TCS,IIT Mumbai: దేశంలోనే తొలి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్
సెమీకండక్టర్ చిప్ల కోసం దేశంలోనే తొలి అధునాతన సెన్సింగ్ పరికరాన్ని నిర్మించే నిమిత్తం ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఐఐటీ బాంబే మంగళవారం చేతులు కలిపాయి.
నిర్మాణం కోసం టీసీఎస్, ఐఐటీ బాంబే జట్టు
ముంబయి: సెమీకండక్టర్ చిప్ల కోసం దేశంలోనే తొలి అధునాతన సెన్సింగ్ పరికరాన్ని నిర్మించే నిమిత్తం ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఐఐటీ బాంబే మంగళవారం చేతులు కలిపాయి. దీని ద్వారా చిప్ వైఫల్యాలను తగ్గించొచ్చని, ఎలక్ట్రానిక్ పరికరాల సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని టీసీఎస్ పేర్కొంది. దేశంలోనే తొలి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ను నిర్మించడానికి ఐఐటీ బాంబేతో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నామని వివరించింది. వచ్చే రెండేళ్లలో పీక్వెస్ట్ ల్యాబ్లో క్వాంటమ్ ఇమేజింగ్ ప్లాట్ఫారాన్ని అభివృద్ధి చేసేందుకు ఐఐటీ బాంబే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ కస్తూరి సాహాతో కలిసి టీసీఎస్ నిపుణులు పనిచేస్తారు.
ఇలా పనిచేస్తుంది: క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ అనేది ఆసుపత్రుల్లో ఎమ్ఆర్ఐ స్కాన్లాగా అయస్కాంత క్షేత్రాలను చిత్రీకరించగలదు. ఈ సాంకేతికతతో సంప్రదాయ సెన్సింగ్ పద్ధతుల్లో ఎదురయ్యే ఇబ్బందులనూ ఇట్టే పసిగట్టేయవచ్చు.
ఏమిటి ఉపయోగం: ప్రస్తుతం అన్ని ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల్లో సెమీకండక్టర్ చిప్లు ఉంటున్నాయి. ఈ అధునాతన సెన్సింగ్ టూల్తో సెమీకండక్టర్ చిప్ల పరీక్షలో కొత్త స్థాయిలకు చేరొచ్చని, చిప్ వైఫల్యాలను తగ్గించొచ్చని ఐఐటీ బాంబే తెలిపింది. కృత్రిమ మేధ/మెషీన్ లెర్నింగ్ను క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోపీతో కలగలపడం ద్వారా తయారు చేసే క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ ద్వారా క్వాంటమ్ విప్లవాన్ని మరో అడుగు ముందుకు వేయించవచ్చని సాహా పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య సంరక్షణ రంగంతో పాటు వివిధ రంగాల్లో మార్పు తీసుకురావడమే తమ ఉద్దేశమని తెలిపారు. పలు పరిశ్రమలతో పాటు, సమాజాన్ని సైతం ఈ భాగస్వామ్యం మార్చగలుగుతుందని టీసీఎస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ) హారిక్ విన్ ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ