సంక్షిప్త వార్తలు(6)
స్పెక్ట్రమ్ వేలం ఈ నెల 6న నిర్వహించాల్సి ఉండగా, ఈనెల 25కు వాయిదా వేస్తున్నట్లు టెలికాం విభాగం (డాట్) తెలిపింది. మొబైల్ ఫోన్ సేవల కోసం 8 స్పెక్ట్రమ్ బ్యాండ్లను రూ.96,317 కోట్ల కనీస ధరతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
స్పెక్ట్రమ్ వేలం 25కు వాయిదా: డాట్
దిల్లీ: స్పెక్ట్రమ్ వేలం ఈ నెల 6న నిర్వహించాల్సి ఉండగా, ఈనెల 25కు వాయిదా వేస్తున్నట్లు టెలికాం విభాగం (డాట్) తెలిపింది. మొబైల్ ఫోన్ సేవల కోసం 8 స్పెక్ట్రమ్ బ్యాండ్లను రూ.96,317 కోట్ల కనీస ధరతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 800 - 900 - 1800 - 2100 - 2300 - 2500 - 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్ను వేలంలో విక్రయించనుంది. ఈ ప్రక్రియ కోసం రిలయన్స్ జియో రూ.3,000 కోట్ల మొత్తాన్ని (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్-ఈఎండీ) డిపాజిట్ చేయడం ద్వారా అత్యధిక రేడియో తరంగాలకు బిడ్ వేసేందుకు సిద్ధమైంది. డాట్ విడుదల చేసిన ప్రీ-క్వాలిఫైడ్ బిడ్డర్ వివరాల ప్రకారం, భారతీ ఎయిర్టెల్ రూ.1,050 కోట్ల ఈఎండీని, వొడాఫోన్ ఐడియా రూ.300 కోట్ల ఈఎండీని డిపాజిట్ చేశాయి.
టాటా మోటార్స్ ఫైనాన్స్, టాటా కేపిటల్ విలీనానికి ఆమోదం
దిల్లీ: టాటా మోటార్స్ ఫైనాన్స్ (టీఎంఎఫ్ఎల్)తో టాటా కేపిటల్ (టీసీఎల్) విలీనానికి ఇరు సంస్థల బోర్డులు ఆమోదం తెలిపాయి. టాటా మోటార్స్ ఫైనాన్స్.. టాటా మోటార్స్కు అనుబంధ సంస్థ. ‘ఎన్సీఎల్టీ ఆమోదిత షేర్ల బదలాయింపు పద్ధతిలో టాటా మోటార్స్ ఫైనాన్స్, టాటా కేపిటల్ విలీనానికి ఈ రెండు సంస్థలతో పాటు, టాటా మోటార్స్ బోర్డు ఆమోదం తెలిపినట్లు’ ఎక్స్ఛేంజీలకు ఈ సంస్థలు సమాచారం ఇచ్చాయి. విలీన పథకం ప్రకారం.. టీఎంఎఫ్ఎల్ వాటాదార్లకు టీసీఎల్ షేర్లను జారీ చేస్తుంది. తద్వారా విలీనానంతర సంస్థలో టాటా మోటార్స్ వాటా 4.7 శాతంగా ఉంటుంది. ఈ షేర్ల బదలాయింపు ప్రతిపాదనకు ఎన్సీఎల్టీ, ఆర్బీఐ, సెబీతో పాటు టీసీఎల్, టీఎంఎఫ్ఎల్ వాటాదార్లు, రుణ సంస్థల నుంచి ఆమోదం లభించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు 9-12 నెలల సమయం పడుతుందని టాటా మోటార్స్ వెల్లడించింది.
జిందాల్ స్టెయిన్లెస్ చేతికి ఎవర్గ్రేట్
దిల్లీ: ఎవర్గ్రేట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పీటీఈ లిమిటెడ్ సింగపూర్ (ఈఐపీఎల్)లో 100% వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు జిందాల్ స్టెయిన్లెస్ వెల్లడించింది. దీంతో ఈఐపీఎల్ తమకు అనుబంధ సంస్థగా మారిందని పేర్కొంది. ఈ కొనుగోలు 2024 జూన్ 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.
టీవీ ఛానళ్ల చందా 5-8% పెరగొచ్చు!
దిల్లీ: టీవీ ఛానళ్ల చందా రుసుములు 5-8% పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. డిస్నీ స్టార్, వయాకామ్18, జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా వంటి బ్రాడ్కాస్టర్లు తమ బొకే (ఛానెళ్ల గుచ్ఛం) ధరల్ని పెంచడమే ఇందుకు కారణం. కొత్త టారిఫ్ల ప్రకారం ఒప్పందాలపై సంతకం చేయని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ ఆపరేటర్ల (డీపీఓల) సిగ్నల్స్ను బ్రాడ్కాస్టర్లు, సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు స్విచ్ఛాప్ చేయరాదంటూ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) సూచించింది. జూన్ 1తో పోలింగ్ ముగిసి, మంగళవారం ఫలితాలు కూడా రావడంతో డీపీఓలపై బ్రాడ్కాస్టర్లు రేట్లు పెంచమని ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎయిర్టెల్ డిజిటల్ టీవీ వంటి కొన్ని డీపీఓలు స్వల్పంగా రేట్లను పెంచాయి.
టొరొంటో నుంచి ముంబయికి నాన్ స్టాప్ విమానాలు: ఎయిర్ కెనడా
ముంబయి: టొరొంటో నుంచి ముంబయికి కొత్తగా నాన్ స్టాప్ విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఎయిర్ కెనడా ప్రకటించింది. శీతాకాల షెడ్యూల్లో భాగంగా కల్గారీ నుంచి లండన్ హీత్రో విమానాశ్రయం మీదుగా దిల్లీకి కొత్తగా సీజనల్ విమాన సర్వీసు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త విమాన సర్వీసులతో భారత్ నుంచి ఎయిర్ కెనడా నడిపిస్తున్న వారంవారీ విమాన సర్వీసుల సంఖ్య 25కు చేరుతుంది.
కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్లో 10% వాటా విక్రయించనున్న పీఎన్బీ
దిల్లీ: బీమా సంస్థ కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 10% వాటాను విక్రయించబోతున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం సదరు సంస్థలో పీఎన్బీకి 23% వాటా ఉంది. 10% వాటా విక్రయానికి పీఎన్బీ బోర్డు ఆమోదం తెలిపింది. నియంత్రణ సంస్థల అనుమతికి లోబడి ఈ వాటా విక్రయం ఉంటుందని పీఎన్బీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఐపీఓ ద్వారా బీఎస్ఈ/ఎన్ఎస్ఈల్లో సదరు కంపెనీని నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంస్థలో హెచ్ఎస్బీసీకి 26%, కెనరా బ్యాంక్కు 51% వాటాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?