భారత్లో 5-6 ఏళ్లలో 4000 విక్రయశాలలు: డోమినోస్
అమెరికా దిగ్గజ పిజ్జా రెస్టారెంట్ చైన్ డోమినోస్ వచ్చే 5-6 ఏళ్లలో భారత్లో తన స్టోర్ల (విక్రయశాలలు) సంఖ్యను రెట్టింపు చేసి 4,000కు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ ఇంటర్నేషనల్ ఈవీపీ (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్) ఆర్ట్ డి ఎలియా వెల్లడించారు.
అమెరికా తరవాత ఇక్కడే అధికం
దిల్లీ: అమెరికా దిగ్గజ పిజ్జా రెస్టారెంట్ చైన్ డోమినోస్ వచ్చే 5-6 ఏళ్లలో భారత్లో తన స్టోర్ల (విక్రయశాలలు) సంఖ్యను రెట్టింపు చేసి 4,000కు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ ఇంటర్నేషనల్ ఈవీపీ (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్) ఆర్ట్ డి ఎలియా వెల్లడించారు. ఈ సంస్థ మన దేశంలో 1996లో కార్యకలాపాలను ప్రారంభించగా, ఇటీవలే 2,000వ స్టోర్ను అందుబాటులోకి తెచ్చింది. అమెరికా తర్వాత ఈ స్థాయిలో డోమినోస్ స్టోర్లు తెరిచిన దేశం భారతేనని డి ఎలియా పేర్కొన్నారు. స్టోర్ల సంఖ్యాపరంగా అమెరికా తర్వాత స్థానంలో ఉన్న భారత్, తమ సంస్థ ఆదాయం పరంగానూ అంతర్జాతీయంగా అగ్రగామి 5 దేశాల్లో ఉందని తెలిపారు. మధ్య ఆదాయ వర్గాల సంఖ్యతో పాటు ఆర్థిక వ్యవస్థలో వృద్ధి, డోమినోస్కు భారత్లో గొప్ప అవకాశాలకు తావిస్తోందని ఆయన వివరించారు. మన దేశంలో డోమినోస్ స్టోర్లను జుబిలెంట్ ఫుడ్వర్క్స్ లిమిటెడ్ (జేఎఫ్ఎల్) నిర్వహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో సుమారు 180-200 స్టోర్లను తెరిచేందుకు, పిజ్జా వ్యాపారాన్ని విస్తరించేందుకు రూ.250 కోట్ల మూలధనం వెచ్చించబోతున్నట్లు సంస్థ సీఈఓ, ఎండీ సమీర్ ఖేతార్పాల్ వెల్లడించారు. 421 నగరాల్లో డోమినోస్ స్టోర్ల ద్వారా ఏడాదికి 20 కోట్లకు పైగా పిజ్జాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. మన దేశంతో పాటు టర్కీ, బంగ్లాదేశ్, శ్రీలంక, అజెర్బైజాన్, జార్జియా దేశాల్లోనూ స్టోర్లను నిర్వహించేందుకు జేఎఫ్ఎల్కు లైసెన్స్ ఉంది. 2024 మార్చి 31 నాటికి అంతర్జాతీయంగా 2,793 స్టోర్లను జేఎఫ్ఎల్ నిర్వహిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!