Union Budget 2024: సౌర విద్యుత్తు.. ఇక మధ్య తరగతి ఆదాయ వనరు: నిర్మలా సీతారామన్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన సాధారణ, మధ్యతరగతి ప్రజలకు ఆదాయ వనరుగా మారుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సౌర విద్యుత్తు రంగానికి రూ.7,327 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
ఇంటర్నెట్డెస్క్: దేశవ్యాప్తంగా కోటి ఇళ్లు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ ప్రసంగంలో (Union Budget 2024) పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ (pradhanmantri suryoday yojana) పథకం కింద రూఫ్ టాప్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం ద్వారా దీనిని సాకారం చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా బడ్జెట్లో సౌర విద్యుత్తు రంగానికి రూ.7,327 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో కేటాయించిన రూ.4,979 కోట్ల కంటే దాదాపు 48 శాతం ఎక్కువ. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ‘రూఫ్ టాప్ సోలార్’ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్ర మంత్రి సభకు వివరించారు.
సాధారణ, మధ్య తరగతి కుటుంబాలు తమ ఇళ్లపై ఏర్పాటు చేసే సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును గృహావసరాలకు వినియోగించుకోవడమే కాకుండా, మిగిలిన విద్యుత్తును డిస్కంలకు విక్రయించుకునే వీలుందని సీతారామన్ చెప్పారు. తద్వారా ప్రతి కుటుంబం ఏడాదికి రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఆదాయాన్ని పొందొచ్చన్నారు. గత కొంతకాలంగా విద్యుత్తు వాహనాలకు గిరాకీ ఏర్పడటంతో సోలార్ పవర్తో ఛార్జింగ్ పెట్టేలా కొత్త స్టేషన్లు వస్తాయన్నారు. వాటి వల్ల ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఆత్మనిర్భర్ భారత్కు అనుగుణంగా ఆర్థిక వృద్ధిని సాధించేందుకు దోహదం చేస్తుందని సీతారామన్ అన్నారు.
సామర్థ్యం, నైపుణ్యం, నియంత్రణ తదితర అంశాలను బేరీజు వేసుకుంటూ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సున్నా కర్బన ఉద్గారాలే లక్ష్యంగా విండ్ ఎనర్జీ ఉత్పత్తికి వీజీఎఫ్ (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్) విధానాన్ని అవలంబించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా విద్యుత్తు ఉత్పత్తి సంస్థలను నిర్వహిస్తాయి. 2030 నాటికి 500 గిగా వాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించడంలో సోలార్ పవర్ కీలక పాత్ర పోషిస్తుందని సీతారామన్ అన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు దేశం చేస్తున్న ప్రయత్నాల్లో సోలార్ పవర్ ఉత్పత్తి కీలక అంశమని పేర్కొన్నారు.
అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కోటి గృహాలకు సౌర విద్యుత్తు సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో దీనిని తీసుకొచ్చినట్లు చెప్పారు. సౌర శక్తిని వినియోగించుకోవడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజల విద్యుత్తు బిల్లులు తగ్గడమే కాకుండా ఇంధన రంగంలో మన దేశం స్వావలంబన దిశగా ముందడుగు వేస్తుందని ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?