సంరక్షకుడికి రూ.97వేల కోట్ల ఆస్తి.. రాసివ్వనున్న బిలియనీర్!
Nicolas Puech: వృద్ధాప్యంలో తన బాగోగులు చూసుకున్న సంరక్షకుడిని.. రూ.వేల కోట్ల ఆస్తి (Fortune)కి వారసుడిని చేస్తున్నారో బిలియనీర్. రూ.97వేల కోట్ల ఆస్తిని అతడి పేరుపై రాయబోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: స్విట్జర్లాండ్కు చెందిన ఓ కుబేరుడు మంచి మనసు చాటుకున్నారు. వృద్ధాప్యంలో తనను కంటికి రెప్పలా చూసుకున్న సంరక్షకుడిని దత్తత తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తన 11 బిలియన్ డాలర్ల ఆస్తిని అతడి పేరుపై రాయబోతున్నారు. ఈ మేరకు స్విస్ మీడియా కథనాలు వెల్లడించాయి.
స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ హెర్మెస్ (Hermes)ను 1837లో థియెర్రీ హెర్మెస్ స్థాపించారు. థియెర్రీ కుటుంబంలో ఐదో తరానికి చెందిన వారసుడు నికోలస్ ప్యూచ్ (Nicolas Puech). 80ఏళ్ల నికోలస్కు హెర్మెస్ కంపెనీలో 5-6శాతం వాటాలున్నాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ దాదాపు 11 బిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.97వేల కోట్లకు పైమాటే). అయితే, నికోలస్కు వివాహం కాలేదు. వారసులెవరూ లేకపోవడంతో ఆయన తదనానంతరం ఆ ఆస్తంతా ఎవరికి దక్కబోతుందనే దానిపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.
ఈ క్రమంలోనే తన ఆస్తికి వారసుడి విషయంలో నికోలస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్విస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా తన బాగోగులు చూసుకుంటున్న 51 ఏళ్ల సంరక్షకుడిని నికోలస్ దత్తత తీసుకునేందుకు సిద్ధమైనట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇందుకోసం ఆయన ఓ న్యాయ బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారట. చట్టప్రకారం దత్తత పూర్తయిన తర్వాత ఆ సంరక్షకుడికి తన 11 బిలియన్ డాలర్ల ఆస్తిని వారసత్వంగా అప్పగించనున్నట్లు సమాచారం. అయితే, ఆ సంరక్షకుడి పేరును మాత్రం సదరు కథనాలు వెల్లడించలేదు. అతడికి పెళ్లయి, ఇద్దరు పిల్లలున్నట్లు మాత్రం తెలిపాయి. ఇప్పటికే ఆ సంరక్షకుడికి నికోలస్ 5.9 మిలియన్ డాలర్ల విలువైన తన ఆస్తులను అప్పగించినట్లు సమాచారం. మొరాకో, మాంట్రియక్స్ వంటి నగరాల్లోని కొన్ని ఆస్తుల తాళాలను అతడికి ఇచ్చేశారట.
కుటుంబ తగాదాల వల్లే..
కుటుంబ తగాదాల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014లో హెర్మెస్ సూపర్వైజరీ బోర్డ్ నుంచి నికోలస్ అర్ధంతరంగా వైదొలిగారు. ఆ ఏడాది మరో ఫ్యాషన్ కంపెనీ ఎల్వీఎంహెచ్.. హెర్మెస్ కంపెనీలో బలవంతంగా 23శాతం వాటాలను దక్కించుకుంది. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు హెర్మెస్ కుటుంబసభ్యులు.. కంపెనీలోని తమ వాటాలతో ఓ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయగా.. నికోలస్ మాత్రం తన వాటాను అట్టిపెట్టుకున్నారు. ఇది కుటుంబంలో విభేదాలకు కారణమైంది. ఆ తర్వాత నికోలస్.. బోర్డు నుంచి వైదొలిగారు. దీంతోనే.. నికోలస్ తన ఆస్తులపై ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
అయితే, తన వారసత్వ ప్రణాళికను అమలు చేసేందుకు నికోలస్ చట్టపరంగా సవాళ్లను ఎదుర్కొనేలా కన్పిస్తోంది. స్విట్జర్లాండ్లో పెద్దవాళ్లను దత్తత తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. దత్తత వెళ్లే వ్యక్తి మైనర్గా ఉన్నప్పుడు కనీసం ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకునేవ్యక్తి ఆ మైనర్తో కలిసి జీవించి ఉండాలి. మరోవైపు.. నికోలస్ ఆ సంరక్షకుడిని దత్తత తీసుకుంటే.. దానిపై హెర్మెస్ కుటుంబసభ్యులు కోర్టులో దావా వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం