సంక్షిప్త వార్తలు
అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న గో ఫస్ట్ను దక్కించుకునేందుకు ఫిబ్రవరిలో దాఖలు చేసిన బిడ్ను 3 నెలల తర్వాత బిజీ బీ ఎయిర్వేస్ ఉపసంహరించుకుంది.
బిజీ బీ ఎయిర్వేస్ బిడ్ ఉపసంహరణ
గో ఫస్ట్ దివాలా ప్రక్రియ వ్యవహారం
దిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న గో ఫస్ట్ను దక్కించుకునేందుకు ఫిబ్రవరిలో దాఖలు చేసిన బిడ్ను 3 నెలల తర్వాత బిజీ బీ ఎయిర్వేస్ ఉపసంహరించుకుంది. ఈ ఎయిర్వేస్లో ఈజ్మైట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టికి మెజార్టీ వాటా ఉంది. అలాగే స్పైస్జెట్ అధినేత అజయ్ సింగ్కు కూడా వాటా ఉంది. అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత బిడ్ను ఉపసంహరించుకోవాలని తన వ్యక్తిగత హోదాలో నిర్ణయించుకున్నట్లు పిట్టి వెల్లడించారు. ఇతర వ్యూహాత్మక ప్రాధాన్యాలపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం సహకరిస్తుందని పేర్కొన్నారు.
రిలయన్స్ పవర్ నష్టం రూ.398 కోట్లు
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రిలయన్స్ పవర్ రూ.397.66 కోట్ల ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది. ఇంధన వ్యయాలు రూ.823.47 కోట్ల నుంచి రూ.953.67 కోట్లకు పెరగడమే ఇందుకు కారణం. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.321.79 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,853.32 కోట్ల నుంచి రూ.2,193.85 కోట్లకు చేరింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర నష్టం రూ.470.77 కోట్ల నుంచి రూ.2,068.38 కోట్లకు పెరగడం గమనార్హం. విదేశీ కరెన్సీ మార్పిడి బాండ్లు (ఎఫ్సీసీబీలు), క్యూఐపీ ద్వారా సెక్యూరిటీల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది. సెబీ నియమ నిబంధనలు, మార్గదర్శకాలు, చట్టాలకు లోబడి వీటి జారీ ఉండనుంది. ప్రస్తుతం రిలయన్స్ పవర్ 6,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆస్తులను కలిగి ఉంది.
ఎన్హెచ్ఏఐ రహదారి ఆస్తుల నగదీకరణతో ప్రభుత్వానికి రూ.60,000 కోట్లు: ఇక్రా
దిల్లీ: ప్రభుత్వ రంగ భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ(ఎన్హెచ్ఏఐ) యాజమాన్యంలోని కొన్ని రహదారి ఆస్తులను నగదీకరించడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రభుత్వానికి రూ.60,000 కోట్లు సమకూరే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. 2024 ఏప్రిల్లో ఎన్హెచ్ఏఐ తన 33 రహదారి ఆస్తులను 2024-25లో నగదీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. టోల్-నిర్వహణ-బదిలీ (టీఓటీ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)ల ద్వారా వీటిని నగదీకరించనున్నట్లు తెలిపింది. ఈ రహదారి ఆస్తులు 12 రాష్ట్రాల్లో సుమారు రూ.2,750 కిలోమీటర్లు విస్తరించి ఉండటంతో పాటు వార్షిక టోల్ వసూళ్లు రూ.4,931 కోట్లు వసూలు చేస్తున్నాయని ఇక్రా పేర్కొంది. టీఓటీ/ఇన్విట్ పద్ధతిలో నగదీకరించనున్న 33 రహదారి ఆస్తుల ద్వారా రూ.53,000-60,000 కోట్లు ఖజానాకు అందుతాయని ఇక్రా అంచనా వేసింది. ఇందులో పెద్ద (రూ.6,000 కోట్లకు పైగా), మధ్య (రూ.3,000-4,000 కోట్లు), చిన్న (రూ.1,000-3,000 కోట్లు) స్థాయి రహదారి ఆస్తులు ఉన్నాయి. ప్రభుత్వం 2021-22 నుంచి 2024-25 వరకు జాతీయ నగదీకరణ పైప్లైన్ (ఎన్ఎంపీ)లో భాగంగా రహదారి రంగ నగదీకరణ ద్వారా రూ.1.6 లక్షల కోట్లు సమకూర్చుకోవాలనుకుంది. తాజాగా నగదీకరణతో రూ.53,000-60,000 కోట్లు లభిస్తే లక్ష్యంలో 65-71 శాతం సాధించినట్లు అవుతుందని ఇక్రా పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం