Google layoffs: గూగుల్లో మరిన్ని తొలగింపులు..?
Google layoffs: గూగుల్లో ఈ ఏడాది మరిన్ని తొలగింపులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే అడ్వర్టైజ్మెంట్, యూట్యూబ్ వీడియో ప్లాట్ఫామ్లో పనిచేసే ఉద్యోగులను గూగుల్ సాగనంపింది.
Google layoffs | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google layoffs) మరిన్ని ఉద్యోగాల తొలగింపులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2024 తొలి వారంలో వివిధ విభాగాల్లో ఉద్యోగులను తొలగించిన గూగుల్.. ఈ ఏడాదిలో మరికొంతమంది ఉద్యోగులను కూడా సాగనంపాలని చూస్తోంది. ఇదే విషయాన్ని ఉద్యోగులకు అంతర్గత మెమో ద్వారా సీఈఓ సుందర్ పిచాయ్ తెలియజేసినట్లు ‘ది వెర్జ్’ వెబ్సైట్ పేర్కొంది.
ఈ ఏడాది ప్రాధాన్యమైన అంశాల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని, ఇందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పిచాయ్ పేర్కొన్నట్లు తెలిసింది. కొన్ని విభాగాల్లో నిర్వహణ ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసేందుకు కొన్ని లేయర్లను తొలగించాల్సిన అవసరం ఉందని, గతేడాది మాదిరిగా భారీ స్థాయిలో తొలగింపులు మాత్రం ఉండబోవని అన్నట్లు సమాచారం. అన్ని విభాగాలనూ టచ్ చేయబోమని చెప్పినట్లు తెలిసింది.
EPFO కీలక నిర్ణయం.. ఆ జాబితా నుంచి ఆధార్ తొలగింపు
గతేడాది గూగుల్ 12వేల మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. గూగుల్ చరిత్రలో ఈ స్థాయిలో తొలగింపులు చేపట్టడం అదే తొలిసారి. ఈ ఏడాది సైతం కొన్ని తొలగింపులు చేపట్టింది. యూట్యూబ్ వీడియో ప్లాట్ఫామ్లో వందమంది ఉద్యోగులను తొలగించింది. యూట్యూబ్ ఆపరేషన్స్, క్రియేటర్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఈ తొలగింపులు చేపట్టింది. అడ్వర్టైజ్మెంట్ సేల్స్ టీమ్లో వెయ్యి మందికి గూగుల్ పింక్ స్లిప్పులు ఇచ్చింది. వారికి పరిహార ప్యాకేజీని అందిస్తామని, ఇతర విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..