ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది.
ముంబయి: ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. 1985 నుంచి ఐసీఐసీఐకి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా 11 ఏళ్లపాటు సేవలు అందించారు. 2006లో దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ను అందుకున్నారు. ఆ తర్వాత ఎస్బీఐ నుంచి బయటకు వచ్చి, కొన్నాళ్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో బోధించారు. 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. అప్పుడు ఆయన వయసు 44. ప్రభుత్వ యాజమాన్యంలోని ఒక బ్యాంకుకు చిన్న వయసులోనే సీఎండీగా పనిచేయడం విశేషం. ఆ తర్వాత ఐసీఐసీఐ సీఎండీగా నియమితులయ్యారు. సంస్థను ప్రైవేటు రంగ బ్యాంకుగా మార్చడాన్ని పర్యవేక్షించారు. 1996 వరకూ ఐసీఐసీఐకి సీఎండీగా సేవలను అందించారు. ఆ తర్వాత 2009 వరకూ ఐసీఐసీఐ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొనసాగారు. మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్తో పాటు పలు సంస్థల బోర్డులలో సేవలు అందించారు. హైదరాబాద్లో ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్ ఏర్పాటులోనూ వాఘుల్ కీలక పాత్ర పోషించారు. ఈయన మరణంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. ₹లక్ష దిగువకు విమాన ఇంధనం
Fuel Prices: వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్, విమాన ఇంధన ధరలు కాస్త దిగొచ్చాయి. -
జయహో.. జీడీపీ
దేశ ఆర్థిక వ్యవస్థ, గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించి రాణించింది. నాలుగో త్రైమాసికంలో వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది. -
పదేళ్లలో పెట్టుబడులు రూ.7.50 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ కంపెకనీల లాభం 2022-23తో పోలిస్తే 55 శాతం పెరిగింది. గ్రూప్ నమోదిత కంపెనీల నికర లాభం 2023-24లో రూ.30,767 కోట్లకు చేరింది. -
బ్రిటన్ నుంచి భారత్కు 100 టన్నుల బంగారం
బ్రిటన్లో ఉంచిన తన పసిడి నిల్వల నుంచి 100 మెట్రిక్ టన్నుల (లక్ష కిలోల) పసిడిని దేశీయ ఖజానాకు భారత్ చేర్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
క్విక్ కామర్స్లోకి జియోమార్ట్!
రిలయన్స్ రిటైల్కు చెందిన జియోమార్ట్, ఆన్లైన్లో ఆర్డరు తీసుకున్న నిత్యావసరాలను సాధ్యమైనంత వేగంగా అందించే (క్విక్ కామర్స్) సేవల్లోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
5 రోజుల నష్టాలకు అడ్డుకట్ట
సూచీల అయిదు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడం ఇందుకు కలిసొచ్చింది. -
రూ.10 లక్షల కోట్ల మొండి బాకీలు వసూలయ్యాయ్
సంస్కరణలు, మెరుగైన పాలన ద్వారా మోదీ ప్రభుత్వం బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. -
ఏడాదికి 50 లక్షల కార్ల విక్రయాలు!
దేశీయంగా ప్రయాణికుల వాహనాల (పీవీ-కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) అమ్మకాలు ఏడాదికి 50 లక్షలకు మించడం కొన్నేళ్లలో సాధ్యపడుతుందని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది. -
బీమా కంపెనీలో 14.50% వాటా విక్రయించనున్న కెనరా బ్యాంకు
కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 14.50% వాటా విక్రయించడానికి కెనరా బ్యాంకు సిద్ధపడుతోంది. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ త్వరలో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కు వెళ్లనుంది. -
సంక్షిప్త వార్తలు(5)
తయారీ రంగ అంకుర సంస్థల కోసం ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా 100కు పైగా కార్పొరేట్లు, యూనికార్న్ (100 కోట్ల డాలర్ల విలువైన సంస్థ)లను ప్రభుత్వం కోరిందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఆ విషయాలు నా పిల్లల నుంచే నేర్చుకున్నా.. మామా ఎర్త్ సీఈఓ
Ghazal Alagh: పిల్లల నుంచి తాను నేర్చుకున్న పాఠాలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు మామాఎర్త్ సీఈఓ గజల్ అలఘ్. -
లక్షకు పైగా టెస్లా కార్ల రీకాల్.. కారణం ఇదే..
Tesla: కార్ల తయారీ సంస్థ టెస్లా లక్షకు పైగా కార్లను రీకాల్ చేపట్టింది. సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్ పనితీరులో తలెత్తిన లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
గత ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు: పొన్నం ప్రభాకర్
-
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
-
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయించాలి: సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
-
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
-
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM