LIC: ఎల్ఐసీ చరిత్రలో తొలిసారి.. ప్రైవేటు వ్యక్తి నేతృత్వం?
ఎల్ఐసీకి ప్రస్తుతం ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి నేతృత్వం వహిస్తున్నారు. ఆ స్థానంలో సీఈఓను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందట! పైగా ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తిని ఆ హోదాలో కూర్చోబెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
దిల్లీ: దిగ్గజ బీమా సంస్థ ఎల్ఐసీ (LIC)కి ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తిని సీఈఓగా నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సంస్థ ఆధునికీకరణలో భాగంగానే ఈ మార్పుపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్ లిస్టింగ్లో పేలవ ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో మదుపర్లలో విశ్వాసాన్ని నింపడానికీ ఈ చర్య దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సర్కార్ తలంపు కార్యరూపందాలిస్తే.. 66 ఏళ్ల చరిత్ర గల ఎల్ఐసీ (LIC)కి ప్రైవేటు వ్యక్తి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి అవుతుంది.
ఎల్ఐసీ (LIC) సీఈఓ పదవికి కావాల్సిన అర్హతలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వం వివిధ వర్గాలతో సమాలోచనలు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఫలితంగా ఎక్కువ మంది పదవి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎల్ఐసీకి ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి నేతృత్వం వహిస్తున్నారు. తాజా ఛైర్మన్ ఎం.ఆర్.కుమార్ పదవీకాలం వచ్చే మార్చిలో ముగియనుంది. ఆ తర్వాత పూర్తిగా ఛైర్మన్ పదవినే రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సదరు అధికారులు తెలిపారు. ఆ స్థానంలో సీఈఓ పోస్టును సృష్టించి దాంట్లో ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తిని కూర్చొబెట్టాలన్నది ప్రణాళిక. దీనికి సంబంధించి ఎల్ఐసీ (LIC) చట్టంలో గత ఏడాదే మార్పులు చేసినట్లు నిపుణులు తెలిపారు.
అయితే ఏ రంగం నుంచి సీఈఓని ఎంపిక చేస్తారనే విషయం మాత్రం ఇంకా తెలియదు. ఎల్ఐసీ (LIC)కి నేతృత్వం వహించే వ్యక్తుల ఎంపికకు కావాల్సిన అర్హతలను మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఉందని.. దీనికి తాను పదవిలో ఉండగానే అంగీకారం తెలిపినట్లు కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. దీనివల్ల సంస్థకు ఎలాంటి హాని ఉండదన్నారు. ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తిని నియమించాలని ప్రస్తుతానికి సూత్రప్రాయంగానే ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి చట్టంలో ఇంకా ఏమైనా మార్పులు చేయాల్సి వస్తుందేమోనని సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే వేతనం విషయంలోనూ ప్రైవేటుకు దీటుగా ఇవ్వగలమా.. లేదా.. అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రభుత్వ రంగంతో పోలిస్తే ప్రైవేటు రంగంలో ఉన్నతస్థాయి ఉద్యోగులకు అధిక వేతనాలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. సోషల్మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రీమియం, ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి