స్థిరమైన ఆదాయంతో
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ ఇన్కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ పాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్ఓఎఫ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఇది పాసివ్ రుణ మ్యూచువల్ ఫండ్ స్కీములు, ఆర్బిట్రేజ్ ఫండ్ల యూనిట్లలో పెట్టుబడి పెట్టే ఓపెన్ ఎండెడ్ ఎఫ్ఓఎఫ్ పథకం. ఈ పథకం పనితీరుకు నిఫ్టీ షార్ట్ డ్యూరేషన్ డెట్ ఇండెక్స్ (65 శాతం), నిఫ్టీ 50 ఆర్బిట్రేజ్ టీఆర్ఐ (35 శాతం) కొలమానంగా ఉంటాయి. ఎన్ఎఫ్ఓ చివరి తేదీ నవంబరు 11. ఈ పథకం స్థిరమైన ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా. అంతేకాకుండా వడ్డీ రేట్లలో వచ్చే మార్పులతో ఎదురయ్యే రిస్కును తగ్గించుకోవచ్చు. పెట్టుబడుల్లో 35-50 శాతాన్ని ఆర్బిట్రేజ్ ఫండ్ల యూనిట్లకు కేటాయిస్తారు.
అందువల్ల మార్కెట్లో ఎదురయ్యే హెచ్చుతగ్గుల నుంచి ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. రుణ పథకాల స్థాయిలో ప్రతిఫలం, 24 నెలల పెట్టుబడి కాలం తర్వాత యూనిట్లు విక్రయిస్తే వచ్చే లాభాలపై ఈక్విటీ పెట్టుబడుల తరహాలో 12.5 శాతం పన్ను చెల్లింపు సదుపాయం ఉండటం అదనపు ఆకర్షణలు. ఫండ్ మేనేజర్లు.. ఆదిత్య పగారియా, హార్ధిక్సత్రా, కార్తీక్ కుమార్.
బంగారంపై సులువుగా
ఛాయిస్ మ్యూచువల్ ఫండ్ డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తూ ఒక ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను తీసుకొచ్చింది. ఛాయిస్ గోల్డ్ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 31. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.1,000. పసిడి ధర ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన విషయం విదితమే. కొద్ది రోజులుగా ధర దిగివస్తోంది. అయినప్పటికీ దీర్ఘకాలంలో బంగారం ధర పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టే లక్ష్యం ఉన్న మదుపరులకు ఇలాంటి పథకాలు అనువుగా ఉంటాయి.

మధ్యస్థాయి కంపెనీల్లో
మధ్యస్థాయి (మిడ్క్యాప్) కంపెనీల్లో పెట్టుబడి పెట్టి, లాభాలు ఆర్జించే లక్ష్యంతో రెండు పథకాలను గ్రో మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. గ్రో నిఫ్టీ మిడ్క్యాప్ 150 ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ మిడ్క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ అనే ఈ పథకాలను పాసివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందులో ఒకటి ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్)కాగా, మరోటి ఇండెక్స్ ఫండ్. ఈ రెండు పథకాల ఎన్ఎఫ్ఓ ముగింపు వచ్చే నెల 11. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.500. ఈ పథకాల పనితీరుకు నిఫ్టీ మిడ్క్యాప్ 150 ఇండెక్స్ టీఆర్ఐ కొలమానంగా ఉంటుంది. ప్రధానంగా నిఫ్టీ మిడ్క్యాప్ 150 ఇండెక్స్లో భాగంగా ఉన్న షేర్లతో ఈ పథకాల పోర్ట్ఫోలియోను సిద్ధం చేస్తారు. ఫండ్ మేనేజర్లు.. శశికుమార్, నిఖిల్ సాతమ్, ఆకాష్ చౌహాన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

తాత ఆస్తిపై మనుమరాలికి హక్కు ఉంటుందా..
హిందూ వారసత్వ చట్టం ప్రకారం ‘కోపార్సెనర్’గా కుమార్తెల హక్కుల గురించి చట్టాలు ఏం స్పష్టం చేస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. - 
                                    
                                        

ఆరోగ్య బీమా అన్ని దశల్లో ఆదుకునేలా
ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు ఎన్నో సందేహాలు.. ఎంత విలువైన పాలసీ తీసుకోవాలి? ఏ సంస్థ నుంచి ఎంచుకోవాలి? కుటుంబానికి అంతటికీనా?వ్యక్తిగత పాలసీనా? ఇలాంటి ప్రశ్నలు మనల్ని గందరగోళానికి గురిచేస్తాయి. వయసు, బాధ్యతలు, జీవన శైలి మారే కొద్దీ మన బీమా అవసరాలూ భిన్నంగా ఉంటాయి. - 
                                    
                                        

ఇలా ఆలోచిస్తే ధనవంతులు కాలేరు!
‘జీతం రాగానే ఖర్చులు.. అప్పులు పోను ఏమీ మిగలట్లేదు’.. చాలామంది ఆలోచన, సమస్య ఇదే. ‘ఎంత సంపాదించినా ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరలేకపోతున్నాం’ అనీ బాధపడుతుంటారు. అసలు సమస్య మీ ఆదాయం కాదు..డబ్బు పట్ల మీరు పెంచుకున్న కొన్ని అపోహలు, నమ్మకాలే ఇందుకు కారణం - 
                                    
                                        

టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి. - 
                                    
                                        

పదవీ విరమణ ప్రణాళికలో పరిగణించాల్సిన ముఖ్యాంశాలివే..
మీరు పదవీ విరమణ కోసం ఎంత త్వరగా ప్రణాళిక వేసుకుంటే, అంత సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలను ఇక్కడ తెలుసుకుందాం. - 
                                    
                                        

వివిధ గోల్డ్ ఈటీఎఫ్ల రాబడులివే..
భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడం, నిల్వ చేయడం కంటే ETFలో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వివిధ గోల్డ్ ఈటీఎఫ్లలో రాబడుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. - 
                                    
                                        

నమోదిత సంస్థలతోనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు భద్రం
‘అన్ క్లెయిమ్డ్’ డివిడెండ్లు, షేర్లు వెనక్కి తెచ్చుకోవచ్చు... డీమ్యాట్ ఖాతాను కొంతకాలం ఫ్రీజ్ చేసుకోవచ్చు... ‘ఈనాడు’, సీడీఎస్ఎల్ వెబినార్లో నిపుణులు - 
                                    
                                        

మ్యూచువల్ ఫండ్ SIPపై రాబడిని పెంచే చిట్కాలివే..
కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిపై రాబడిని పెంచుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం. - 
                                    
                                        

కారు బీమా వేరే సంస్థకు మారిస్తే
కారు బీమా పునరుద్ధరణ గడువు సమీపిస్తున్న కొద్దీ ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. - 
                                    
                                        

ఐటీఆర్ సవరించుకోవచ్చు
గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన ఆదాయానికిగాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేశారు కదా! - 
                                    
                                        

ఆరోగ్య బీమా.. పరిమితి పూర్తయినా
వైద్య చికిత్స ఖర్చు రోజురోజుకూ పెరిగిపోతోంది. దీన్ని తట్టుకోవడానికి ఆరోగ్య బీమా పాలసీలు ఎంతో కీలకంగా మారుతున్నాయి. - 
                                    
                                        

సూచీ షేర్ల తరహాలో
‘పాసివ్ ఇన్వెస్ట్మెంట్’ పద్ధతిలో నిర్వహించే ఒక ఈక్విటీ ఇండెక్స్ పథకాన్ని జెరోధా పధకాన్ని జెరోదా మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. - 
                                    
                                        

బహుళ ఎఫ్డీలను కలిగి ఉంటే లాభమా.. నష్టమా?
బహుళ ఎఫ్డీ ఖాతాలను ఓపెన్ చేయడం వల్ల నష్టాలతో పోలిస్తే, లాభాలే ఎక్కువ. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. - 
                                    
                                        

రిస్క్ ఉన్నా మంచి రాబడి అందించగలిగే పెట్టుబడులివే..
భారత్లో కొన్ని పెట్టుబడులపై రిస్క్తో పాటు, ప్రతిఫలం కూడా ఎక్కువే ఉంటుంది. అలాంటి కొన్ని ముఖ్యమైన పెట్టుబడుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. - 
                                    
                                        

మీ ఇంట సిరులు పండాలి
దీపావళి.. దీపాల పండగ. కేవలం సంబరాలే కాదు, ఇది ఆర్థిక భవిష్యత్తును ప్రకాశవంతం చేసే ఒక పర్వదినం. మన ఆర్థిక లక్ష్యాలను సమీక్షించి, దీర్ఘకాలిక సంపదను సృష్టించుకునేందుకు అడుగులు వేయొచ్చు. దీపావళి సమయంలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ ఇంట సిరులు పండేలా చేయడమే కాకుండా, ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తాయి - 
                                    
                                        

ఈపీఎఫ్ వెనక్కి తీసుకుంటున్నారా?
చందాదారుడి భవిష్యనిధి ఖాతాలో కనీస నిల్వ 25 శాతం పోను మిగతా నిల్వను వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తూ ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. - 
                                    
                                        

సురక్షితంగా ఉంటే సరిపోతుందా?
పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉండాలి.. మంచి రాబడి రావాలి.. చాలామంది కోరిక ఇదే. కానీ, ఈ రెండూ ఒకే చోట సాధ్యం కాదన్న సంగతి తెలిసిందే. చాలామంది తాము డబ్బును జాగ్రత్తగా దాచుకున్నాం అని చెబుతుంటారు. కానీ, ఇలా చేసినంత మాత్రాన ఆ నిధి మనకు ఆర్థిక భద్రత ఇవ్వదు. - 
                                    
                                        

చిన్న సంస్థల షేర్లలో
గ్రో మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ తరగతికి చెందిన ఒక కొత్త ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) పథకాన్ని ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 24. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.500. దీర్ఘకాలంలో లాభాలు ఆర్జించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. - 
                                    
                                        

ఇంటి విలువను పెంచే చిట్కాలివే..
పాత ఇంటిని విక్రయించడం కొన్నిసార్లు కష్టమైన ప్రక్రియ అయినప్పటికీ..సరైన నిర్వహణ, మార్కెటింగ్ పద్ధతులు ఉపయోగించడం ద్వారా ఆ పనిని సులభతరం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం. - 
                                    
                                        

దీపావళి ముందు వారికి ‘గోల్డెన్’ ఛాన్స్.. బాండ్లపై 338% లాభం
Sovereign Gold Bonds: పెరిగిన బంగారం ధరలు చూసి ఓవైపు సామాన్యులు ముక్కున వేలేసుకుంటుండగా.. 8 ఏళ్ల క్రితం పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టినవారు మాత్రం గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్ల ఘటనను సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
 - 
                        
                            

రైతులను కలిసే అర్హత జగన్కు లేదు: మంత్రి నిమ్మల
 - 
                        
                            

టికెట్లకు డబ్బుల్లేవు.. మహిళా క్రికెట్ జట్టుకు మొత్తం పారితోషికం ఇచ్చేసిన మందిరా బేడీ
 - 
                        
                            

కలలు కనడం ఎప్పుడూ ఆపొద్దు: హర్మన్ ప్రీత్ కౌర్
 - 
                        
                            

పెట్టుబడుల విషయంలో పూర్తిగా సహకరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
 - 
                        
                            

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
 


