Indian Economy: ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా భారత్
అధిక ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న పెద్ద దేశాల్లో అగ్రగామిగా భారతదేశం కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో పేర్కొంది.
వచ్చే మూడేళ్లలో 6.7% వృద్ధి
మనదేశంపై ప్రపంచ బ్యాంకు అంచనా
దిల్లీ: అధిక ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న పెద్ద దేశాల్లో అగ్రగామిగా భారతదేశం కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో పేర్కొంది. వచ్చే మూడేళ్లలో 6.7% వృద్ధిరేటు సాధించే అవకాశం భారత్కు ఉన్నట్లు వివరించింది. 2023-24లో మనదేశం 8.2% వృద్ధి నమోదు చేసింది. ఇది అంచనాల కంటే అధికం. తదుపరి 3 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధిరేటు కాస్త నెమ్మదించి 6.7% వద్ద స్ధిరపడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. మనదేశంలో ప్రభుత్వ పెట్టుబడుల్లో వృద్ధి అధికంగా ఉండగా, ప్రైవేటు పెట్టుబడులూ కోలుకుంటున్నట్లు వివరించింది.
- ఈ ఏడాది ప్రపంచ దేశాల సగటు వృద్ధి రేటు 2.6 శాతంగా ఉంటుందని, 2025-26లో 2.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. కొవిడ్-19 పరిణామాల ముందు దశాబ్దంలో నమోదైన ప్రపంచ వృద్ధి 3.1% కంటే ఇది తక్కువ కావడం గమనార్హం.
- దక్షిణాసియా దేశాల్లో 2023 ఆర్థిక సంవత్సరంలో 6.6% సగటు వృద్ధి నమోదు కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.2 శాతానికి పడిపోతున్నట్లు ప్రపంచ బ్యాంకు వివరించింది. అదే సమయంలో మనదేశం సాధిస్తున్న అధిక వృద్ధి వల్ల 2025-26లో దక్షిణాసియా దేశాల సగటు వృద్ధి రేటు 6.2% వద్ద స్ధిరపడుతుందని పేర్కొంది. బంగ్లాదేశ్ కూడా ఆకర్షణీయ వృద్ధి బాటలో ఉంది. పాకిస్థాన్, శ్రీలంక నెమ్మదిగా కోలుకుంటున్నాయి.
- ఈ ఏడాదిలో ఆమెరికా వృద్ధి రేటు 2.5 శాతంగా ఉంటుందన్నది ప్రపంచబ్యాంక్ అంచనా. ప్రజల వినియోగం, ప్రభుత్వ వ్యయం పెరగడం దీనికి ప్రధాన కారణాలని పేర్కొంది. చైనా ఆర్థిక వ్యవస్థ కూడా కోలుకుంటోందని, ఈ ఏడాదిలో 4.8% వృద్ధి రేటు సాధించొచ్చని వివరించింది.
ద్రవ్యోల్బణం: 2024లో ప్రపంచ వ్యాప్త సగటున ద్రవ్యోల్బణం 3.5 శాతానికి తగ్గుతుందని, 2025లో ఇది ఇంకా తగ్గి 2.9 శాతానికి పరిమితం అవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. కానీ ఇంతకు ముందు అంచనా వేసినంత వేగంగా ద్రవ్యోల్బణం దిగి రావడం లేదని పేర్కొంది. అందువల్ల వివిధ దేశాల్లో కేంద్ర బ్యాంకులు అప్రమత్తంగా ముందుకు సాగుతున్నాయని, ఫలితంగా రుణాలపై వడ్డీ రేట్లు ఇంకొంతకాలం అధికంగానే ఉంటాయని అంచనా వేసింది. భారత్లో ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంకు లక్ష్యమైన 4% (2 శాతం అటు,ఇటు) సమీపంలో ఉన్నట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్