Indian Economy: రాబోయే కొన్నేళ్లలో 10 ట్రిలియన్ డాలర్ల భారత్: WEF అధ్యక్షుడు
Indian Economy: భారత్లో మరెక్కడా కనిపించని ఆశావహ దృక్పథం కనిపిస్తోందని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గే బ్రెండే తెలిపారు. మరికొన్నేళ్లలో ఈ దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేశారు.
దిల్లీ: రాబోయే కొన్నేళ్లలో భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (Indian Economy) అవతరిస్తుందని ‘ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)’ అధ్యక్షుడు బోర్గే బ్రెండే అంచనా వేశారు. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానానికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్లో ఉన్న ఆశావహ దృక్పథం ప్రస్తుతానికి ప్రపంచంలో మరెక్కడా కనిపించడం లేదని గురువారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
సమయం వచ్చినప్పుడు భారత ప్రభుత్వ సహకారంతో డబ్ల్యూఈఎఫ్ ఇండియా సమ్మిట్ ద్వారా తిరిగి దేశానికి రావాలనుకుంటున్నట్లు బ్రెండే తెలిపారు. ఏటా జనవరిలో దావోస్ కేంద్రంగా జరిగే డబ్ల్యూఈఎఫ్ (WEF) సమావేశానికి ప్రధాని మోదీకి (PM Modi) ఎప్పటికీ ఆహ్వానం ఉంటుందని తెలిపారు. భారత్ కొన్నేళ్లపాటు ఏడు శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేశారు. గతకొంతకాలంగా దేశంలో కీలక సంస్కరణలు చోటుచేసుకున్నాయని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) సైతం ఊపందుకున్నాయని పేర్కొన్నారు. తయారీ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా నేడు సంప్రదాయ పద్ధతిలో కంటే డిజిటల్ వాణిజ్యమే వేగంగా విస్తరిస్తోందని బ్రెండే తెలిపారు. ఈ తరుణంలో డిజిటల్ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని కొనియాడారు. మరోవైపు వచ్చే కొన్నేళ్లలో అంతర్జాతీయ వేదికలపై దౌత్యపరంగా భారత్ తనదైన పాత్ర పోషిస్తుందన్నారు. చాలా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం నుంచి భారత్ దూరంగా ఉండగలిగిందన్నారు. పొరుగు దేశాలతో సవాళ్లు ఎదురైనప్పటికీ.. వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగిందని తెలిపారు.
ఐదేళ్ల పాటు ఆరు శాతం వృద్ధి: జెఫరీస్
భారత్ 2027 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (Indian Economy) అవతరిస్తుందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జెఫరీస్ అంచనా వేసింది. తద్వారా జర్మనీ, జపాన్ను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. 2030 నాటికి పది ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్ను విస్మరించడం సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడింది. జీఎస్టీ అమలు, దివాలా స్మృతి చట్టం, రెరా, నోట్ల రద్దు వంటి కీలక సంస్కరణల ప్రభావం ఉన్నప్పటికీ.. భారత జీడీపీ వృద్ధి పథంలో సాగిందని వివరించింది.
వచ్చే ఐదేళ్ల పాటు భారత్ ఆరు శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తుందని జెఫరీస్ తెలిపింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధి క్షీణించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు వచ్చే ఐదు నుంచి ఏడేళ్ల పాటు 8-10 శాతం రాబడినిస్తాయని అంచనా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు