Wheat: గోధుమ ధరల కట్టడికి ప్రభుత్వం చర్యలు.. నిల్వల పరిమితి మరింత కుదింపు
Wheat: టోకు, రిటైల్, బిగ్ చైన్ రిటైల్ వ్యాపారుల వద్ద ఉండాల్సిన గోధుమల నిల్వల పరిమితిని మరింత కుదిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దిల్లీ: ఆహార ద్రవ్యోల్బణ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన సర్కార్.. తాజాగా గోధుమ నిల్వల (Wheat Stocks)పై ఆంక్షలను కఠినతరం చేసింది. టోకు, రిటైల్, బిగ్ చైన్ రిటైల్ వ్యాపారుల వద్ద ఉండాల్సిన నిల్వల పరిమితిని మరింత కుదిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు.
గోధుమల నిల్వలపై ఉన్న పరిమితి (Wheat Stock limits)ని టోకు వ్యాపారులకు 2,000 టన్నుల నుంచి 1,000 టన్నులకు కుదిస్తున్నట్లు చోప్రా తెలిపారు. అదే సమయంలో రిటైలర్లకు ఈ మొత్తాన్ని పది టన్నుల నుంచి ఐదు టన్నులకు కుదించారు. అలాగే బిగ్ చైన్ రిటైలర్లకు ఒక్కో డిపోపై ఐదు టన్నుల చొప్పున వారి అన్ని డిపోల్లో 1,000 టన్నుల పరిమితిని నిర్దేశించారు. మరోవైపు గోధుమలను ప్రాసెసింగ్ చేసేవారు నెలవారీ సంస్థాగత సామర్థ్యంలో 70 శాతం చొప్పున.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలలకు సరిపడా ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు.
కృత్రిమ కొరతను సృష్టించి అక్రమంగా ధరలను పెంచేందుకు చేస్తున్న యత్నాలను అరికట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చోప్రా తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిల్వలను తాజా పరిమితుల మేరకు సర్దుబాటు చేసుకోవడానికి 30 రోజుల గడువు ఇచ్చారు. గోధుమలను నిల్వ చేసుకునే అవసరం ఉన్న సంస్థలన్నీ ప్రభుత్వ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. ప్రతి శుక్రవారం నిల్వల స్థితిని అప్డేట్ చేయాలని చెప్పారు.
తాజా ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చోప్రా స్పష్టం చేశారు. తొలిసారి గోధుమ నిల్వలపై ఆంక్షలు విధిస్తూ జూన్ 12న ప్రభుత్వం ప్రకటన చేసింది. మార్చి 2024 వరకు వాటిని కొనసాగిస్తామని తెలిపింది.
దేశంలో ఉల్లి ధరలు (Onion Prices) పెరిగిన నేపథ్యంలో.. 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతుల (Onion Exports)పై నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈరోజు నుంచే నిషేధం అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్