నాలుగేళ్లలో రూ.1300 కోట్ల టర్నోవర్!
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ సంస్థ, ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ వచ్చే మూడు - నాలుగేళ్లలో తన టర్నోవర్ను రూ.1300 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎస్ఎంఎస్ ఫార్మా లక్ష్యం
రూ.150 కోట్ల మూలధన పెట్టుబడికి సన్నాహాలు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ సంస్థ, ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ వచ్చే మూడు - నాలుగేళ్లలో తన టర్నోవర్ను రూ.1300 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు 20% ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) సాధించాలని భావిస్తోంది. దీనికి తగ్గట్లుగా తన తయారీ యూనిట్లను విస్తరించడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ.150 కోట్ల మూలధన పెట్టుబడిని సమీకరిస్తోంది. ఈ నిధుల్లో కొంత సొంతంగా సమకూర్చుకోవడంతో పాటు, మరికొంత సొమ్మును టర్మ్ రుణాల రూపంలో సేకరిస్తారు. ఆర్థిక ఫలితాలపై మదుపరులతో నిర్వహించిన టెలికాన్ఫెరెన్స్ కాల్లో ఈ విషయాలను ఎస్ఎంఎస్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంశీ కృష్ణ వెల్లడించారు.
ఆదుకున్న ఐబూప్రూఫెన్: గత ఆర్థిక సంవత్సరానికి ఈ సంస్థ రూ.709 కోట్ల ఆదాయంపై రూ.50 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23లో రూ.522 కోట్ల ఆదాయంపై రూ.7 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలు నమోదు చేయడానికి ఐబూప్రూఫెన్తో పాటు డయాబెటిక్ ఔషధాలు దోహదపడినట్లు ఎస్ఎంఎస్ ఫార్మా వివరించింది. గత ఆర్థిక సంవత్సర టర్నోవర్లో 19% ఆదాయం ఐబూప్రూఫెన్ నుంచే లభించినట్లు సంస్థ తెలిపింది.
- ఇదే సానుకూలత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగగలదని సంస్థ యాజమాన్యం ఆశిస్తోంది. ఐబూప్రూఫెన్ అమ్మకాల్లో 25-28% వృద్ధి నమోదు కావచ్చని అంచనా వేస్తోంది. డయాబెటిక్ ఔషధాల అమ్మకాలూ పెరుగుతాయని అంచనా వేస్తోంది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) ఆదాయాల్లో 20-25% వృద్ధి ఉంటుందని, అదే సమయంలో 20% ఎబిటా నమోదు కావచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎబిటా 16 శాతమే. ఐబూప్రూఫెన్ ఔషధ ధరలు ఇటీవల తగ్గాయి. అయినా, ఇతర సంస్థలతో పోటీపడి తమ మార్కెట్ వాటా నిలబెట్టుకోగలుగుతున్నట్లు ఎస్ఎంఎస్ ఫార్మా వివరించింది. ప్రస్తుతం ఈ ఔషధం ధరలు స్థిరంగా ఉన్నట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల