Future india: భారత్ భవిత ఉజ్వలం
పదేళ్ల తరవాత భారత్ భవితపై అంచనాను ‘స్థిరత్వం’ నుంచి సానుకూలానికి ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ పెంచింది.
‘స్థిరత్వం’ నుంచి ‘సానుకూలానికి పెంచిన ఎస్అండ్పీ
దిల్లీ: పదేళ్ల తరవాత భారత్ భవితపై అంచనాను ‘స్థిరత్వం’ నుంచి సానుకూలానికి ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ పెంచింది. వచ్చే మూడేళ్లలో దేశం బలమైన వృద్ధిని నమోదు చేయొచ్చన్న అంచనాలు, ద్రవ్య స్థిరీకరణకు చేపడుతున్న చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచుతూ సంస్కరణ విధానాలను కొనసాగిస్తే, రెండేళ్లలో రేటింగ్ను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం మాత్రం తక్కువ పెట్టుబడుల రేటింగ్ అయిన ‘బీబీబీ-’ను ఎస్అండ్పీ కొనసాగించింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా వృద్ధికి తోడ్పడే ఆర్థిక సంస్కరణలు, విధాన నిర్ణయాలు, మౌలిక సదుపాయాలపై వ్యయ కేటాయింపులను కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది.
2014 తర్వాత మళ్లీ పెంపు ఇప్పుడే..
దేశ రుణ చెల్లింపు సామర్థ్యానికి ప్రామాణికంగా రేటింగ్ను మదుపర్లు భావిస్తుంటారు. దేశ రుణ వ్యయాలపై ఇది ప్రభావం చూపుతుంది. 2014లో భారత్ భవితపై అంచనాను ‘ప్రతికూలం’ నుంచి ‘స్థిరత్వం’కు ఎస్అండ్పీ మెరుగు పరచింది. తదుపరిద్రవ్య నిర్వహణ మెరుగుపడటం, బలమైన ఆర్థిక మూలాలు, అధిక విదేశీ మారకపు నిల్వలను చూపుతూ, మన దేశ రేటింగ్ పెంచాల్సిందిగా ఆర్థిక శాఖ కూడా రేటింగ్ సంస్థలపై ఒత్తిడి తెస్తూనే ఉంది. ప్రభుత్వానికి ఆర్బీఐ ఇటీవల రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్ల డివిడెండును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన వారంలోనే ఎస్అండ్పీ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఆర్బీఐ నిధుల వల్ల కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు తగ్గే అవకాశం ఉంటుంది. 2025 మార్చి కల్లా ద్రవ్యలోటును జీడీపీలో 5.1 శాతానికి, 2026 మార్చి కల్లా 4.5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు- ఎస్అండ్పీ, ఫిచ్, మూడీస్లు మనదేశానికి తక్కువ పెట్టుబడి రేటింగ్ను కొనసాగిస్తున్నాయి. మూడీస్, ఫిచ్లు స్థిరత్వంతో కూడిన అంచనాతో ఉన్నాయి.
మౌలికంపై అధిక వ్యయాలతో వృద్ధికి ఊతం
ప్రభుత్వం తన వ్యయ కేటాయింపుల్లో అధిక భాగాన్ని మౌలిక సదుపాయాలపై వెచ్చిస్తుండటం వల్ల, దేశం అధిక వృద్ధి దిశగా వెళ్లే మార్గంలో అవరోధాలు తగ్గుతున్నాయని ఎస్అండ్పీ అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థలో బలమైన వృద్ధి, ఆ దేశ రుణ సామర్థ్యంపై సానుకూల ప్రభావాన్ని తీసుకొస్తుందని పేర్కొంది. ద్రవ్య, పరపతి విధాన నిర్ణయాల విషయంలో అప్రమత్తతతో వ్యవహరిస్తుండటం వల్ల ప్రభుత్వ రుణ స్థాయిలు, వడ్డీ భారం దిగివచ్చేందుకు దోహదం చేస్తున్నాయని విశ్లేషించింది. ఈ అంశాలన్నీ రాబోయే 24 నెలల్లో దేశ రేటింగ్ పెంపునకు ఉపకరించే అవకాశం ఉందని తెలిపింది. కొవిడ్-19 పరిణామాల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ గణనీయ స్థాయిలో పుంజుకుందని ఎస్అండ్పీ తెలిపింది. ఈ ఏడాదికి భారత జీడీపీ వృద్ధిని 6.8 శాతంగా సంస్థ అంచనా వేసింది. అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ, వర్థమాన దేశాలతో పోలిస్తే ఇది మెరుగైన వృద్ధి రేటుగా పేర్కొంది. గత మూడు సంవత్సరాల్లో భారత వాస్తవ జీడీపీ వృద్ధి సగటున ఏడాదికి 8.1 శాతమని, ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే ఇది అత్యధికమని తెలిపింది. మధ్యకాలంలోనే భారత్ పురోగతి ఇలాగే కొనసాగొచ్చని రాబోయే మూడేళ్లలో సగటున 7% వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పరిణామం భారత జీడీపీలో రుణ నిష్పత్తి తగ్గేందుకు తోడ్పడుతుందని, అయితే ద్రవ్యలోటు మాత్రం ఎక్కువగానే కొనసాగుతుందని వివరించింది. గత 4-5 ఏళ్లలో ప్రభుత్వ వ్యయాల్లో నాణ్యత మెరుగయ్యిందని తెలిపింది. ప్రభుత్వ వ్యయాలు, వినియోగంలో వృద్ధి వచ్చే 3-4 ఏళ్లలో బలమైన వృద్ధికి దారి చూపుతాయని పేర్కొంది.
6 బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలపైనా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండియన్ బ్యాంకులపై భవిష్యత్ అంచనాలను ‘స్థిరత్వం’ నుంచి ‘సానుకూలం’కు పెంచుతూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్పై రేటింగ్ అంచనాలను కూడా ‘స్థిరత్వం’ నుంచి ‘సానుకూలం’కు మార్చింది. ఈ సంస్థలకు ‘బీబీబీ-’ రేటింగ్ను కొనసాగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం