ఎంబీఏ పట్టభద్రుల్లో వలసల రేటు అధికంగానే
ఎంబీఏ పట్టభద్రుల్లో వలసల రేటు అధికంగా కొనసాగుతుండటం ఆందోళనకర అంశమని ఓ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ప్రధాన ప్రాంగణాల నుంచి నియమితులైన ప్రారంభ స్థాయి ఉద్యోగుల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది.
డెలాయిట్ నివేదిక
దిల్లీ: ఎంబీఏ పట్టభద్రుల్లో వలసల రేటు అధికంగా కొనసాగుతుండటం ఆందోళనకర అంశమని ఓ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ప్రధాన ప్రాంగణాల నుంచి నియమితులైన ప్రారంభ స్థాయి ఉద్యోగుల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది. డెలాయిట్ ఇండియా ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం.. దేశవ్యాప్తంగా మొదటి శ్రేణి (టైర్ 1) కళాశాల ప్రాంగణాల నుంచి కొత్తగా నియమితులైన వారిలో వలసల రేటు 21 శాతం కాగా.. ఉద్యోగంలో చేరి ఒకటి, రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల్లో ఇది వరుసగా 26%, 28 శాతంగా ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంగణాల్లో కొత్తగా నియమితులైన ఉద్యోగులు ఏడాది, రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల వలసల రేటు వరుసగా 19%, 21%, 25 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. ‘ఉద్యోగులు ముఖ్యంగా ఎంబీఏ పట్టభద్రులను అట్టేపెట్టుకునే విషయంలో కంపెనీలు పునరాలోచన చేయడం అత్యంత ముఖ్యమనే విషయాన్ని ఈ నివేదిక గుర్తించింది. వీళ్లలో వలసల రేటు అధికంగా ఉండటం జాగ్రత్త పడాల్సిన అంశమే. వినూత్న విధానాలు దీర్ఘకాలం పాటు పనిచేయవు. పోటీ మార్కెట్లో నైపుణ్యవంతులను అట్టేపెట్టుకోవడం ముఖ్యం’ అని డెలాయిట్ ఇండియా డైరెక్టర్ నీలేశ్ గుప్తా తెలిపారు. 190 సంస్థలు, 500 ప్రాంగణాల నుంచి వివరాలు సేకరించి ఈ నివేదికను రూపొందించారు. ఇందులో ముఖ్యాంశాలు ఇలా..
- ప్రతి ఐదుగురు ఉన్నతాధికార్లలో నలుగురు నియామకాలు, వేతనం, ప్రోత్సాహకాలపై నిర్ణయాల్లో నైపుణ్యాలకే ప్రాధాన్యమిస్తున్నారు. దీనివల్ల పక్షపాత ధోరణి తగ్గుతోందని పారదర్శకత పెరుగుతోందని నివేదిక పేర్కొంది.
- డిజిటల్ యుగంలో విజయవంతం కావాలంటే బహుళ నైపుణ్యాలను కలిగి ఉండేలా విద్యార్థులను విద్యా సంస్థలు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని గుప్తా తెలిపారు.
- వలసల రేటు అధికంగా ఉన్నప్పటికీ.. 70 శాతం సంస్థల నుంచి ఎంబీఏ పట్టభద్రులకు గిరాకీ ఎక్కువగానే ఉందని నివేదిక తెలిపింది. సంస్థల వ్యాపార విజయవంతంలో ఎంబీఏ పట్టభద్రులకున్న ప్రాధాన్యాన్ని ఇది తెలియజేస్తోందని పేర్కొంది. అలాగే గత ఐదేళ్లలో వీరి పారితోషికంలోనూ 5.2 శాతం వార్షిక వృద్ధి ఉందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి