ICICI Festive Bonanza: ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా..రూ.26 వేల వరకు క్యాష్బ్యాక్!
ICICI Festive Bonanza: పండగ సీజన్ నేపథ్యంలో తమ కస్టమర్ల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రాయితీలు, క్యాష్బ్యాక్లు, నో-కాస్ట్ ఈఎంఐల రూపంలో వీటిని అందించనుంది.
ఇంటర్నెట్ డెస్క్: పండగ సీజన్ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ ‘ఫెస్టివ్ బొనాంజా (ICICI Bank Festive Bonanza)’ను ప్రకటించింది. రాయితీలు, ఆఫర్లు, క్యాష్బ్యాక్ల రూపంలో తమ కస్టమర్లకు గరిష్ఠంగా రూ.26,000 వరకు ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తోంది. బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ, కార్డ్లెస్ ఈఎంఐ ద్వారా కొనుగోళ్లు చేసిన కస్టమర్లు ఈ ఆఫర్లను పొందొచ్చు.
పండగ సీజన్ (Festival Sale)లో కస్టమర్లు చేసే కొనుగోళ్లు, వారి అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా ఆఫర్లను రూపొందించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank Festive Bonanza) తెలిపింది. ఎలక్ట్రానిక్స్, మొబైళ్లు, ఫ్యాషన్, జువెలరి, ఫర్నీచర్, ట్రావెల్, డైనింగ్ వంటి వాటిపై చేసే చెల్లింపులపై ఆఫర్లు వర్తిస్తాయని వెల్లడించింది. అలాగే ఐఫోన్, మేక్మైట్రిప్, టాటా న్యూ, వన్ప్లస్, హెచ్పీ, మైక్రోసాఫ్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఎల్జీ, సోనీ, శాంసంగ్, తనిష్క్, తాజ్, జొమాటో, స్విగ్గీ వంటి బ్రాండ్లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అదనంగా ‘బిగ్ బిలియన్ డేస్’ పేరిట ప్రత్యేక సేల్ నిర్వహించే ఫ్లిప్కార్ట్తో, ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ కోసం అమెజాన్తో, ‘బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్’ కోసం మింత్రాతో చేతులు కలిపినట్లు ఐసీఐసీఐ (ICICI Bank Festive Bonanza) తెలిపింది. పండగ సందర్భంగా గృహ, వాహన రుణాలపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఇవ్వనున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ ఝా తెలిపారు.
ఐసీఐసీఐ కస్టమర్లకు లభించే ఆఫర్ల వివరాలు(ICICI Bank Festive Bonanza offers)..
- కొన్ని బ్రాండ్ల ఉత్పత్తుల ఆన్లైన్ షాపింగ్, ఇ-కామర్స్ వేదికలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, టాటా క్లిక్లో చేసే కొనుగోళ్లపై 15% వరకు రాయితీ లభిస్తుంది.
- ఎల్జీ, శాంసంగ్, సోనీ, యురేకా ఫోర్బ్స్, వర్ల్పూల్ సహా మరికొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోళ్లపై తమ కస్టమర్లకు రూ.26 వేల వరకు క్యాష్బ్యాక్ లభిస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. బోస్ స్పీకర్లపై 10 శాతం, గరిష్ఠంగా రూ.6,000 వరకు రాయితీ ఉంది. జేబీఎల్ బ్రాండ్లో ఎంపిక చేసిన ఉత్పత్తులపై 25 శాతం వరకు, గరిష్ఠంగా రూ.12,000 క్యాష్బ్యాక్ పొందొచ్చు. రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్లో చేసే కొనుగోళ్లపైనా రాయితీలు ఉన్నాయి.
- యాపిల్, వన్ప్లస్, మోటోరోలా, ఒప్పో, షావోమి, రియల్మీ మొబైళ్లపై రాయితీలు, ఈఎంఐ ఆఫర్లు ఉన్నాయి. రూ.2,457తో ప్రారంభమయ్యే నెలవారీ ఈఎంఐ ఆప్షన్ను ఎంచుకుంటే ఐఫోన్ 15పై నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది.
- లైఫ్స్టయిల్, ఫాస్ట్రాక్, మింత్రా, సెంట్రోలో చేసే ఫ్యాషన్ కొనుగోళ్లపై అదనంగా 10 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.
- మేక్మైట్రిప్, యాత్ర, క్లియర్ట్రిప్, ఈజ్మైట్రిప్ వంటి వేదికలపై చేసుకునే ట్రావెల్ బుకింగ్లపై రాయితీ లభిస్తుంది.
- జొమాటో, స్విగ్గీ, ఈజీడైనర్, మెక్డొనాల్డ్స్ వంటి వాటిలో చేసే ఆహారపదార్థాల కొనుగోళ్లపై తగ్గింపు ఉంటుంది.
- సినీపోలీస్లో సినిమా టికెట్ల కొనుగోలు, సోనీలివ్ వార్షిక సబ్స్క్రిప్షన్పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.
- పెప్పర్ఫ్రై, అర్బన్ ల్యాడర్, డ్యూరోఫ్లెక్స్ వంటి ఫర్నీచర్ బ్రాండ్లపై 10 శాతం వరకు రాయితీ లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్