సెన్సెక్స్, నిఫ్టీ @ 1,50,000!
భారత స్టాక్ మార్కెట్ల దూకుడుపై మోతీలాల్ ఓస్వాల్్ గ్రూపు ఛైర్మన్ రామ్దేవ్ అగర్వాల్ ఆశ్చర్యకర అంచనాను వెలిబుచ్చారు.
మోతీలాల్ ఓస్వాల్ ఛైర్మన్ అంచనా
దిల్లీ: భారత స్టాక్ మార్కెట్ల దూకుడుపై మోతీలాల్ ఓస్వాల్్ గ్రూపు ఛైర్మన్ రామ్దేవ్ అగర్వాల్ ఆశ్చర్యకర అంచనాను వెలిబుచ్చారు. బీఎస్ఈ ప్రామాణిక సూచీ అయిన సెన్సెక్స్ వచ్చే 5-6 ఏళ్లలో 1,50,000 పాయింట్ల మైలురాయిని చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. నిఫ్టీ ఈ స్థాయిని చేరేందుకు మరో 15-17 ఏళ్ల సమయం పట్టొచ్చని ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. ప్రస్తుతం సెన్సెక్స్ 75,000 పాయింట్లు, నిప్టీ 23,000 పాయింట్ల వద్ద కదలాడుతున్నాయి. ఆయన వెలిబుచ్చిన ప్రకారం చూస్తే.. సెన్సెక్స్ మరో 5-6 ఏళ్లలో రెట్టింపు మేర పెరిగే అవకాశం ఉందన్నమాట. ‘స్టాక్ మార్కెట్లో లాభాలు సంపాదించాలంటే దూరదృష్టి, ధైర్యం, సహనం ఉండాలి. ముఖ్యంగా సహనం. అప్పుడే మనం మార్కెట్లో ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కోగల్గుతాం’ అని అగర్వాల్ వివరించారు. ఒకవేళ ఏవైనా ప్రతికూల పరిణామాలు ఎదురైతే 2030 నాటికి, ఎదురుకాకుంటే 2028 కల్లా సెన్సెక్స్ 1,50,000 పాయింట్ల మైలురాయిని అందుకుంటుందని ఆయన అంచనా వేశారు.
ఎన్నికల ఫలితాలపై ఆత్రుత వద్దు: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై మరీ ఎక్కువగా ఆత్రుత పడవద్దని మదుపర్లకు అగర్వాల్ సూచించారు. ‘జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి. కానీ నా పెట్టుబడి వ్యూహాల్లో ఎటువంటి మార్పు ఉండదు. జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా ఆ ముందు రోజైన జూన్ 3న, తర్వాతి రోజైన జూన్ 5న నా పెట్టుబడి నిర్ణయాలు యథావిధిగానే కొనసాగుతాయ’ని ఆయన తెలిపారు. మేలో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) అమ్మకాల బాట పట్టడంపై ఆయన స్పందిస్తూ.. భారత మార్కెట్లో ఎఫ్ఐఐలు తిరిగి కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడగానికి కొంత సమయం పడుతుందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడడం వల్లే భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుతం మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారని ఆయన విశ్లేషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్