Real estate: ₹కోటి పైన ఇళ్లకు గిరాకీ.. టాప్-3లో హైదరాబాద్!
కోటికి పైగా ధర కలిగిన ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. హైదరాబాద్ నగరం ఈ విషయంలో టాప్-3లో ఉంది.
Real estate | ఇంటర్నెట్ డెస్క్: కలల ఇంటిని సొంతం చేసుకునేందుకు ప్రజలు ఖర్చుకు వెనకాడడం లేదు. సౌకర్యాలు ఉంటే చాలు ధర రూ.కోటైనా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జరిగిన విక్రయాలే ఇందుకు నిదర్శనం. గత మూడు నెలల్లో జరిగిన మొత్తం ఇళ్ల విక్రయాల్లో వీటి వాటానే 40 శాతం కావడం గమనార్హం. ఆ సమయంలో రూ.50 లక్షల్లోపు ఇళ్ల అమ్మకాలు క్షీణించాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ (Knight Frank) తన నివేదికలో పేర్కొంది. రూ.కోటికి పైగా ధర కలిగిన ఇళ్ల విక్రయాలు గతేడాది క్యూ1లో 29 శాతం కాగా.. క్యూ2లో 31 శాతం, క్యూ3లో 35 శాతం, క్యూ4లో 39 శాతానికి పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
జనవరి నుంచి మార్చి మధ్య దేశంలోని ప్రధాన నగరాల్లో 86,345 యూనిట్లు విక్రయమైనట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. 2023 క్యూ4లో అత్యధికంగా 89,845 యూనిట్లు అమ్ముడవ్వగా.. రెండో అత్యధికం తాజాగా నమోదైనట్లు పేర్కొంది. మొత్తం విక్రయాల్లో కోటికి పైగా ధర కలిగిన 34,895 గృహాలు అమ్ముడైనట్లు నివేదిక తెలిపింది. సంఖ్యా పరంగా గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే.. ఇవి 51 శాతం అధికం. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.50 లక్షల్లోపు ఉన్న గృహాలు 25,714 యూనిట్లు అమ్ముడవ్వగా.. ఈసారి ఆ సంఖ్య 23,026 యూనిట్లకు తగ్గింది. మొత్తం అమ్మకాల్లో ఈ వాటా 27 శాతంగా ఉంది.
రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు 5 శాతం (28,424 యూనిట్లు) మేర తగ్గాయి. గతేడాది 38 శాతంగా ఉన్న వీటి విక్రయాలు 33 శాతానికి తగ్గాయి. ఇది బలమైన డిమాండ్ను సూచిస్తోందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బాలాజీ పేర్కొన్నారు. అలాగే, దీర్ఘకాలిక పెట్టుబడులపై సుముఖంగా ఉన్నారన్నది తెలియజేస్తోందన్నారు. కోటి రూపాయలకు పైగా విలువ కలిగిన ఇళ్ల అమ్మకాలు దేశ రాజధాని ప్రాంతం (NCR) దిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో జనవరి - మార్చి మధ్య 10,558 యూనిట్లు అమ్ముడయ్యాయి. తర్వాతి స్థానాల్లో ముంబయి (7,401), హైదరాబాద్ (6,112) ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్