UPI ID: యూపీఐ ఐడీలు వాడడం లేదా.. అయితే మీకో అలర్ట్!
NPCI guidelines on UPI IDs: యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఎన్పీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడాదికి పైగా వాడకుండా ఉన్న యూపీఐ ఐడీలను, నంబర్లను డీయాక్టివేట్ చేయాలని సూచించింది.
UPI IDs: ఇంటర్నెట్ డెస్క్: ఎవరికైనా డబ్బులు పంపాలంటే ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పనిసరి. ఇప్పుడు మాత్రం యూపీఐ ఐడీ (UPI ID) ఉంటే చాలు.. ఇట్టే డబ్బులు పంపొచ్చు. అకౌంట్ ఒకటే ఉన్నా వేర్వేరు యూపీఐ ఐడీలు ఉండొచ్చు. ఇలా చాలా మందికి ఫోన్ నంబర్తో, మెయిల్ ఐడీతో ఒకటికి మించే యూపీఐ ఐడీలు ఉంటున్నాయి. అయితే, అందులో రెగ్యులర్గా వాడేవి కొన్నయితే.. వాడకుండా వదిలేసినవి చాలానే ఉంటున్నాయి. అలాంటి యూపీఐ ఐడీలు, ఫోన్ నంబర్ల విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి పైగా వాడని యూపీఐ ఐడీలు, నంబర్లు డీయాక్టివేట్ చేయాలని నిర్ణయించింది.
ఏడాదికి పైగా ఎటువంటి లావాదేవీలకూ వినియోగించని యూపీఐ ఐడీలు, యూపీఐ నంబర్లు, ఫోన్ నంబర్లను డీయాక్టివ్ చేయాలంటూ ఎన్పీసీఐ తాజాగా గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే యాప్స్, బ్యాంకులకు సూచించింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీనివల్ల పొరపాటున వేరొకరికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు తగ్గుతాయని పేర్కొంది. సాధారణంగా వ్యక్తులు ఫోన్ నంబర్లను మారుస్తూ ఉంటారు. బ్యాంక్ ఖాతాలకు ఉన్న లింకులను తొలగించరు. అలా వాడని మొబైల్ నంబర్ కొన్నాళ్లకు టెలికాం సంస్థలు వేరొకరికి కేటాయిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ నంబర్పై ఉండే యూపీఐ ఐడీలకు సొమ్ము ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఎన్పీసీఐ గుర్తించింది. కాబట్టి ఈ ఏడాది డిసెంబర్ 31 కల్లా థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ (TPAP), పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (PSP) సదరు యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని సూచించింది.
Password: అత్యధిక మంది వాడుతున్న పాస్వర్డ్ ఏంటో తెలుసా?
ఏడాదిగా ఆర్థిక, ఆర్థికేతర (డెబిట్, క్రెడిట్) లావాదేవీలు జరగని యూపీఐ ఐడీలను గుర్తించి, వాటిని తొలగించాలని ఎన్పీసీఐ తన సర్క్యులర్లో పేర్కొంది. ఈ తరహా యూపీఐ ఐడీలు, నంబర్లు కలిగిన కస్టమర్లు ఇకపై ఎలాంటి నగదునూ అందుకోలేరు. అలాగే, అలాంటి ఫోన్ నంబర్లను పీఎస్పీలు యూపీఐ మ్యాపర్ నుంచి డీ-రిజిస్టర్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, కాంటాక్ట్కుగానీ, ఫోన్ నంబర్కు గానీ లావాదేవీలు జరిపేటప్పుడు యాప్స్లో స్టోర్ చేసి ఉన్న పేరును కాకుండా కస్టమర్ను పేరును చూపించాలని ఎన్పీసీఐ పేర్కొంది. సురక్షితమైన నగదు లావాదేవీల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్పీసీఐ తన సర్క్యులర్లో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.