ఎస్‌ఎంఎస్‌ ఫార్మా లాభం మూడింతలు

ఎస్‌ఎంఎస్‌ ఫార్మా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.247.44 కోట్ల ఆదాయాన్ని, రూ.17.50 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

Published : 30 May 2024 03:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్‌ఎంఎస్‌ ఫార్మా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.247.44 కోట్ల ఆదాయాన్ని, రూ.17.50 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.2.04 ఉంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.150.68 కోట్లు, నికరలాభం రూ.5.98 కోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పోల్చితే సమీక్షా త్రైమాసికంలో ఆదాయం భారీగా, నికరలాభం దాదాపు 3 రెట్లు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి ఎస్‌ఎంఎస్‌ ఫార్మా రూ.713.72 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. వార్షిక నికరలాభం రూ.49.89 కోట్లు, ఈపీఎస్‌ రూ.5.89 ఉన్నాయి. 2022-23లో రూ.526.96 కోట్ల ఆదాయంపై రూ.7.22 కోట్ట నష్టాన్ని సంస్థ నమోదు చేయడం గమనార్హం. వాటాదార్లకు ఒక్కో షేరుకు 40 పైసల చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని ఎస్‌ఎంఎస్‌ ఫార్మా యాజమాన్యం ప్రతిపాదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని