LIC: ఎల్ఐసీ చరిత్రలో తొలిసారి.. ప్రైవేటు వ్యక్తి నేతృత్వం?
ఎల్ఐసీకి ప్రస్తుతం ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి నేతృత్వం వహిస్తున్నారు. ఆ స్థానంలో సీఈఓను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందట! పైగా ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తిని ఆ హోదాలో కూర్చోబెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
దిల్లీ: దిగ్గజ బీమా సంస్థ ఎల్ఐసీ (LIC)కి ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తిని సీఈఓగా నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సంస్థ ఆధునికీకరణలో భాగంగానే ఈ మార్పుపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్ లిస్టింగ్లో పేలవ ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో మదుపర్లలో విశ్వాసాన్ని నింపడానికీ ఈ చర్య దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సర్కార్ తలంపు కార్యరూపందాలిస్తే.. 66 ఏళ్ల చరిత్ర గల ఎల్ఐసీ (LIC)కి ప్రైవేటు వ్యక్తి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి అవుతుంది.
ఎల్ఐసీ (LIC) సీఈఓ పదవికి కావాల్సిన అర్హతలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వం వివిధ వర్గాలతో సమాలోచనలు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఫలితంగా ఎక్కువ మంది పదవి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎల్ఐసీకి ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి నేతృత్వం వహిస్తున్నారు. తాజా ఛైర్మన్ ఎం.ఆర్.కుమార్ పదవీకాలం వచ్చే మార్చిలో ముగియనుంది. ఆ తర్వాత పూర్తిగా ఛైర్మన్ పదవినే రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సదరు అధికారులు తెలిపారు. ఆ స్థానంలో సీఈఓ పోస్టును సృష్టించి దాంట్లో ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తిని కూర్చొబెట్టాలన్నది ప్రణాళిక. దీనికి సంబంధించి ఎల్ఐసీ (LIC) చట్టంలో గత ఏడాదే మార్పులు చేసినట్లు నిపుణులు తెలిపారు.
అయితే ఏ రంగం నుంచి సీఈఓని ఎంపిక చేస్తారనే విషయం మాత్రం ఇంకా తెలియదు. ఎల్ఐసీ (LIC)కి నేతృత్వం వహించే వ్యక్తుల ఎంపికకు కావాల్సిన అర్హతలను మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఉందని.. దీనికి తాను పదవిలో ఉండగానే అంగీకారం తెలిపినట్లు కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. దీనివల్ల సంస్థకు ఎలాంటి హాని ఉండదన్నారు. ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తిని నియమించాలని ప్రస్తుతానికి సూత్రప్రాయంగానే ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి చట్టంలో ఇంకా ఏమైనా మార్పులు చేయాల్సి వస్తుందేమోనని సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే వేతనం విషయంలోనూ ప్రైవేటుకు దీటుగా ఇవ్వగలమా.. లేదా.. అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రభుత్వ రంగంతో పోలిస్తే ప్రైవేటు రంగంలో ఉన్నతస్థాయి ఉద్యోగులకు అధిక వేతనాలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ