సంరక్షకుడికి రూ.97వేల కోట్ల ఆస్తి.. రాసివ్వనున్న బిలియనీర్!
Nicolas Puech: వృద్ధాప్యంలో తన బాగోగులు చూసుకున్న సంరక్షకుడిని.. రూ.వేల కోట్ల ఆస్తి (Fortune)కి వారసుడిని చేస్తున్నారో బిలియనీర్. రూ.97వేల కోట్ల ఆస్తిని అతడి పేరుపై రాయబోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: స్విట్జర్లాండ్కు చెందిన ఓ కుబేరుడు మంచి మనసు చాటుకున్నారు. వృద్ధాప్యంలో తనను కంటికి రెప్పలా చూసుకున్న సంరక్షకుడిని దత్తత తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తన 11 బిలియన్ డాలర్ల ఆస్తిని అతడి పేరుపై రాయబోతున్నారు. ఈ మేరకు స్విస్ మీడియా కథనాలు వెల్లడించాయి.
స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ హెర్మెస్ (Hermes)ను 1837లో థియెర్రీ హెర్మెస్ స్థాపించారు. థియెర్రీ కుటుంబంలో ఐదో తరానికి చెందిన వారసుడు నికోలస్ ప్యూచ్ (Nicolas Puech). 80ఏళ్ల నికోలస్కు హెర్మెస్ కంపెనీలో 5-6శాతం వాటాలున్నాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ దాదాపు 11 బిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.97వేల కోట్లకు పైమాటే). అయితే, నికోలస్కు వివాహం కాలేదు. వారసులెవరూ లేకపోవడంతో ఆయన తదనానంతరం ఆ ఆస్తంతా ఎవరికి దక్కబోతుందనే దానిపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.
ఈ క్రమంలోనే తన ఆస్తికి వారసుడి విషయంలో నికోలస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్విస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా తన బాగోగులు చూసుకుంటున్న 51 ఏళ్ల సంరక్షకుడిని నికోలస్ దత్తత తీసుకునేందుకు సిద్ధమైనట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇందుకోసం ఆయన ఓ న్యాయ బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారట. చట్టప్రకారం దత్తత పూర్తయిన తర్వాత ఆ సంరక్షకుడికి తన 11 బిలియన్ డాలర్ల ఆస్తిని వారసత్వంగా అప్పగించనున్నట్లు సమాచారం. అయితే, ఆ సంరక్షకుడి పేరును మాత్రం సదరు కథనాలు వెల్లడించలేదు. అతడికి పెళ్లయి, ఇద్దరు పిల్లలున్నట్లు మాత్రం తెలిపాయి. ఇప్పటికే ఆ సంరక్షకుడికి నికోలస్ 5.9 మిలియన్ డాలర్ల విలువైన తన ఆస్తులను అప్పగించినట్లు సమాచారం. మొరాకో, మాంట్రియక్స్ వంటి నగరాల్లోని కొన్ని ఆస్తుల తాళాలను అతడికి ఇచ్చేశారట.
కుటుంబ తగాదాల వల్లే..
కుటుంబ తగాదాల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014లో హెర్మెస్ సూపర్వైజరీ బోర్డ్ నుంచి నికోలస్ అర్ధంతరంగా వైదొలిగారు. ఆ ఏడాది మరో ఫ్యాషన్ కంపెనీ ఎల్వీఎంహెచ్.. హెర్మెస్ కంపెనీలో బలవంతంగా 23శాతం వాటాలను దక్కించుకుంది. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు హెర్మెస్ కుటుంబసభ్యులు.. కంపెనీలోని తమ వాటాలతో ఓ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయగా.. నికోలస్ మాత్రం తన వాటాను అట్టిపెట్టుకున్నారు. ఇది కుటుంబంలో విభేదాలకు కారణమైంది. ఆ తర్వాత నికోలస్.. బోర్డు నుంచి వైదొలిగారు. దీంతోనే.. నికోలస్ తన ఆస్తులపై ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
అయితే, తన వారసత్వ ప్రణాళికను అమలు చేసేందుకు నికోలస్ చట్టపరంగా సవాళ్లను ఎదుర్కొనేలా కన్పిస్తోంది. స్విట్జర్లాండ్లో పెద్దవాళ్లను దత్తత తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. దత్తత వెళ్లే వ్యక్తి మైనర్గా ఉన్నప్పుడు కనీసం ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకునేవ్యక్తి ఆ మైనర్తో కలిసి జీవించి ఉండాలి. మరోవైపు.. నికోలస్ ఆ సంరక్షకుడిని దత్తత తీసుకుంటే.. దానిపై హెర్మెస్ కుటుంబసభ్యులు కోర్టులో దావా వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రికార్డు లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు.. 2023-24లో ₹1.4 లక్షల కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు లాభాలను నమోదు చేశాయి. కేంద్రం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. -
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
TVS iQube: టీవీఎస్ ఐక్యూబ్లో మరో రెండు కొత్త వేరియంట్లు వచ్చాయి. ఇప్పుడు బేస్ వేరియంట్ రూ.95 వేలకే లభించనుంది. -
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ
GPT-4o: ఓపెన్ఏఐ కొత్త చాట్జీపీటీ వెర్షన్ను విడుదల చేసింది. దీంట్లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ తమ జెమిని కొత్త వెర్షన్ను ప్రకటించనున్న తరుణంలో ఓపెన్ఏఐ దీన్ని తీసుకురావడం గమనార్హం. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 21,125
Stock Market Opening bell: ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 72,836 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 21,125 దగ్గర కొనసాగుతోంది. -
జూన్ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయ్: అమిత్షా
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక, మన స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయనేే అభిప్రాయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు. అందువల్ల అంతకంటే ముందుగానే, ఎంపిక చేసుకున్న షేర్లను కొని పెట్టుకోవాల్సిందిగా మదుపర్లకు సూచించారు. -
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు బయోమెట్రిక్ ధ్రువీకరణ
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియ అమలు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
కాకినాడ నుంచి అంతర్జాతీయ విపణికి అమ్మోనియా!
నార్వేలోని ఓస్లో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యారా క్లీన్ అమ్మోనియా అనే సంస్థ, గ్రీన్కో గ్రూపునకు చెందిన కాకినాడ యూనిట్ నుంచి రెన్యూవబుల్ అమ్మోనియా కొనుగోలు చేయనుంది. -
2030 కల్లా 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్
దేశంలోని 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలంటే, భారత్కు రూ.4.2 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భారీ నష్టాల నుంచి లాభాల్లోకి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఆఖర్లో పుంజుకుని లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్ 910 పాయింట్లు కోలుకుంది. -
‘ వార్షిక సమాచార నివేదిక’లో కొత్త వెసులుబాటు
వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం సరికొత్త వెసులుబాటును తీసుకొచ్చింది. ఇందులో సమాచార ధ్రువీకరణ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునే వీలు కల్పించినట్లు తెలిపింది. -
ఎఫ్టీఏ దేశాల నుంచి భారత్కు దిగుమతులు 38% పెరిగాయ్
మనదేశంతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) ఉన్న యూఏఈ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి భారత్కు దిగుమతులు 2018-19లో 136.20 బిలియన్ డాలర్లుగా ఉండేవి. -
ఎయిరిండియా, విస్తారా ఉద్యోగులకు జూన్ కల్లా ఫిట్మెంట్!
ఎయిరిండియా, విస్తారాకు చెందిన 7,000కు పైగా ఉద్యోగులకు జూన్లో ఫిట్మెంట్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్నకు చెందిన ఈ రెండు విమానయాన సంస్థల విలీన ప్రక్రియ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. -
బుల్లెెట్ ఈవీపై తొందర లేదు
బుల్లెట్ బ్రాండ్పై మోటార్సైకిళ్లను విక్రయిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ‘అద్భుత’ విద్యుత్ వాహనాన్ని (ఈవీ) తీసుకు రావాలని ఆశిస్తోంది. అందువల్ల ఈవీల్లోకి ప్రవేశించేందుకు తొందరపాటుతో వ్యవహరించడం లేదని చెబుతోంది. -
జొమాటో లాభం రూ.175 కోట్లు
ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని సరఫరా చేసే సంస్థ జొమాటో, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.175 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.188 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
రాజ్ వట్టికూటి సంస్థలో వాటా కోసం పోటీలో అంతర్జాతీయ పీఈ సంస్థలు
అమెరికన్-భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయిన రాజ్ వట్టికూటికి చెందిన ప్యూర్-ప్లే డిజిటల్ సేవల కంపెనీ అల్టిమెట్రిక్లో మెజారిటీ వాటా కోసం అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థలు పోటీలో ఉన్నాయి. -
భారత్లో మరిన్ని ఎస్యూవీ మోడళ్లు తీసుకొస్తాం: సుజుకీ
కార్ల విభాగంలో తాము కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు భారత్లో స్పోర్ట్ వినియోగ వాహన (ఎస్యూవీ) మోడళ్ల సంఖ్యను పెంచుకుంటామని జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
డ్రోన్ల తయారీ సంస్థ దక్ష అన్మ్యాన్డ్ సిస్టమ్స్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ తన వాటా పెంచుకుంది. ఈ సంస్థలో ఇప్పటికే రెండు దఫాలుగా కోరమాండల్ ఇంటర్నేషనల్ పెట్టుబడి పెట్టింది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈవీ రాక ఆలస్యం? కారణం ఇదే..!
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనం రాక ఆలస్యం కానుంది. అందుకు గల కారణాలను ఆ కంపెనీ ఎండీ వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు
-
‘ఆ మాటలు సరికాదు’: ఐఎంఏ చీఫ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
-
రికార్డు లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు.. 2023-24లో ₹1.4 లక్షల కోట్లు
-
విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై!
-
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
-
దిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు