Google: డీఫాల్ట్ సెర్చింజన్ కోసం గూగుల్ 26 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది: గూగుల్ ఉద్యోగి
యూఎస్-గూగుల్ మధ్య యాంటీట్రస్ట్ కేసు కోర్టులో కొనసాగుతోంది. విచారణలో భాగంగా శుక్రవారం కీలక విషయాలు వెల్లడయ్యాయి. గూగుల్ను డీఫాల్ట్ సెర్చింజన్గా ఉంచేందుకు పలు కంపెనీలకు ఆ సంస్థ 26.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
వాషింగ్టన్: సెర్చింజన్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా గూగుల్ తీరుపై మండిపడ్డారు. ఇదే విషయంపై యూఎస్ ప్రభుత్వం, గూగుల్ మధ్య యాంటీట్రస్ట్ కేసు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మొబైల్స్, వెబ్బ్రౌజర్లలో గూగుల్ను డీఫాల్ట్ సెర్చింజన్గా ఉంచేందుకు 2021లో ఆ సంస్థ పలు కంపెనీలకు 26.30 బిలియన్ డాలర్లు చెల్లించిందట. గూగుల్ సెర్చ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ విభాగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తోన్న ప్రభాకర్ రాఘవన్ ఈ వివరాలు వెల్లడించారు.
డీఫాల్ట్ సెర్చింజన్ స్టేటస్ కోసం గూగుల్ చెల్లింపులు 2014 నుంచి ముడింతలు పెరిగాయని ప్రభాకర్ పేర్కొన్నారు. సెర్చ్ యాడ్స్ ద్వారా గూగుల్కి 2021లో 146.4బిలియన్ డాలర్లు రెవెన్యూ వచ్చిందని.. అందులో ఎక్కువ మొత్తం డీఫాల్ట్ సెట్టింగ్ కోసమే ఖర్చవుతోందని చెప్పారు. అయితే, ఈ ఖర్చు అంతా న్యాయంగానే ఖర్చు చేస్తున్నామని గూగుల్ చెబుతోంది. ఈ పెట్టుబడులంతా సెర్చ్ అండ్ అడ్వర్టైజింగ్ బిజినెస్లో పోటీతత్వం కోసమేనని సమర్థించుకుంది. ఒకవేళ డీఫాల్ట్ సెర్చింజన్ యూజర్లకు నచ్చకపోతే మార్చుకునే సదుపాయం ఉందని గుర్తు చేసింది. ఇలా చెల్లింపులకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేయడం వల్ల భవిష్యత్తులో తము కుదుర్చుకునే కాంట్రాక్టులపై ప్రభావం చూపుతుందని గూగుల్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. కోర్టు మాత్రం వివరాలు వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
Rs 2000 notes: 2024 ఏప్రిల్ 30 నాటికి 7.76 శాతం రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు చేరినట్లు ఆర్బీఐ తెలిపింది. -
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
Aadhar Housing Finance IPO: రూ.3,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ రానుంది. ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. -
ఏప్రిల్లో మహీంద్రా వాహన అమ్మకాలు 70,471 యూనిట్లు
2024 ఏప్రిల్లో మహీంద్రా వాహన అమ్మకాలు 13 శాతం పెరిగి 70,471 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. -
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
Amazon- Flipkart: అమెజాన్, ఫ్లిప్కాట్ ఏటా వేసవిలో నిర్వహించే సేల్స్ మొదలయ్యాయి. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లపై ఓ లుక్కేయండి. -
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
Boult Soundbars: బౌల్ట్ హోమ్ ఆడియో డివైజ్ల రంగంలోకి ప్రవేశించింది. తాజాగా సౌండ్బార్లను ప్రవేశపెట్టింది. -
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 128, నిఫ్టీ 37 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
Vivo V30e: మొబైల్ తయారీ కంపెనీ 3 ఏళ్లు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్తో కొత్త మొబైల్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
WhatsApp: ఇకపై వాట్సప్లో ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు. ఎవరెవరు వస్తారో కూడా తెలుసుకోవచ్చు. వారికి నోటిఫికేషన్ ద్వారా గుర్తు చేయొచ్చు. అందుకు అనుగుణంగా కమ్యూనిటీలో ఈవెంట్స్ అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది వాట్సప్. -
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
ATM Scam: ఎప్పటికప్పుడు దుండగులు కొత్త రకం స్కామ్లకు తెరతీస్తున్నారు. తాజాగా ఏటీఎం మెషీన్లోని కార్డు రీడర్ను తొలగించి మోసాలకు పాల్పడుతున్నారు. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 135 పాయింట్ల లాభంతో 74,618 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 22,652 దగ్గర కొనసాగుతోంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
వసూళ్లలో జైఎస్టీ (జీఎస్టీ)
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు తొలిసారిగా రూ.2 లక్షల కోట్ల మైలురాయిని తాకాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఇవి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నాటి రూ.1.87 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 12.4% అధికం. -
వాహన దూకుడుకు ఎన్నికల ఆంక్షల పగ్గం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి నెల (ఏప్రిల్)లో టోకుగా 3.38 లక్షల ప్రయాణికుల వాహన (పీవీ) విక్రయాలు నమోదయ్యాయి. -
ఇళ్లపై పెట్టుబడులు మూడింతలు
ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో గృహాల విభాగంలో పెట్టుబడులు మూడు రెట్లకు పైగా పెరిగి రూ.5,743 కోట్లకు చేరాయని స్థిరాస్తి కన్సల్టంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తాజా నివేదికలో వెల్లడించింది. -
జిందాల్ స్టెయిన్లెస్ రూ.5,400 కోట్ల పెట్టుబడులు
జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ (జేఎస్ఎల్) వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 4.2 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు రూ.5,400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ఎండీ అభ్యుదయ్ జిందాల్ బుధవారం వెల్లడించారు. -
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ 8 నుంచి 10 వరకు
ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. -
బేబీ పౌడర్తో క్యాన్సర్ ఆరోపణలు!
జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే)కు చెందిన అనుబంధ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడర్లోని టాల్కమ్ వల్ల అండాశయ క్యాన్సర్ రావొచ్చన్న ఆరోపణలను సెటిల్ చేసుకోవడానికి 25 ఏళ్లలో 6.48 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.54,000 కోట్లు) కట్టడానికి ఆ సంస్థ సిద్ధమైంది. -
లీజుదార్ల చేతికి గోఫస్ట్ 54 విమానాలు
విమానయాన సంస్థ గోఫస్ట్కు అద్దె (లీజ్) పద్ధతిలో ఇచ్చిన 54 విమానాలను వెనక్కి తీసుకునేందుకు లీజుదార్లకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వాటిని డీరిజిస్టర్ చేసింది. -
అదానీ పవర్ లాభంలో 48% క్షీణత
వ్యయాలు పెరగడంతో ఆర్థిక ఫలితాల్లో అదానీ పవర్ రాణించలేకపోయింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,737.24 కోట్లకు పరిమితమైంది. -
అదానీ విల్మర్ లాభంలో 67% వృద్ధి
ఫార్చ్యూన్ బ్రాండ్పై నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే ఎఫ్ఎమ్సీజీ సంస్థ అదానీ విల్మర్.. జనవరి- మార్చిలో రూ.156.75 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
మన్పసంద్పై సెబీ ఆంక్షలు
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల గణాంకాల్లో అవకతవకలు వెలుగు చూడటం, వాటిని తప్పుగా వెల్లడించినందుకు గాను మన్పసంద్ బేవరేజెస్, ఆ కంపెనీకి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మూడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా