ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
OTP frauds: ఓటీపీ స్కామ్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందులోభాగంగానే టెలికాం, ఎస్బీఐ కార్డ్స్తో కలిసి పనిచేస్తోంది.
OTP frauds | ఇంటర్నెట్డెస్క్: డిజిటలైజేషన్ మూలంగా మన బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత సులభతరం అయ్యిందో.. సైబర్ నేరాలూ అదే స్థాయిలో పెరిగాయి. వీటిని అరికట్టేందుకు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితం ఉండడం లేదు. ముఖ్యంగా వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) మాటున జరిగే మోసాలు కోకొల్లలు. ఈనేపథ్యంలో ఓటీపీ సాయంతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లకు కళ్లెం వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఓ వినూత్న పరిష్కారాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అందులోభాగంగానే కేంద్ర హోం మంత్రిత్వశాఖ.. ఎస్బీఐ కార్డ్స్, టెలికాం ఆపరేటర్లు జట్టుకట్టినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారిని ఉద్దేశిస్తూ ఎనకమిక్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
సాధారణంగా లావాదేవీలు జరపాలంటే రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ కస్టమర్ ఏ ప్రాంతంలో ఉన్నాడనే విషయంతో సంబంధం ఉండదు. అయితే ఇకపై ఓటీపీ వచ్చే సమయంలో రిజిస్టర్ అడ్రస్తో పాటు కస్టమర్ ప్రస్తుతం ఉన్న ప్రాంతాన్ని (geo location) ట్రాక్ చేసేందుకు బ్యాంకులకు అనుమతివ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఈ రెండు లొకేషన్ల మధ్య ఏదైనా వ్యత్యాసం అనిపిస్తే ఫిషింగ్ దాడి జరిగే అవకాశం ఉందని కస్టమర్కు హెచ్చరిక జారీ అవుతుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి హైదరాబాద్లో నివసిస్తున్నాడనుకుందాం. ఆ వ్యక్తి రిజిస్టర్ మొబైల్ నంబర్కు రావాల్సిన ఓటీపీ ఎక్కడో రాజస్థాన్కు వెళితే.. ఆ కస్టమర్కు అలర్ట్ వెళుతుంది. ఇప్పటివరకు ఆ ప్రాంతంతో సంబంధం లేకపోయినా, మునుపెన్నడూ ప్రయాణించని ప్రాంతమైనా ఈ సందేశం యూజర్కు చేరుతుంది.
టెలికాం డేటాబేస్ సాయంతో కస్టమర్ ఉన్న లొకేషన్ ట్రాక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఓటీపీ డెలివరీ లొకేషన్లో ఏదైనా తేడా గుర్తిస్తే.. వెంటనే యూజర్ను అప్రమత్తం చేస్తూ ఒక పాపప్ మెసేజ్ పంపుతారు. లేదా ఓటీపీని పూర్తిగా బ్లాక్ చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ సేవలు ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈవిషయంపై కేంద్ర హోం శాఖ, ఎస్బీఐ కార్డ్స్ గానీ స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల