అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల పతనం

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లన్నీ మంగళవారం భారీగా పతనమయ్యాయి. చాలా వరకు షేర్లు లోయర్‌ సర్క్యూట్‌కు పడిపోయాయి.

Published : 05 Jun 2024 02:28 IST

దానీ గ్రూప్‌ కంపెనీల షేర్లన్నీ మంగళవారం భారీగా పతనమయ్యాయి. చాలా వరకు షేర్లు లోయర్‌ సర్క్యూట్‌కు పడిపోయాయి. ఫలితంగా అదానీ గ్రూప్‌లోని 10  కంపెనీల మార్కెట్‌ విలువ, రూ.3.64 లక్షల కోట్లు క్షీణించి, రూ.15.78 లక్షల కోట్లకు పరిమితమైంది. ఒక దశలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్‌ 25%; అంబుజా సిమెంట్స్‌   22.5%; అదానీ పవర్, అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్‌ 20% చొప్పున పతనమై లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని