సంక్షిప్త వార్తలు
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్ 4వ తేదీన స్టాక్ మార్కెట్ భారీగా పతనమవ్వడంపై పూర్తి నివేదికను సమర్పించాల్సిందిగా కేంద్రం, సెబీకి ఆదేశాలివ్వాలని సుప్రీం కోర్టులో విశాల్ తివారీ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
4 నాటి స్టాక్ మార్కెట్ పతనంపై కేంద్రం, సెబీ నుంచి నివేదిక కోరండి
సుప్రీం కోర్టులో పిటిషన్
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్ 4వ తేదీన స్టాక్ మార్కెట్ భారీగా పతనమవ్వడంపై పూర్తి నివేదికను సమర్పించాల్సిందిగా కేంద్రం, సెబీకి ఆదేశాలివ్వాలని సుప్రీం కోర్టులో విశాల్ తివారీ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అలాగే అదానీ- హిండెన్బర్గ్ కేసు వ్యవహారంలో జస్టిస్ ఎ.ఎం.సప్రే నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలను పరిశీలించేందుకు జూన్ 3న జారీ చేసిన ఆదేశాల స్థితిపైనా నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వం, సెబీకి ఆదేశాలివ్వాలని కూడా తివారీ కోరారు. నిపుణుల కమిటీ సూచనలను నిర్మాణాత్మకంగా కేంద్రం, సెబీ పరిశీలించి నియంత్రణ వ్యవస్థల బలోపేతానికి, మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు తెలిపింది. ‘లోక్సభ 2024 ఎన్నిక ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత స్టాక్ మార్కెట్ భారీగా పెరిగింది. కానీ అసలైన ఫలితాలు వెలువడగానే భారీగా పతనమయ్యాయి. వార్తా కథనాల ప్రకారం.. ఆ రోజు మదుపర్లకు రూ.20 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది. నియంత్రణ వ్యవస్థల పనితీరుపై సందేహాలు తలెత్తేందుకు ఇది దారి తీసింది. కోర్టు దీనిపై ఆదేశాలు ఇవ్వకుంటే.. ఈ పరిస్థితి మారద’ని పిటిషన్లో తివారీ పేర్కొన్నారు. భాజపా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో జూన్ 3వ తేదీన (సోమవారం) సెన్సెక్స్ 2,507 పాయింట్లు పెరగగా.. ఆ మరుసటి రోజు అంటే ఫలితాల వెల్లడైన మంగళవారం నాడు సెన్సెక్స్ 4,390 పాయింట్లు నష్టపోయింది.
51,006 సీసాల సెఫ్డినిర్ను వెనక్కి రప్పిస్తున్న లుపిన్
దిల్లీ: జెనరిక్ యాంటిబయోటిక్ ఔషధం సెఫ్డినిర్ (ఓరల్ సస్పెన్షన్ 250 ఎంజీ/5 ఎంల్)కు సంబంధించి 51,006 సీసాలను అమెరికాలోని లుపిన్కు చెందిన సంస్థ వెనక్కి (రీకాల్) రప్పిస్తోంది. సీసా మూతలో లోపం ఇందుకు కారణమని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ తన తాజా దర్యాప్తు నివేదికలో వెల్లడించింది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల చికిత్సలో సెఫ్రిన్ ఓరల్ సస్పెన్షన్ను వాడతారు. వెనక్కి రప్పిస్తున్న ఈ ఔషధ సీసాలను మండిదీప్లోని లుపిన్ ప్లాంటులో తయారయ్యాయి. బాల్టిమోర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లుపిన్ ఫార్మాస్యూటికల్స్ అమెరికాలో వీటిని విక్రయిస్తోంది. ఈ స్వచ్ఛంద రీకాల్ను మే 8న లుపిన్ ప్రారంభించిందని యూఎస్ఎఫ్డీఏ తెలిపింది.
ఇన్స్టంట్ ఫ్లోర్ మిక్స్లపై 18% జీఎస్టీ
దిల్లీ: ఇడ్లీ, దోశ పిండితో పాటు ఇన్స్టంట్ ఫ్లోర్ మిక్స్లను సాధారణ పిండిగా వర్గీకరించలేమని, వాటిని 18% జీఎస్టీ విధించాలని గుజరాత్ అప్పీలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్(జీఏఏఏఆర్) స్పష్టం చేసింది. జీఎస్టీ అడ్వాన్స్ అథారిటీ ఇచ్చిన తీర్పుపై ఏఏఏఆర్ను గుజరాత్కు చెందిన కిచెన్ ఎక్స్ప్రెస్ ఓవర్సీస్ లిమిటెడ్ ఆశ్రయించింది. తమ 7 ఇన్స్టంట్ ఫ్లోర్ మిక్స్లను రెడీ టూ ఈట్గా పరిగణించలేమని, వాటికి కొన్ని వంట పద్ధతులను పాటించాల్సి ఉంటుందని వాదించింది. అందువల్ల వీటిని సాధారణ పిండిగానే భావించి, 5% జీఎస్టీ విధించాలని కోరింది. అయితే ఇన్స్టంట్ ఫ్లోర్ మిక్స్లను సాధారణ పిండిగా వర్గీకరించలేమని, అప్పీలుదారు పిటిషన్ను జీఏఏఏఆర్ తోసిపుచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే