Google: గుర్తింపు కోసం గూగుల్ ఉద్యోగిని చెప్పిన ఐదు సూత్రాలివే..!
Google: ఒక వ్యక్తి పనిచేసే సంస్థను బట్టే అతడిని చాలా మంది గుర్తిస్తారు. సంస్థను బట్టి కాకుండా వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవడానికి కొన్ని సూత్రాలు సూచిస్తున్నారు గూగుల్కు చెందిన ఓ మహిళా ఉద్యోగి. ఆ సూత్రాలివే..
ఇంటర్నెట్డెస్క్: ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక్కసారైనా పనిచేయాని కోరుకొనే దిగ్గజ సంస్థ గూగుల్. ఈ కంపెనీ అందించే జీతభత్యాలు, వసతులు, ప్రయోజనాలే అందుకు కారణం. అంతేకాదు గూగుల్లో పనిచేయడం గొప్ప స్టేటస్గా భావించేవాళ్లూ అనేకమంది ఉంటారు. చాలా మంది ఇలాంటి పేరుమోసిన కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేందుకే ఇష్టపడతారు. అయితే, పనిచేస్తున్న సంస్థ ద్వారా కాకుండా.. వ్యక్తిగా గుర్తింపు పొందాలంటే మాత్రం ఐదు సూత్రాలు పాటించాలంటున్నారు గూగుల్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి. కెనడాకు చెందిన ఆమె కెరియర్కు కొన్ని సూత్రాలను షేర్ చేసుకున్నారు. అవేంటంటే..
- వ్యక్తిగా గుర్తింపు పొందాలంటే.. చర్చించే నైపుణ్యం అవసరం. ఒకవేళ మీలో ఆ నైపుణ్యం లేకపోతే నేర్చుకొనేందుకు ప్రయత్నించండి. ఏదైనా చిన్న వస్తువు విషయంలో బేరమాడటం మొదలు కొని.. సర్వీస్ ప్రొవైడర్తో ఒప్పందంలోని అంశాలపై చర్చించడం వంటివి అలవాటు చేసుకోండి. మీకు కొంత విశ్వాసం వచ్చాక జీతం పెంపు వంటి పెద్ద విషయాల్లో ఇదే నైపుణ్యం ఉపయోగపడుతుంది.
- కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు లేదా డబ్బున్న వాళ్లకు మాత్రమే కోచింగ్ అవసరమని చాలా మంది భావిస్తుంటారు. కానీ, ఎవరైతే తమ కెరీర్ను మెరుగుపరచుకోవాలనుకుంటారో వాళ్లకు కోచింగ్ అనేది ఓ విలువైన పెట్టుబడి. లక్ష్యాన్ని గుర్తించడంలో, వాటిని సాధించేందుకు ప్రణాళికల్ని రూపొందించటంలో మీకు ఎదురయ్యే సవాళ్లు అధిగమించడంలో ఒక మంచి కోచ్ మీకు సాయపడతాడు.
- మూడో అంశం మీ పట్ల మీరు దయ కలిగి ఉండడం. తప్పులు జరిగినా, పర్ఫెక్ట్గా లేకపోయినా ఫర్వాలేదు. గమ్యాన్ని చేరుకొనే క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీ పట్ల మీరు దయ స్వభావంతో ఉండాలి. అలాగే సాధించింది చిన్న విజయమే అయినా దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. లక్ష్యాన్ని సాధించినందుకు మీరు చేసిన కృషికి అభినందించడానికి సమయం వెచ్చించండి.
- వేరే వ్యక్తులతో పోల్చుకోవడం మానేయండి. ఎవరి ప్రయాణం వారిది. అందరికీ ఒకే మార్గం నప్పదు.
- వృత్తి జీవితం కాకుండా ఇతర అంశాలపై అభిరుచి, నైపుణ్యం కలిగి ఉండడం ముఖ్యం. ఇది కెరీర్ సక్సెస్ కావడానికి, జీవితాన్ని సమతుల్యం చేయడానికి సాయపడుతుంది. అంతేకాదు మిమ్మల్ని అన్ని రకాల నైపుణ్యాలు కలిగిన వ్యక్తిగా నిలుపుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ