మేలో దేశీయ విమాన ప్రయాణికులు 1.39 కోట్లు: ఇక్రా
దేశీయ విమాన మార్గాల్లో ఈ ఏడాది 1.39 కోట్ల మంది ప్రయాణించినట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఏప్రిల్లో నమోదైన 1.32 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 5.1% అధికం.
ముంబయి: దేశీయ విమాన మార్గాల్లో ఈ ఏడాది 1.39 కోట్ల మంది ప్రయాణించినట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఏప్రిల్లో నమోదైన 1.32 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 5.1% అధికం. కొవిడ్ ముందు స్థాయితో పోల్చినా, గత నెల ప్రయాణికుల సంఖ్య 14% ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 15.4 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణాలు చేశారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రయాణించిన వారితో పోలిస్తే, 13% ఎక్కువ. కొవిడ్ పరిణామాలకు ముందు 2019-20లో 14.2 కోట్ల మంది మాత్రమే దేశీయ విమానాల్లో ప్రయాణించారు. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలు స్థిరంగా ఉంటుండటంతో.. 2024-25లోనూ ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి కొనసాగుతుందని ఇక్రా అంచనా వేస్తోంది. విమానయాన సంస్థల సామర్థ్యం ఈ ఏడాది ఏప్రిల్తో పోలిస్తే 2%, 2023 మే నెలతో పోలిస్తే 6% అధికమయ్యాయి.
విమాన ఇంధన ధర తగ్గింది
- విమాన ఇంధనం (ఏటీఎఫ్) కిలో లీటరు సగటు ధర 2023-24లో రూ.1,03,499గా ఉంది. 2022-23 నాటి రూ.1,21,013తో పోలిస్తే ఇది 14% తక్కువ. కొవిడ్ ముందు నాటి 2019-20లో ఈ వ్యయం రూ.65,368 మాత్రమే కావడం గమనార్హం.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏటీఎఫ్ ధర వార్షిక ప్రాతిపదికన 5.4% ఎక్కువగా ఉంది. ఈ నెలలో 6.5% తగ్గిందని ఇక్రా పేర్కొంది. విమానయాన సంస్థల వ్యయాల్లో సుమారు 30-40% ఇంధన వ్యయాలే ఉంటాయి. మొత్తం వ్యయాల్లో 45-60% మేర (విమాన లీజు చెల్లింపులు, నిర్వహణ, విమాన ఇంజిన్ల నిర్వహణ, ఇంధన) డాలర్ల రూపేణ చెల్లించాల్సి వస్తోంది.
నష్టాలు తగ్గుతున్నాయ్: 2022-23లో దేశీయ విమానయాన పరిశ్రమ రూ.17,000-17,500 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ తగ్గడమూ ఈ నష్టాలకు కారణమైంది. తదుపరి నష్టాలు తగ్గుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం మాదిరే 2024-25లోనూ విమానయాన రంగ నష్టాలు రూ.3,000-4,000 కోట్లకు పరిమితం కావొచ్చని ఇక్రా అంచనా వేసింది. విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడం, టికెట్ ధరలు ఇందుకు దోహదం చేయొచ్చని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే