HDFC Bank: హెచ్డీఎఫ్సీ యూపీఐ పేమెంట్స్.. ఇక ఆ లావాదేవీలకు SMS అలర్ట్లు ఉండవు
HDFC Bank: చిన్న చిన్న లావాదేవీలకు ఎసెమ్మెస్ అలర్ట్లు అందించబోమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈమెయిల్ నోటిఫికేషన్లు మాత్రం యథావిధిగా అందుతాయని తెలిపింది.
ముంబయి: యూపీఐ లావాదేవీల విషయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ విలువ చేసే ట్రాన్సాక్షన్స్కు (UPI Transactions) ఇకపై ఎస్సెమ్మెస్ ద్వారా అలర్ట్లు అందించబోమని తెలిపింది. ఈమేరకు తమ కస్టమర్లకు ఎస్సెమ్మెస్, ఈమెయిల్ ద్వారా సందేశాలు పంపింది. 2024 జూన్ 25 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
రూ.100 కంటే తక్కువ చేసే చెల్లింపులపై ఇకపై ఎస్సెమ్మెస్ ద్వారా సందేశాలు పంపబోమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) స్పష్టంచేసింది. అలాగే రూ.500 కంటే తక్కువ డిపాజిట్లకు కూడా అలర్ట్లు ఉండవని తెలిపింది. అయితే, విలువతో సంబంధం లేకుండా అన్ని యూపీఐ లావాదేవీలకు ఎస్సెమ్మెస్, ఈమెయిల్ సందేశాలు కచ్చితంగా అందుతాయని తెలిపింది. కస్టమర్ల నుంచి అందిన ఫీడ్బ్యాక్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. యూపీఐ (UPI) యాప్ల నుంచి ఎలాగూ నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో చిన్న మొత్తం లావాదేవీలకు ప్రత్యేకంగా అలర్ట్లు అవసరం లేదని పలువురు ఖాతాదారులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
చిన్నచిన్న లావాదేవీలకు సైతం ఎస్సెమ్మెస్లు పంపడం వల్ల రోజుకు కోట్లాది సందేశాలు కస్టమర్లకు చేరుతున్నాయి. దీని కోసం ఆయా బ్యాంకులు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సివస్తోంది. తాజా నిర్ణయంతో హెచ్డీఎఫ్సీకి ఆ మేరకు కొంత నిర్వహణ వ్యయం తగ్గనుంది. మరోవైపు ఖాతాదారులంతా తమ ప్రైమరీ ఈమెయిల్ను అప్డేట్ చేసుకోవాలని బ్యాంకు సూచించింది.
మరోవైపు బ్యాంకులు ఇప్పటికే యూపీఐ లైట్ను (UPI Lite) ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిద్వారా యాప్లోనే రూ.500 వరకు పక్కన పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేకుండానే వేగంగా లావాదేవీలు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?