెనీ నమోదుచేసిన అత్యధిక త్రైమాసిక ఆదాయం ఇదే అని గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తెలిపింది. మొత్తం వ్యయాలు 11.18% పెరిగి రూ.33,750.46 కోట్లకు చేరాయి. ఇతర వనరుల నుంచి ఆర్జించిన ఆదాయాలతో కలిపి మొత్తం ఆదాయం 13.27% వృద్ధితో రూ.38,154.36 కోట్లుగా నమోదైంది.
పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నికర లాభం 10.4% తగ్గి రూ.9,925.65 కోట్లకు పరిమితమైంది. 2022-23లో లాభం రూ.11,078.20 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.1,17,627.08 కోట్ల నుంచి 11.35% పెరిగి రూ.1,30,978.48 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.10 (500%) తుది డివిడెండును చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
ఆయా విభాగాల పనితీరు ఇలా..
- జనవరి- మార్చిలో సెల్యులోజిక్ ఫైబర్స్ ఆదాయం రూ.3,764.06 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ.3,761.75 కోట్లకు పరిమితమైంది.
- రసాయనాల వ్యాపారాదాయం రూ.2,397.47 కోట్ల నుంచి 13.11% తగ్గి రూ.2,082.98 కోట్లుగా నమోదైంది.
- సిమెంట్ (అల్ట్రాటెక్), పెయింట్స్, బీ2బీ ఇ-కామర్స్ వ్యాపారం బిర్లా పైవట్తో కూడిన బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపార ఆదాయం రూ.18,803.03 కోట్ల నుంచి 11.25% పెరిగి రూ.20,918.55 కోట్లకు చేరింది.
- ఆర్థిక సేవల (ఆదిత్యా బిర్లా కేపిటల్) వ్యాపారాదాయం రూ.8,094.51 కోట్ల నుంచి 29.51% వృద్ధితో రూ.10,483.77 కోట్లుగా నమోదైంది.
- ఇతరత్రా (జౌళి, ఇన్సులేటర్లు, పునరుత్పాదక విద్యుత్ వ్యాపారం) విభాగాల ఆదాయం 5.95% పెరిగి రూ.789.85 కోట్లకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నాన్న నేర్పిందే నా పిల్లలకూ చెప్పాను’.. వేదాంత చీఫ్ భావోద్వేగ పోస్ట్
Anil Agarwal: ఫాదర్స్డే సందర్భంగా వేదాంత వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ తన నాన్నను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘‘ఎక్స్’’ వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేశారు. -
ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
Vodafone Idea: దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉండేలా వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ నెల రోజులు. -
రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి
ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్ రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి సారించింది. దీనికి తగ్గట్లుగా పెట్టుబడులు సిద్ధం చేస్తోంది. -
కొత్త వ్యాపారాల్లో అయిదింతల వృద్ధి లక్ష్యం
వ్యాపారాల విలువను గణనీయంగా పెంచుకోవడంపై మహీంద్రా గ్రూపు దృష్టి సారిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ అనిశ్ షా తెలిపారు. -
నియంత్రణ పటిష్ఠమైనా మోసాలు తగ్గట్లేదు: కేపీఎంజీ సర్వే
నియంత్రణ చర్యల్లో పలు మార్పులు చేసినా, మోసాల సంఖ్య తగ్గడం లేదని తమ సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది వెల్లడించినట్లు కేపీఎంజీ వెల్లడించింది. -
తాజా ఉత్తీర్ణులకు హుషారే
గత ఆరు నెలల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్) నియామకాలు 5% పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగ పరిస్థితి క్రమంగా మెరుగవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. -
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్ యాంపీర్ నెక్సస్
గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్కు చెందిన ఇ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రై.లి. తన ఫ్యామిలీ విద్యుత్ స్కూటర్ యాంపీర్ నెక్సస్ను ఆవిష్కరించింది. -
అవిన్యా బ్రాండ్పై టాటా ప్రీమియం విద్యుత్తు కార్లు
టాటా మోటార్స్, ప్రీమియం విద్యుత్తు కార్లను అవిన్యా బ్రాండ్పై ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం. -
సంక్షిప్త వార్తలు(7)
ఈ ఏడాది, వచ్చే సంవత్సరానికి అంతర్జాతీయంగా ముడిచమురు వినియోగ అంచనాల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా వెల్లడించింది. 2024లో రోజుకు 2.25 మిలియన్ బ్యారెళ్లు, వచ్చే ఏడాదిలో రోజుకు 1.85 మిలియన్ బ్యారెళ్ల చొప్పున చమురుకు గిరాకీ పెరుగుతుందన్నది ఒపెక్ అంచనా. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
ఇంటిపై రుణం ఇచ్చే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి?
తాజా వార్తలు (Latest News)
-
రేణుకాస్వామి హత్య కేసు.. ఆ కారు సీజ్!
-
శ్రీలంక-భారత్ ప్రతిపాదిత రోడ్డు మార్గం.. ద్వీపదేశం ఏమందంటే!
-
రష్యాలో కలకలం.. జైలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని..!
-
‘నాన్న నేర్పిందే నా పిల్లలకూ చెప్పాను’.. వేదాంత చీఫ్ భావోద్వేగ పోస్ట్
-
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!
-
విష్వక్ సేన్ కీలక నిర్ణయం.. ముఖ్య అతిథిగా హాజరై