అల్లకల్లోల మార్కెట్పై ఈడీ దర్యాప్తు చేయాలి
ఎగ్జిట్ పోల్స్ ఫలితంగా ఒకరోజు రూ.13 లక్షల కోట్లకు పైగా లాభాలు రావడం.. మరుసటి రోజే ఎన్నికల వాస్తవ ఫలితాలు వెల్లడయ్యాక.. ఊహకందని విధంగా స్టాక్ మార్కెట్లు పతనమై రూ.31 లక్షల కోట్ల మదుపర్ల సంపద తుడిచిపెట్టుకుపోయిన అంశంలో..
మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిమాండ్
దిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఫలితంగా ఒకరోజు రూ.13 లక్షల కోట్లకు పైగా లాభాలు రావడం.. మరుసటి రోజే ఎన్నికల వాస్తవ ఫలితాలు వెల్లడయ్యాక.. ఊహకందని విధంగా స్టాక్ మార్కెట్లు పతనమై రూ.31 లక్షల కోట్ల మదుపర్ల సంపద తుడిచిపెట్టుకుపోయిన అంశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు నిర్వహించాలని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు. చిన్న మదుపర్లు భారీగా నష్టపోయేందుకు కారణమైన ఈ విషయాలపై పారదర్శక దర్యాప్తు అవసరమని కోరుతూ, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్కు శర్మ లేఖ రాశారు. జూన్ 3, 4 తేదీల్లో స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు కారణాలు కనిపెట్టేందుకు, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు ప్రారంభించిందా, మార్కెట్ను స్థిమిత పరచడానికి చర్యలేవైనా తీసుకుందా అన్నది వెల్లడించాలని కోరారు. ‘ఆ రెండు రోజుల్లో చిన్న మదుపర్లేమో తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకున్నారు. పెద్ద స్థాయి మదుపర్లు మాత్రం లాభాలు అందుకున్నారు. ఇప్పటికీ స్టాక్ మార్కెట్ పూర్తిగా కోలుకోలేద’ని ఆయన వివరించారు.
ఈ అంశాలు తేలాలి: ‘జూన్ 4న మార్కెట్లు భారీగా పెరుగుతాయని ప్రధాని, హోం మంత్రి ముందుగానే ప్రకటనలు చేయడంతో, చిన్న మదుపర్లు ఆశపడి ముందుగానే షేర్లు కొనుగోలు చేసుకుని, ఉంచుకోవడంతో భారీగా నష్టపోయారు. ప్రధాని ఇటువంటి ప్రకటన ఎందుకు చేశారో తెలియదు. ఆర్థిక శాఖలో ‘నిపుణులు’ ఎవరైనా పీఎమ్ఓకు ఇలా చేయమని సూచించారా అన్నది తేలాలి. భారీగా లాభాలు పొందిన వారు, ఆ డబ్బులను ఎక్కడికి తరలించారు? మనీలాండరింగ్కు దీనికి ఏదైనా సంబంధం ఉందా అన్నది ఈడీ తేల్చాల’ని ఆ లేఖలో శర్మ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ విషయంలో మౌనంగా ఉండకుండా ఈడీ, సీబీఐ, సీబీడీటీలను రంగంలోకి దించాలని సూచించారు. ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా 1999-2000 సంవత్సరంలో శర్మ పనిచేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్