2 రోజుల్లో.. రూ.21 లక్షల కోట్ల లాభం
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతుండటంతో, రాజకీయ స్థిరత్వంపై మదుపర్లకు భరోసా ఏర్పడుతోంది. ఫలితమే వరుసగా రెండో రోజూ దేశీయ సూచీలు పరుగులు తీశాయి. సెన్సెక్స్ మళ్లీ 75,000 పాయింట్ల స్థాయిని అందుకుంది.
మార్కెట్ల రికవరీతో పెరిగిన మదుపర్ల సంపద
75,000 పాయింట్ల ఎగువకు సెన్సెక్స్
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతుండటంతో, రాజకీయ స్థిరత్వంపై మదుపర్లకు భరోసా ఏర్పడుతోంది. ఫలితమే వరుసగా రెండో రోజూ దేశీయ సూచీలు పరుగులు తీశాయి. సెన్సెక్స్ మళ్లీ 75,000 పాయింట్ల స్థాయిని అందుకుంది. డాలర్తో పోలిస్తే రూపాయి 9 పైసలు తగ్గి 83.53 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 78.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
- మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గురువారం రూ.7.83 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం నాటి లాభం రూ.13.22 లక్షల కోట్లను కలిపితే గత రెండు ట్రేడింగ్ రోజుల్లో రూ.21.05 లక్షల కోట్లు పెరిగి రూ.415.89 లక్షల కోట్ల (దాదాపు 4.98 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది.
సెన్సెక్స్ ఉదయం 75,078.70 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీ, 75,297.73 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరకు 692.27 పాయింట్ల లాభంతో 75,074.51 వద్ద ముగిసింది. నిఫ్టీ 201.05 పాయింట్లు పెరిగి 22,821.40 దగ్గర స్థిరపడింది.
- అదానీ పవర్ నుంచి రూ.3500 కోట్ల విలువైన ఆర్డరు దక్కించుకోవడంతో భెల్ షేరు 8.85% దూసుకెళ్లి రూ.277.95 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.7,973.93 కోట్లు పెరిగి రూ.96,853.59 కోట్లకు చేరింది.
- రెండో రోజూ అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల జోరు కొనసాగింది. అదానీ ఎనర్జీ 5.10%, అదానీ టోటల్ గ్యాస్ 3.97%, ఎన్డీటీవీ 3.70%, అదానీ పవర్ 3.17%, అదానీ విల్మర్ 3.05%, ఏసీసీ 2.56%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.13%, అదానీ గ్రీన్ ఎనర్జీ 1.99%, అంబుజా సిమెంట్స్ 1.77% లాభాలు నమోదు చేశాయి. అదానీ పోర్ట్స్ 0.18% తగ్గింది.
- ఏథర్ ఎనర్జీలో అదనంగా 2.2% వాటాను రూ.124 కోట్లకు కొనుగోలు చేసినట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. దీంతో కంపెనీలో హీరో మోటో వాటా 39.7 శాతానికి పెరిగింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 23 లాభపడ్డాయి. టెక్ మహీంద్రా 4.07%, హెచ్సీఎల్ టెక్ 4.04%, ఎస్బీఐ 3.46%, ఇన్ఫోసిస్ 2.95%, ఎన్టీపీసీ 2.65%, టీసీఎస్ 2.24%, ఎల్ అండ్ టీ 2.24%, విప్రో 2.09%, భారతీ ఎయిర్టెల్ 2.03%, టాటా స్టీల్ 1.65% రాణించాయి. హెచ్యూఎల్ 2.04%, ఏషియన్ పెయింట్స్ 1.88%, ఎం అండ్ ఎం 1.57%, నెస్లే 1.40%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.35%, యాక్సిస్ బ్యాంక్ 1.10% నష్టపోయాయి.
ఐటీసీ హోటల్స్ విభజన ప్రతిపాదనకు ఆమోదం: ఐటీసీ హోటల్స్ను ప్రత్యేక సంస్థగా విభజించేందుకు వాటాదార్లు అనుమతి ఇచ్చారని ఐటీసీ తెలిపింది. విభజన తర్వాత ఐటీసీ హోటల్స్లో 40% వాటా ఐటీసీ చేతిలో ఉంటుంది. ఐటీసీ హోటల్స్కు దేశవ్యాప్తంగా 120కు పైగా హోటళ్లు ఉన్నాయి.
జీ ఎంటర్టైన్మెంట్ నిధుల సమీకరణ: ఈక్విటీ షేర్ల జారీ, క్యూఐపీ సహా పలు పద్ధతుల్లో రూ.2000 కోట్ల సమీకరణ ప్రణాళికకు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఒకటి లేదా పలు విడతల్లో ఈ నిధుల సమీకరణ ఉండనుంది. ఈ ప్రతిపాదనకు నియంత్రణ సంస్థలు, వాటాదార్ల అనుమతి లభించాల్సి ఉంటుంది.
వీఐపీ ఇండస్ట్రీస్ నుంచి నిషాబా గోద్రేజ్ నిష్క్రమణ: సూట్కేసుల తయారీ సంస్థ వీఐపీ ఇండస్ట్రీస్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ పదవికి నిషాబా గోద్రేజ్ రాజీనామా చేశారు. నాయకత్వ బాధ్యతలు, వారసత్వ ప్రణాళికలు ఇందుకు కారణమని తెలిపారు. ప్రస్తుతం ఆమె గోద్రేజ్ కన్జూమర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా ఉన్నారు. ఈనెల 3న ఆమె రాజీనామా చేసినట్లు సంస్థ తెలిపింది.
విప్రోకు రూ.4200 కోట్ల ఆర్డరు: అగ్రగామి అమెరికా కమ్యూనికేషన్ సేవల సంస్థ నుంచి 500 మి.డాలర్ల (దాదాపు రూ.4,200 కోట్ల) విలువైన ఆర్డరు లభించినట్లు ఐటీ సేవల సంస్థ విప్రో తెలిపింది. ఈ ఆర్డరు కాలవ్యవధి అయిదేళ్లు. ఇందులో భాగంగా కొన్ని ఉత్పత్తులకు సేవలు, పరిశ్రమ సంబంధిత సొల్యూషన్స్ను విప్రో అందించనుంది. కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియా నేతృత్వంలో కంపెనీకి ఇదే మొదటి పెద్ద ఆర్డరు కావడం గమనార్హం.
నేటి ఉదయం 10 గంటలకు ఆర్బీఐ సమీక్ష నిర్ణయాల వెల్లడి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించనున్నారు. బుధవారం నుంచి జరుగుతున్న ఈ సమీక్షలోనూ, వడ్డీ రేట్లను మార్చే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటును ఆర్బీఐ 6.5% వద్దే స్థిరంగా కొనసాగిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు