IndiGo: ఇండిగో విమానాల్లో ఇక బిజినెస్ క్లాస్
IndiGo: ఇండిగో విమానాల్లో త్వరలో ప్రీమియం క్లాస్ ప్రయాణాలు అందుబాటులోకి రానున్నాయి. ఏడాది చివరి నాటికి బిజినెస్ క్లాస్ సేవలు అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
దిల్లీ: దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరికి తమ విమానాల్లో బిజినెస్ క్లాస్ (Business Class) సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం నాటి మార్కెట్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. తొలుత రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు సంస్థ (IndiGo) తెలిపింది.
బిజినెస్ క్లాస్ సేవల ప్రారంభ తేదీ, ఆఫర్లు, ఏయే మార్గాల్లో అందుబాటులో ఉండనున్నాయనే సమాచారాన్ని.. ఈ ఏడాది ఆగస్టులో జరిగే సంస్థ 18వ వార్షికోత్సవ కార్యక్రమంలో వెల్లడిస్తామని పేర్కొంది. ప్రయాణికులకు నిరంతరం వినూత్న సేవలు అందించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు.
‘‘ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నవ భారత్లో పౌరులకు మరింత మెరుగైన ప్రయాణ అవకాశాలు కల్పించడం మేం గర్వంగా భావిస్తాం. ఈ కొత్త సేవలను ప్రారంభించేందుకు మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని సీఈవో హర్షం వ్యక్తంచేశారు.
ప్రాంతీయ మార్గాల్లో సేవలను విస్తరించే లక్ష్యంతో కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఇటీవల ఇండిగో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 3 విమాన తయారీ సంస్థలు ఏటీఆర్, ఎంబ్రాయిర్, ఎయిర్బస్లతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దేశీయ విమానయాన విపణిలో ఇండిగోకే 60శాతం మార్కెట్ వాటా ఉంది. ఈ ఏడాది కంపెనీ మార్కెట్ విలువ కూడా రూ.1.76 లక్షల కోట్లకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి
ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్ రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి సారించింది. దీనికి తగ్గట్లుగా పెట్టుబడులు సిద్ధం చేస్తోంది. -
కొత్త వ్యాపారాల్లో అయిదింతల వృద్ధి లక్ష్యం
వ్యాపారాల విలువను గణనీయంగా పెంచుకోవడంపై మహీంద్రా గ్రూపు దృష్టి సారిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ అనిశ్ షా తెలిపారు. -
నియంత్రణ పటిష్ఠమైనా మోసాలు తగ్గట్లేదు: కేపీఎంజీ సర్వే
నియంత్రణ చర్యల్లో పలు మార్పులు చేసినా, మోసాల సంఖ్య తగ్గడం లేదని తమ సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది వెల్లడించినట్లు కేపీఎంజీ వెల్లడించింది. -
తాజా ఉత్తీర్ణులకు హుషారే
గత ఆరు నెలల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్) నియామకాలు 5% పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగ పరిస్థితి క్రమంగా మెరుగవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. -
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్ యాంపీర్ నెక్సస్
గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్కు చెందిన ఇ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రై.లి. తన ఫ్యామిలీ విద్యుత్ స్కూటర్ యాంపీర్ నెక్సస్ను ఆవిష్కరించింది. -
అవిన్యా బ్రాండ్పై టాటా ప్రీమియం విద్యుత్తు కార్లు
టాటా మోటార్స్, ప్రీమియం విద్యుత్తు కార్లను అవిన్యా బ్రాండ్పై ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం. -
సంక్షిప్త వార్తలు(7)
ఈ ఏడాది, వచ్చే సంవత్సరానికి అంతర్జాతీయంగా ముడిచమురు వినియోగ అంచనాల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా వెల్లడించింది. 2024లో రోజుకు 2.25 మిలియన్ బ్యారెళ్లు, వచ్చే ఏడాదిలో రోజుకు 1.85 మిలియన్ బ్యారెళ్ల చొప్పున చమురుకు గిరాకీ పెరుగుతుందన్నది ఒపెక్ అంచనా. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
ఇంటిపై రుణం ఇచ్చే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి?
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పవన్ కల్యాణ్కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్.. అదేంటంటే?
-
దర్శన్, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్ ఏమన్నారంటే..
-
ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు: మంత్రి సత్యకుమార్
-
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా: నారా లోకేశ్
-
రామోజీరావు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి: ఎం. నాగేశ్వరరావు