Digital Payments: డిజిటల్ చెల్లింపుల్లో 46శాతం భారత్లోనే: ఆర్బీఐ గవర్నర్
Digital Payments: ప్రపంచంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు సగం భారత్లోనే జరుగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అత్యధిక మంది యూపీఐ పేమెంట్స్ చేస్తున్నట్లు తెలిపారు.
ముంబయి: గత 12 ఏళ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ప్రపంచంలోని మొత్తం ఆన్లైన్ చెల్లింపుల్లో (Digital Payments) దాదాపు సగం మన దేశంలోనే జరుగుతున్నాయని తెలిపారు. ముంబయిలోని ఆర్బీఐ కేంద్ర కార్యాలయంలో జరిగిన డిజిటల్ చెల్లింపుల అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు.
‘‘2012-13 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 162 కోట్ల రిటైల్ ఆన్లైన్ పేమెంట్స్ జరగ్గా.. 2023-24 నాటికి ఆ సంఖ్య 14,726 కోట్లకు పెరిగింది. అంటే గత 12 ఏళ్లలో డిజిటల్ చెల్లింపులు దాదాపు 90 రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం డిజిటల్ లావాదేవీల్లో దాదాపు 46శాతం భారత్లోనే జరుగుతున్నాయి’’ అని శక్తికాంతదాస్ వెల్లడించారు. ఇక, ‘యూపీఐ (UPI)’ అనేది భారత్లోనే గాక.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన చెల్లింపు వ్యవస్థగా మారిందన్నారు.
‘‘దేశంలో డిజిటల్ పేమెంట్స్ గణనీయమైన వృద్ధి సాధించడంలో యూపీఐలదే కీలక పాత్ర. 2023లో జరిగిన ఆన్లైన్ చెల్లింపుల్లో 80శాతం వాటా దీనిదే. 2017లో 43 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా.. 2023 నాటికి ఆ సంఖ్య ఏకంగా 11,761 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం రోజుకు సగటున 43 కోట్ల యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి’’ అని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంటరాపరెబుల్ సిస్టమ్
ఆదాయపు పన్ను, బీమా ప్రీమియం, మ్యూచువల్ ఫండ్ పేమెంట్స్, ఈ-కామర్స్ వంటి వాటికి ఇంటర్నెట్ బ్యాంకింగ్తోనే చాలామంది చెల్లింపులు చేస్తుంటారు. వీటిని ప్రాసెస్ చేయాలంటే పేమెంట్స్ అగ్రిగేటర్స్తో బ్యాంకులు విడివిడిగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఖాతాదారులు సులువుగా ఈతరహా చెల్లింపులు చేయాలంటే అన్ని బ్యాంకులూ, అన్ని పేమెంట్స్ అగ్రిగేటర్ల మధ్య ఒప్పందం ఉండాలి. ఇలా అన్నింటితో ఒప్పందం కుదుర్చుకోవడం అసాధ్యం. వీటిని దృష్టిలోపెట్టుకుని ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఇంటరాపరెబుల్ పేమెంట్ సిస్టమ్ను తీసుకురానున్నట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు. దీన్ని అమలుచేసేందుకు ఇప్పటికే ఎన్పీఐ భారత్ బిల్పే లిమిటెడ్ (NBBL)కు అనుమతినిచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాదిలోనే ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?