cancer drugs: అందరి చూపు క్యాన్సర్ మందులపైనే
మన దేశంలో క్యాన్సర్తో మరణిస్తున్న వారి సంఖ్య ఏడాదికి 9 లక్షలకు చేరింది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది.
భాగస్వామ్యాలతో ముందుకెళ్తున్న దేశీయ సంస్థలు
బయోసిమిలర్, జనరిక్ మందుల ఆవిష్కరణకు కృషి
ఏడాదికి మరణాలు 9 లక్షలకు చేరిన నేపథ్యం
ఈనాడు - హైదరాబాద్
మన దేశంలో క్యాన్సర్తో మరణిస్తున్న వారి సంఖ్య ఏడాదికి 9 లక్షలకు చేరింది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. గతంలో ఇంత అధికంగా కేసులు నమోదు కాలేదు. బాధితులు వైద్యులను సంప్రదించడం, మందుల వినియోగమూ అంతగా ఉండేది కాదు. కానీ ఇటీవల కాలంలో క్యాన్సర్ అని నిర్ధారించిన వెంటనే ఆస్పత్రుల్లో చేరి చికిత్స చేయించుకోవడం, మందులు వాడటం పెరుగుతోంది. ఈ పరిణామాలతో క్యాన్సర్ ఔషధాల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది.
ధరలు దిగిరావొచ్చు..
క్యాన్సర్ మందులు అందించే ఫార్మా కంపెనీలు అధిక ఆదాయాలు నమోదు చేసే అవకాశాలు పెరిగాయి. అందువల్ల గత కొంతకాలంగా దేశీయ ఫార్మా కంపెనీలు క్యాన్సర్ మందులపై దృష్టి సారిస్తున్నాయి. దీని కోసం పలు కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నాయి. ఇందులో పరిశోధన- అభివృద్ధి(ఆర్ అండ్ డీ) భాగస్వామ్యాలతో పాటు మార్కెటింగ్ ఒప్పందాలు ఉంటున్నాయి. తద్వారా దేశీయ ఫార్మా కంపెనీలకు క్యాన్సర్ మందుల అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీ విభాగాల్లో అనుభవం గడించే అవకాశం కలుగుతోంది. పలు కొత్త మందులను మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ విస్తృతంగా అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నాయి. దీనివల్ల సమీప భవిష్యత్తులో క్యాన్సర్ మందుల లభ్యత మరింత అధికమై, మందుల ఖర్చు దిగివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏ కంపెనీ.. ఏ భాగస్వామితో..
క్యాన్సర్ మందులైన టిస్లిజుమ్యాబ్, జానుబ్రుటినిబ్లను మనదేశంలో పంపిణీ చేసే నిమిత్తం గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్, చైనాకు చెందిన బిజీన్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా బాధితులకు ఈ మందులు అందుబాటులోకి వస్తాయని గ్లెన్మార్క్ ఫార్మాసూటికల్స్ అధ్యక్షుడు అలోక్ మాలిక్ పేర్కొన్నారు. ఈ మందులకు మన దేశంలో అనుమతులు తీసుకోవడం, అందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించడం, పంపిణీ.. తదితర అంశాలను గ్లెన్మార్క్ ఫార్మా చేపడుతుంది. మల్టిపుల్ మైలోమా(బోన్ మెటాస్టాసెస్) అనే క్యాన్సర్ వ్యాధికి చికిత్సలో వినియోగించే డెనోసుమ్యాబ్ అనే బయోసిమిలర్ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావటానికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అమెరికాకు చెందిన అల్వోటెక్ అనే బయోటెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మందును ప్రొలియా, గ్జెవా అనే బ్రాండ్ పేర్లతో ఆమ్జెన్ ఇంక్. ఔషధ సంస్థ విక్రయిస్తోంది. ఈ బయోసిమిలర్ ఔషధాన్ని అల్వోటెక్ ఇంక్ అభివృద్ధి చేయడంతో పాటు ఉత్పత్తి చేస్తుంది. తదుపరి అమెరికా, యూకే, కొన్ని ఐరోపా దేశాల్లో ఈ మందును విక్రయించే అవకాశం డాక్టర్ రెడ్డీస్కు లభిస్తోంది. ఇటీవల డాక్టర్ రెడ్డీస్ బెవాసిజుమ్యాబ్ అనే బయోసిమిలర్ క్యాన్సర్ ఔషధాన్ని యూకేలో విడుదల చేసింది.
ఇతర ఒప్పందాలు..
- కాబోజెంటినిబ్ అనే క్యాన్సర్ మందును అమెరికాలో పంపిణీ చేయడం కోసం హైదరాబాద్కు చెందిన ఎంఎస్ఎన్ ల్యాబ్స్, ఇటీవల జైడస్ లైఫ్సైన్సెస్తో ఒప్పందం కుదుర్చుకుంది.
- కొంతకాలం క్రితం గ్లెన్మార్క్ ఫార్మా, ఎన్వాఫోలిమ్యాబ్ అనే క్యాన్సర్ మందు అభివృద్ధి, మార్కెటింగ్, పంపిణీ నిమిత్తం సూటికల్స్ జియాంగ్సు ఆల్ఫామ్యాబ్ బయోఫార్మాసూటికల్స్, 3డి మెడిసిన్స్ అనే కంపెనీలతో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది.
- సీఎంఎల్ అనే క్యాన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే నిలోటినిబ్ అనే మందును ఉత్పత్తి చేసి అందించటానికి యూగియా ఫార్మా, హెటెరో, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఏడాదిలో మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపీపీ) అనే అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
- నాట్కో ఫార్మా, అరబిందో ఫార్మా, సెలాన్ ల్యాబ్స్, విర్కో బయోటెక్.. తదితర సంస్థలు కొంత కాలంగా క్యాన్సర్ ఔషధాల విభాగంలో వేగంగా విస్తరిస్తున్నాయి. నాట్కో ఫార్మా దేశీయ మార్కెట్లోనే కాకుండా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాలకు క్యాన్సర్ మందులు అందిస్తోంది. అరబిందో ఫార్మా క్యాన్సర్ విభాగానికి చెందిన బయోసిమిలర్ ఔషధాలను అమెరికా, ఐరోపా దేశాల్లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది.
అమ్మకాల్లో 15% వృద్ధి
మనదేశంలో 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.16,500 కోట్లు) క్యాన్సర్ మందుల అమ్మకాలు నమోదవుతున్నాయి. కొన్నేళ్ల పాటు వీటి అమ్మకాల్లో ఏటా 15% వృద్ధి ఉంటుందని అంచనా. దీని ప్రకారం 2028 నాటికి దేశీయ క్యాన్సర్ ఔషధాల మార్కెట్ 3.5 బిలియన్ డాలర్ల (రూ.29,000 కోట్లకు పైగా)కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. విదేశాలకు ఈ మందులను ఎగుమతి చేసే అవకాశమూ దేశీయ ఫార్మా కంపెనీలకు ఉంది. అందుకే ఈ మార్కెట్పై ఫార్మా కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొన్ని నెలల్లో ఐపీఓల సందడి.. రూ.50 వేల కోట్ల సమీకరణ!
IPOs: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అనేక కంపెనీలు ఐపీఓకి సిద్ధమవుతున్నాయి. దాదాపు రూ.50 వేల కోట్ల సమీకరణ జరగొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
హెచ్పీసీఎల్ సీఎండీ పదవికీ సరైన అభ్యర్థి దొరకలేదు
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పదవికి సరైన అభ్యర్థి దొరకలేదని తెలుస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పీఈఎస్బీ ఈ నెల 14న హెచ్పీసీఎల్ సీఎండీ కోసం 8 మందిని ఇంటర్య్వూ చేసింది. -
ఎస్బీఐ అనుబంధ సంస్థల నగదీకరణ!
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ పేమెంట్ సర్వీసెస్ వంటి అనుబంధ సంస్థల నగదీకరణ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖారా వెల్లడించారు. అయితే వీటిని నగదీకరించే ముందు వాటి కార్యకలాపాలు, వ్యాపారాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. -
కార్డు లావాదేవీలు తగ్గించేశారు
డెబిట్/క్రెడిట్ కార్డులను స్వైప్ చేయడం ద్వారా చెల్లింపునకు వీలున్న పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాలను కొత్తగా అమర్చుకునే వారి సంఖ్య బాగా నెమ్మదించింది. అన్ని రకాల చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తున్న వ్యవస్థీకృత, పెద్ద ఫార్మాట్ రిటైల్ సంస్థలే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. -
సూక్ష్మ రుణాలు 27% పెరిగాయ్
వివిధ ఆర్థిక సంస్థలు ఈ ఏడాది జనవరి-మార్చిలో మంజూరు చేసిన సూక్ష్మ రుణాల మొత్తం, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 27% అధికమైనట్లు క్రెడిట్ సమాచార కంపెనీ క్రిఫ్ హై మార్క్ వెల్లడించింది. ఇదే సమయంలో రుణ ఎగవేతలూ స్వల్పంగా పెరిగాయని తెలిపింది. -
కొత్త హోదాల జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియామక కార్యకలాపాల్లో కొత్త హోదాలపైనే ఎక్కువ దృష్టి కనిపించనుంది. వేర్వేరు రంగాల్లోని కంపెనీలు 27% మేర తాజా ఉద్యోగాలను ఇవ్వవచ్చని ఒక నివేదిక అంటోంది. -
ఎస్ఈజెడ్ల ఎగుమతులు రూ.13.5 లక్షల కోట్లు
ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్ఈజెడ్ల) నుంచి గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 163.39 బిలియన్ డాలర్ల (సుమారు రూ.13.5 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు నమోదయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. -
పసిడి దిద్దుబాటు!
పసిడి ఆగస్టు కాంట్రాక్టుకు ఈవారం రూ.71,080 దిగువన లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది. ఈ స్థాయికి దిగువన చలిస్తే రూ.70,205; రూ.69,659 వరకు దిద్దుబాటు కావచ్చు. -
తక్కువ స్లాబ్ ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలి: సీఐఐ
తక్కువ స్లాబ్లో ఉన్న వ్యక్తులకు ఆదాయపు పన్ను మినహాయింపును ఇవ్వాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)కు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ సంజీవ్ పురి కోరారు. అధిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని త్వరలో ప్రవేశపెట్టబోయే పూర్తి ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్లో వారికి ఉపశమనం కల్పించాలని సూచించారు. -
బ్యాటరీ సెల్స్ ఉత్పత్తికి అంతర్జాతీయ సంస్థలతో జట్టు
విద్యుత్ వాహనాలకు భవిష్యత్తులో గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, స్థానికంగా బ్యాటరీ సెల్స్ ఉత్పత్తి చేసేందుకు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తున్నామని మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈఓ అనిశ్ షా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
జనవరి- మార్చి త్రైమాసికానికి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఏకీకృత ప్రాతిపదికన రూ.431 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. 2022-23లో ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.458 కోట్లతో పోలిస్తే లాభం 6 శాతం తగ్గింది. పసిడి రుణ వ్యాపారాన్ని నిర్వహించకుండా కంపెనీపై ఆర్బీఐ ఆంక్షలు విధించడం ఇందుకు కారణమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈవీఎంలపై మస్క్ అనుమానాలు.. శామ్ పిట్రోడా కీలక వ్యాఖ్యలు
-
11 మంది ఆటను నేను ఆడలేను కదా.. టీమ్గా విఫలమయ్యాం: బాబర్ అజామ్
-
కొన్ని నెలల్లో ఐపీఓల సందడి.. రూ.50 వేల కోట్ల సమీకరణ!
-
నెల్లూరు జిల్లాలో కారుపై పెద్దపులి దాడి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐడీ ముందు హాజరైన యడియూరప్ప