సంక్షిప్త వార్తలు
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు అదానీ పవర్ నుంచి రూ.3,500 కోట్ల విలువైన ఆర్డరు లభించినట్లు ప్రభుత్వ రంగ సంస్థ భెల్ ప్రకటించింది.
భెల్కు రూ.3,500 కోట్ల ఆర్డరు
దిల్లీ: ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు అదానీ పవర్ నుంచి రూ.3,500 కోట్ల విలువైన ఆర్డరు లభించినట్లు ప్రభుత్వ రంగ సంస్థ భెల్ ప్రకటించింది. సూపర్క్రిటికల్ టెక్నాలజీపై 2×800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పరికరాలను సరఫరా చేసేందుకు జూన్ 5న ఇరు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు భెల్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్కు అవసరమైన బాయిలర్, టర్బైన్ జనరేటర్లను త్రిచీ, హరిద్వార్ ప్లాంట్లలో తయారు చేయనున్నట్లు భెల్ తెలిపింది.
వ్యవసాయ పరిశోధనలో రూ.1 పెట్టుబడిపై రూ.13 ప్రతిఫలం!
నాస్ ప్రెసిడెంట్ హిమాన్షు
దిల్లీ: వ్యవసాయ పరిశోధన-అభివృద్ధి (ఆర్అండ్డీ)లో ప్రతి రూ.1 పెట్టుబడిపై రూ.13 ప్రతిఫలం లభిస్తుందని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (నాస్) ప్రెసిడెంట్ హిమాన్షు పాథక్ తెలిపారు. వ్యవసాయ ఆర్అండ్డీలో పెట్టుబడులు లాభదాయకమని, పశుసంవర్థక రంగంలో ఈ ప్రతిఫలం ఇంకా ఎక్కువగానే ఉంటుందని నాస్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అన్నారు. అయితే మన వ్యవసాయ పరిశోధనా వ్యవస్థను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పంట సాగు వ్యయాలు పెరగడం, తక్కువ ఉత్పాదకత, వాతావరణ మార్పు ప్రభావం రూపంలో ఈ రంగానికి సవాళ్లు ఎదురవుతున్న దృష్ట్యా ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
5 నెలల కనిష్ఠానికి సేవల వృద్ధి
దిల్లీ: దేశ సేవల రంగ వృద్ధి మే నెలలో 5 నెలల కనిష్ఠమైన 60.2 పాయింట్లుగా నమోదైంది. బుధవారం విడుదల చేసిన నెలవారీ సర్వే ప్రకారం, తీవ్రమైన పోటీ, ధరల ఒత్తిళ్లు, అధిక వేడి (హీట్ వేవ్) మధ్య అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సేవలకు కొత్త ఆర్డర్లు దశాబ్ద కనిష్ఠానికి చేరాయి. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ ఈ ఏడాది ఏప్రిల్లో 60.8 పాయింట్లు కాగా, మేలో 60.2 పాయింట్లకు పరిమితమైంది. 2023 డిసెంబరు తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి. పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధిగా, దిగువన నమోదైతే క్షీణతగా భావిస్తారు. మేలో వృద్ధి సానుకూలంగానే ఉన్నా, అంతకుముద]ు నెలల కంటే తగ్గింది. ‘భారత సేవల విపణిలో వృద్ధి గత నెలలో నెమ్మదించింది. కొత్త ఆర్డర్ల రాక స్వల్పంగా వృద్ధి చెందింది. అయితే అధిక ముడి పదార్థాల వ్యయాలు, కార్మికుల వేతనాల వల్ల ధరల ఒత్తిళ్లు పెరిగాయ’ని హెచ్ఎస్బీసీ అంతర్జాతీయ ఆర్థికవేత్త మైత్రేయి దాస్ వెల్లడించారు.
పెరూ దేశంలోనూ యూపీఐ సేవలు
దిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) తరహా రియల్-టైమ్ చెల్లింపుల వ్యవస్థను లాటిన్ అమెరికా దేశమైన పెరూలో తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూ, ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్పీఐఎల్) భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూపీఐ సాంకేతికతను దక్షిణ అమెరికాలో ప్రవేశపెట్టబోతున్న తొలి దేశంగా పెరూ నిలుస్తుందని ఎన్ఐపీఎల్ తెలిపింది. ఆ దేశ ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుందని ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ సీఈఓ రితేశ్ శుక్లా వెల్లడించారు. ఎన్ఐపీఎల్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్