సంక్షిప్త వార్తలు(5)
షేర్లు లేదా సెక్యూరిటీలను అర్హులైన సంస్థాగత మదుపర్లకు కేటాయించడం ద్వారా రూ.12,500 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సోమవారం వెల్లడించింది.
రూ.12,500 కోట్ల నిధుల సమీకరణకు అదానీ ఎనర్జీ బోర్డు ఆమోదం
దిల్లీ: షేర్లు లేదా సెక్యూరిటీలను అర్హులైన సంస్థాగత మదుపర్లకు కేటాయించడం ద్వారా రూ.12,500 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సోమవారం వెల్లడించింది. కంపెనీ బోర్డు సోమవారం సమావేశమై, నిధుల సమీకరణ అంశంపై చర్చిస్తుందని గత వారం బీఎస్ఈకి సంస్థ సమాచారమిచ్చింది. నిధుల సమీకరణకు కారణాలు, ఇష్యూ ధర వంటి వివరాలను మాత్రం ప్రకటించలేదు.
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ బోర్డు కూడా నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు నేడు (మంగళవారం) సమావేశం కానుంది. ఈ విషయాన్ని కూడా గత వారమే సంస్థ బీఎస్ఈకి తెలిపింది.
క్యూఐపీ పద్ధతిలో వేదాంతా రూ.8,500 కోట్ల సమీకరణ!
దిల్లీ: అర్హులైన సంస్థాగత మదుపరు (క్యూఐపీ)లకు షేర్ల జారీ ద్వారా రూ.8,500 కోట్లు సమీకరించే అంశాన్ని అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంతా లిమిటెడ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వాటాదార్ల అనుమతి లభిస్తే రాబోయే కొన్ని వారాల్లో ఈ క్యూఐపీని వేదాంతా చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు రాణిస్తుండటాన్ని అనుకూలంగా మల్చుకోవాలన్నదే దీని వెనక కంపెనీ ఉద్దేశంగా పేర్కొన్నాయి. ఇందుకోసం యాక్సిస్ బ్యాంకు అనుబంధ సంస్థ యాక్సిస్ కేపిటల్, సిటీ గ్రూపు లాంటి అడ్వయిజర్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నాయి. మధ్య ప్రాచ్య ఫండ్స్ సహా పలు పెట్టుబడి సంస్థలను ఆకర్షించే పనిలోనూ వేదాంతా ఉన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది వేదాంతా షేరు 78% రాణించడంతో, కంపెనీ మార్కెట్ విలువ రూ.1,70,730.44 కోట్లుగా ఉంది.
హెచ్బీఎల్ పవర్ లాభం రూ.70.58 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: హెచ్బీఎల్ పవర్ సిస్టమ్స్, మార్చి త్రైమాసికానికి రూ.604.28 కోట్ల ఆదాయంపై రూ.70.58 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదేకాలంలో రూ.397.80 కోట్ల ఆదాయంపై రూ.34.83 కోట్ల లాభం నమోదు చేసింది. దీంతో పోల్చి చూస్తే ఈసారి నికరలాభం రెట్టింపయ్యింది. ఆదాయం దాదాపు 50% పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఈ సంస్థ రూ.2,209 కోట్ల ఆదాయాన్ని, రూ.263.78 కోట్ల నికరలాభాన్ని, రూ.9.46 ఈపీఎస్ నమోదు చేసింది. 2022-23లో ఆదాయం రూ.1,249.74 కోట్లు, నికరలాభం 95.53 కోట్లు ఉన్నాయి. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు 50 పైసలు డివిడెండ్ చెల్లించాలని యాజమాన్యం ప్రతిపాదించింది.
ఎన్ఎండీసీ లాభం రూ.1416 కోట్లు
దిల్లీ: ప్రభుత్వరంగ ఇనుప ఖనిజం గనుల సంస్థ ఎన్ఎండీసీ, మార్చి త్రైమాసికంలో రూ.1415.62 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.2276.94 కోట్ల కంటే ఇది 38% తక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.5842.52 కోట్ల నుంచి రూ.6908.37 కోట్లకు పెరిగింది. వ్యయాలూ రూ.3794.18 కోట్ల నుంచి రూ.4519.64 కోట్లకు చేరాయి. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.5571.25 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 లాభం రూ.5537.72 కోట్ల కంటే ఎక్కువే.
అపర్ణ వాణిజ్య సముదాయాలు రూ.284 కోట్ల పెట్టుబడులు
ఈనాడు, హైదరాబాద్: ఇప్పటివరకు నివాస సముదాయాలు నిర్మిస్తున్న అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కొత్తగా వాణిజ్య సముదాయాల నిర్మాణంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్ నల్లగండ్ల ప్రాంతంలో అపర్ణ నియో మాల్, అపర్ణ సినిమాస్ పేరుతో కొత్త ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. 3.67 ఎకరాల స్థలంలో, 3.5 లక్షల చదరపు అడుగుల్లో నియో మాల్ కోసం రూ.252 కోట్లు, అపర్ణ సినిమాస్ కోసం రూ.32 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు సంస్థ డైరెక్టర్ రాకేశ్ రెడ్డి తెలిపారు. 2027 నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో 4 మాల్స్ ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. నివాస గృహాల నిర్మాణంలో 20%, వాణిజ్య స్థలాల అభివృద్ధిలో 10% వృద్ధి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. నల్లగండ్ల మాల్ సమీపంలో 25కు పైగా గేటెడ్ కమ్యూనిటీలు, 70కి పైగా ఐటీ కంపెనీలున్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్