యంగ్ ఇండియాది విరాట్ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్ రాజన్
డెమోగ్రఫిక్ డివిడెండ్ కారణంగా రావాల్సిన ప్రయోజనాలను భారత్ అందుకోలేకపోతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.
వాషింగ్టన్: డెమోగ్రఫిక్ డివిడెండ్ కారణంగా కలిగే ప్రయోజనాలను భారత్ పొందలేకపోతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan) అన్నారు. యువతలో నైపుణ్యాల మెరుగుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశం మొత్తం జనాభాలో పనిచేయని వారితో పోలిస్తే పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్గా పేర్కొంటారు.
జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ‘మేకింగ్ ఇండియా యాన్ అడ్వాన్స్ ఎకానమీ బై 2047’ అంశంపై నిర్వహించిన సదస్సులో రఘురామ్ రాజన్ మాట్లాడారు. డెమోగ్రఫిక్ డివిడెండ్ వల్ల కలిగే ప్రతిఫలాలు పొందడంలో మనం మధ్య స్థాయిలోనే ఉన్నామన్నారు. ఈవిషయంలో చైనా, కొరియా ఎక్కువ ప్రతిఫలాన్ని పొందాయని గుర్తు చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
మన వద్ద ఉన్న మానవ వవనరుల సామర్థ్యాలను కొంతైనా మెరుగుపరచడం, అందుబాటులో ఉన్న ఉద్యోగాల స్వభావాన్ని పాక్షికంగా మార్చడం వంటి అంశాలపైన పని చేయాల్సిన అవసరం ఉందని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ‘‘అప్రంటీస్షిప్ దీనికి మంచి ఆలోచన. కాంగ్రెస్ ఈ అంశాన్ని తన మేనిఫెస్టోలో పెట్ట్టింది. అయితే దానికి ఇంకా మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది’’ అని రాజన్ అన్నారు. చిప్ తయారీపై భారత్ బిలియన్ డాలర్లు ఖర్చు చేయడాన్ని తప్పబట్టారు. ఇందులో చాలావరకు వ్యయం సబ్సిడీలకే పోతుందని చెప్పారు.
మన దేశానికి చెందిన చాలామంది ఆవిష్కర్తలు సింగపూరో, సిలికాన్ వ్యాలీనో తరలిపోవడానికి కారణమేంటన్న ఓ ప్రశ్నకు రాజన్ బదులిచ్చారు. అందుకుగల కారణాలను వారినే అడగాల్సిన అవసరం ఉందన్నారు. చాలా మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రపంచాన్ని మార్చాలన్న దృక్పథంతో ఉంటున్నారని, కాని, వారు మన దేశంలో ఉండేందుకు మాత్రం ఇష్టపడడం లేదన్నారు. యంగ్ ఇండియా మనస్తత్వాన్ని విరాట్ కోహ్లీతో పోల్చారు. పరోక్షంగా కోహ్లీలా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాలనుకుంటున్నారని చెప్పారు. దేశంలో దశాబ్దాలుగా నిరుద్యోగ సమస్య పెరుగుతూ వస్తోందన్నారు. దీన్ని విస్మరిస్తే పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు. పీహెచ్డీ చేసినవారు సైతం రైల్వేలో ప్యూన్ జాబ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని రాజన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
Credit Card: ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులకు కూడా దాన్ని విస్తరించేందుకు క్రమంగా సిద్ధమవుతున్నాయి. -
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా