GST collection: ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లు ₹1.68 లక్షల కోట్లు

GST collection: ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు సమకూరాయి. గతేడాదితో పోలిస్తే 12.5 శాతం వృద్ధి నమోదైంది.

Published : 01 Mar 2024 18:33 IST

GST collection దిల్లీ: దేశంలో మరోసారి జీఎస్టీ వసూళ్లు (GST collection) భారీగా నమోదయ్యాయి. ఫిబ్రవరి నెలకు గాను రూ.1.68 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ఈ నెలతో పోలిస్తే ఇది 12.5 శాతం అధికం. ఆ ఏడాది రూ.1.51 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి. దేశీయ లావాదేవీలపై జీఎస్టీ వసూళ్లు 13.9 శాతం, దిగుమతైన వస్తువులపై వసూలయ్యే జీఎస్టీ 8.5 శాతం వృద్ధి కారణంగా జీఎస్టీ వసూళ్ల వృద్ధికి దోహదం చేసినట్లు ఆ శాఖ వెల్లడించింది.

ఫిబ్రవరి నెల వసూళ్లలో సెంట్రల్‌ జీఎస్టీ వాటా రూ.31,785 కోట్లు కాగా.. స్టేట్‌ జీఎస్టీ రూ.39,615 కోట్లుగా ఉంది. ఐజీఎస్టీ రూపంలో రూ.84,098 కోట్లు, సెస్సుల రూపంలో రూ.12,839 కోట్లు సమకూరినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.67 లక్షల కోట్లు చొప్పున నెలవారీ సగటు వసూళ్లు జరుగుతున్నట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో సగటు రూ.1.5 లక్షల కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది.

రాష్ట్రాల వారీగా చూసినప్పుడు.. ఏపీలో గతేడాది ఫిబ్రవరిలో రూ.3,557 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు జరగ్గా.. ఈసారి ఆ మొత్తం 3 శాతం వృద్ధితో రూ.3,678 కోట్లుగా నమోదైంది. తెలంగాణలో గతేడాది రూ.4,424 కోట్లుగా ఉన్న వసూళ్లు 18 శాతం వృద్ధితో రూ.5,211 కోట్లకు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని