Stock market: తొలిసారి 77 వేలు దాటి.. చివరికి నష్టాల్లో సెన్సెక్స్‌

Stock market: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 203 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 10 Jun 2024 15:50 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. తొలిసారి 77 వేల పాయింట్ల స్థాయిని అధిగమించింది. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో మళ్లీ వెనక్కివచ్చింది. ఐటీ సహా కొన్ని ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్‌, నిఫ్టీలు రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొని చివరికి నష్టాల్లో ముగిశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 76,935.41 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,400-77,079 పాయింట్ల మధ్య చలించింది. చివరికి 203.28 పాయింట్ల నష్టంతో 76,490.08 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 30.95 పాయింట్ల నష్టంతో 23,259.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ  83.50గా ఉంది. సెన్సెక్స్‌లో టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టపోగా.. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 79.77 డాలర్లుగా ఉండగా.. బంగారం 2,312.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని