నియామకాలు ఆశావహం
ఈ ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో మనదేశంలో నియామకాలు ఆశావహంగానే ఉంటాయని ఓ సర్వే తెలిపింది.
జులై-సెప్టెంబరులో 30% పెరగొచ్చు
మ్యాన్పవర్ గ్రూప్ సర్వే
దిల్లీ: ఈ ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో మనదేశంలో నియామకాలు ఆశావహంగానే ఉంటాయని ఓ సర్వే తెలిపింది. నియామకాలు బాగుంటాయనే అంచనాల్లో, అంతర్జాతీయంగా భారత్ ఆరో స్థానంలో నిలిచిందని మ్యాన్పవర్ గ్రూప్ గ్లోబల్ సర్వే వెల్లడించింది. వచ్చే 3 నెలల్లో తమ సిబ్బందిని పెంచుకోవాలని 30 శాతానికి పైగా సంస్థలు చూస్తున్నట్లు తెలిపింది. భారత నికర ఉద్యోగుల నియామక అంచనా (ఎన్ఈఓ) 30 శాతంగా ఉంది. కంపెనీల మొత్తం నియామకాల ప్రణాళికల నుంచి, తొలగింపులను తీసేసి ఎన్ఈఓను లెక్కిస్తారు. ఏప్రిల్-జూన్తో పోలిస్తే ఇది తక్కువే. 2023 జులై-సెప్టెంబరుతో పోల్చినా 6% తగ్గింది. వచ్చే మూడు నెలల్లో నియామకాలు జరిపినా, కంపెనీలు అప్రమత్తంగా ఉండటాన్ని ఇది సూచిస్తోంది. నియామక అంచనాల్లో అంతర్జాతీయ సగటు కంటే మన సగటు 8 పాయింట్లు అధికంగా ఉంది. ఈ సర్వేను 42 దేశాల్లో నిర్వహించారు. భారత్లో 3,150 సంస్థలు, మూడో త్రైమాసికంలో నియామకాల అంచనాల గురించి ఇందులో తెలిపాయి.
- జులై- సెప్టెంబరులో కోస్టారికాలో (35%) నియామకాలు బలంగా ఉండొచ్చు. ఆ తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్ (34%), గ్వాటెమాలా (32%), మెక్సికో (32%), దక్షిణాఫ్రికా (31%) ఉన్నాయి. అర్జెంటీనా, రొమేనియాల్లో ఎన్ఈఓ అత్యల్పంగా 3 శాతంగా ఉంది.
- ఆసియా పసిఫిక్ ప్రాôతంలో చూస్తే.. భారత్ (30%), చైనా (28%) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. నియామకాలపై అత్యంత అప్రమత్తంగా ఉన్న దేశాల్లో హాంకాంగ్ (8%), జపాన్ (12%) ఉన్నాయి.
- ‘భారత ఐటీ రంగంపై అంతర్జాతీయ మందగమనం ప్రభావం చూపుతోంది. సార్వత్రిక ఎన్నికల వల్ల కొంత రాజకీయ అనిశ్చితి తలెత్తింది. దీంతో స్వల్పకాలంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరించడానికి మొగ్గుచూపుతున్నాయి’ అని మ్యాన్పవర్ ఇండియా, పశ్చిమాసియా ఎండీ సందీప్ గులాటీ పేర్కొన్నారు. భారత్లో నైపుణ్యాల గిరాకీ, సరఫరా మధ్య అంతరాలను కంపెనీలు దీర్ఘకాల నైపుణ్య ప్రణాళికలతో తగ్గిస్తాయని వివరించారు.
- భారత్లో నియామకాల ధోరణులు చూస్తే.. ఉత్తర భారత్లో 36%, పశ్చిమ (31%), దక్షిణ (30%), తూర్పులో (21%)గా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే అన్ని రంగాల్లో నియామకాల సెంటిమెంట్ తగ్గడం గమనార్హం.
- రంగాల వారీగా చూస్తే.. ఆర్థిక, స్థిరాస్తి, ఆరోగ్య సంరక్షణ, లైఫ్సైన్సెస్ రంగాలు నియామకాల్లో మెరుగ్గా ఉన్నాయి. కమ్యూనికేషన్ సేవలు, రవాణా, లాజిస్టిక్స్, ఆటోమోటివ్ బలహీనంగా కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి