హీరో ఎలక్ట్రిక్, ఒకినవ, బెన్లింగ్లకు షాక్!
విద్యుత్ వాహన తయారీ కంపెనీలైన హీరో ఎలక్ట్రిక్, ఒకినవ, బెన్లింగ్ లను, ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందకుండా అనర్హత వేటు వేసే (బ్లాక్లిస్ట్లో పెట్టే) అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అన్ని ప్రభుత్వ పథకాల నుంచి అనర్హతకు గురయ్యే అవకాశం
దిల్లీ: విద్యుత్ వాహన తయారీ కంపెనీలైన హీరో ఎలక్ట్రిక్, ఒకినవ, బెన్లింగ్ లను, ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందకుండా అనర్హత వేటు వేసే (బ్లాక్లిస్ట్లో పెట్టే) అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దేశంలో విద్యుత్ వాహన తయారీ-వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేమ్-2 పథకం కింద ఆయా సంస్థలు తప్పుడు క్లెయిములతో ప్రయోజనాలు పొందాయి. వాటిని తిరిగి ఇవ్వడంలో విఫలం కావడం, ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోనుందని అంటున్నారు.
ఫిర్యాదులు అందడంతో: ఫేమ్-2 కింద నమోదైన పలు కంపెనీలు (ఓఈఎమ్లు) ఆ పథకం మార్గదర్శకాలను ఉల్లంఘించాయని, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు 2022లో ఫిర్యాదులు అందాయి. స్థానికంగా విడిభాగాలు సేకరించకుండా, దిగుమతి చేసుకున్న విడిభాగాలతో రూపొందించిన విద్యత్ వాహనాలను పలు కంపెనీలు విక్రయించాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో మంత్రిత్వశాఖ దాదాపు 13 కంపెనీలపై దర్యాప్తు చేపట్టింది. అందులో 6 కంపెనీలు.. హీరో ఎలక్ట్రిక్, ఒకినవ ఆటోటెక్, బెన్లింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ, ఏఎమ్ఓ మొబిలిటీ, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, రివోల్ట్ మోటార్స్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది.
3 కంపెనీలు వెనక్కి ఇచ్చేశాయ్: ‘ఏఎమ్ఓ మొబిలిటీ, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, రివోల్ట్ మోటార్స్ తాము పొందిన సబ్సిడీ మొత్తాన్ని వడ్డీ సహా కొద్ది నెలల్లోపే తిరిగి ఇచ్చి, ప్రభుత్వం నుంచి క్లీన్ చిట్ పొందాయి. హీరో ఎలక్ట్రిక్, ఒకినవ, బెన్లింగ్ మాత్రం ప్రోత్సాహకాలను తిరిగి ఇవ్వలేదు. దీంతో ఫేమ్-2 పథకం నుంచి ఆయా కంపెనీలను తొలగించాం. తదుపరి అడుగు మంత్రిత్వ శాఖ కిందున్న అన్ని పథకాల నుంచి వాటిని తొలగించడమే. ఇప్పటికే హీరో ఎలక్ట్రిక్, బెన్లింగ్ ఇండియాలపై ఆ చర్య తీసుకున్నాం. ఒకినవ కోర్టుకెళ్లడంతో డీబార్ చేయలేదు. తదుపరి అడుగు భారత ప్రభుత్వ పథకాలన్నిటి నుంచి ఈ కంపెనీలను బ్లాక్లిస్ట్లో పెట్టడం. అది పద్ధతి ప్రకారం ఆర్థిక శాఖ అనుమతులతో జరగాల్సి ఉంద’ని ఒక అధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి
ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్ రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి సారించింది. దీనికి తగ్గట్లుగా పెట్టుబడులు సిద్ధం చేస్తోంది. -
కొత్త వ్యాపారాల్లో అయిదింతల వృద్ధి లక్ష్యం
వ్యాపారాల విలువను గణనీయంగా పెంచుకోవడంపై మహీంద్రా గ్రూపు దృష్టి సారిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ అనిశ్ షా తెలిపారు. -
నియంత్రణ పటిష్ఠమైనా మోసాలు తగ్గట్లేదు: కేపీఎంజీ సర్వే
నియంత్రణ చర్యల్లో పలు మార్పులు చేసినా, మోసాల సంఖ్య తగ్గడం లేదని తమ సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది వెల్లడించినట్లు కేపీఎంజీ వెల్లడించింది. -
తాజా ఉత్తీర్ణులకు హుషారే
గత ఆరు నెలల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్) నియామకాలు 5% పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగ పరిస్థితి క్రమంగా మెరుగవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. -
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్ యాంపీర్ నెక్సస్
గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్కు చెందిన ఇ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రై.లి. తన ఫ్యామిలీ విద్యుత్ స్కూటర్ యాంపీర్ నెక్సస్ను ఆవిష్కరించింది. -
అవిన్యా బ్రాండ్పై టాటా ప్రీమియం విద్యుత్తు కార్లు
టాటా మోటార్స్, ప్రీమియం విద్యుత్తు కార్లను అవిన్యా బ్రాండ్పై ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం. -
సంక్షిప్త వార్తలు(7)
ఈ ఏడాది, వచ్చే సంవత్సరానికి అంతర్జాతీయంగా ముడిచమురు వినియోగ అంచనాల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా వెల్లడించింది. 2024లో రోజుకు 2.25 మిలియన్ బ్యారెళ్లు, వచ్చే ఏడాదిలో రోజుకు 1.85 మిలియన్ బ్యారెళ్ల చొప్పున చమురుకు గిరాకీ పెరుగుతుందన్నది ఒపెక్ అంచనా. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
ఇంటిపై రుణం ఇచ్చే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
-
విచారణ పూర్తికాకముందే తీర్పు ఎలా ఇస్తారు?: జగదీశ్ రెడ్డి
-
‘నీట్’ వివాదం.. సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి: సిబల్
-
రుషికొండపై రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా
-
జూన్ 30లోగా గనులను వేలం వేయాలి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచన
-
ఆ విషయంలో నన్నెవరూ అధిగమించలేరు: కుమార్తెపై రామ్ చరణ్ ప్రేమ