Stock market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు.. తొలిసారి 23వేల ఎగువకు నిఫ్టీ

Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 7 పాయింట్లు, నిఫ్టీ 10.55 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 24 May 2024 16:07 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. నిన్నటి భారీ లాభాలతో సరికొత్త రికార్డులను నమోదు చేసిన సూచీలు.. శుక్రవారం కూడా ఇంట్రాడేలో సరికొత్త గరిష్ఠాలను అందుకున్నాయి. సెన్సెక్స్‌ 75,636.5 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను తాకగా.. నిఫ్టీ తొలిసారి 23 వేలు దాటి 20,026 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. ఆపై సూచీలు దిగువకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలూ ఇందుకు కారణమయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 75,335.45 (క్రితం ముగింపు 75,418) పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమై.. తర్వాత లాభాల్లోకి వెళ్లింది. ఇంట్రాడేలో 75,244.22 - 75,636.50 మధ్య కదలాడిన సూచీ.. చివరికి 7.65 పాయింట్ల నష్టంతో 75,410.39 పాయింట్ల వద్ద ముగిసింది. నిప్టీ 10.55 పాయింట్లు కోల్పోయి 22,957.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.10గా ఉంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్ షేర్లు ప్రధానంగా లాభపడగా.. ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్ ధర 80.76 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. ఔన్సు బంగారం ధర 2,340 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని